India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ–విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడనుంది. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కేంద్రంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో <<12982731>>ఘోర ప్రమాదం<<>> సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుగురికి పెరిగింది. 15 మందికి గాయాలవ్వగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు.. ఎండీ, డైరెక్టర్ రవికుమార్ (హైదరాబాద్), ప్రొడక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం (36), దయానంద్ (48), సురేష్పాల్ (43), కార్మికుడు విష్ణు (35)గా గుర్తించారు. ఈ పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు.

మెదక్ మున్సిపాలిటీలో BRS పార్టీకి బిగ్షాక్ తగిలింది. ముగ్గురు కౌన్సిలర్లు మేడి కళ్యాణి మధుసూదన్ రావు, వసంత రాజ్, జయ శ్రీ దుర్గాప్రసాద్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యులు మందుగుల గంగాధర్.. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ మధుసూదన్ రావు, మాజీ డైరెక్టర్ కొండా శ్రీనివాస్, నాయకులు బోయిని విక్రం, స్టీవెన్ ఉన్నారు.

వేసవిలో వేడి గాలులు వచ్చే అవకాశం ఉందన్న వడదెబ్బకు దూరంగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను బుధవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు సాధ్యమైనంత వరకు రావద్దని చెప్పారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శశాంక్ దేశ్పాండే పాల్గొన్నారు.

మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్పల్లికి గ్రామానికి చెందిన అరికెల కృష్ణ(36) కనిపించకుండా పోయాడు. మంగళవారం భార్య అనితతో గొడవ పడిన కృష్ణ ఫోన్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమాయ్యారు. ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నాయకులు రాజిరెడ్డి, సుహాసిని రెడ్డి, హన్మంత్ రావు, నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మల పాల్గొన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా భారతి హొళికేరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు భారతి హొళికేరిని నియమిస్తూ జీవో జారీ చేశారు. వీరు వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు, సమస్య ఏర్పడితే పరిష్కారంపై దృష్టి సారించనున్నారు.

హరీశ్రావు ఇలాకా సిద్దిపేటలో BRSకు షాక్ తగిలింది. స్థానిక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు BRS పార్టీ కౌన్సిలర్లు సాకి బాలక్ష్మి ఆనంద్, ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి, మహమ్మద్ రియాజ్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. BRS పార్టీకి కేంద్ర బిందువుగా ఉన్న సిద్దిపేటలో కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో నీలం మధు కూడా ఉన్నారు.

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధి శెట్టిపల్లి కలాన్ శివారులో కొబ్బరి తోటలో పనిచేసేందుకు వచ్చిన వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని వడ్లమూరుకు చెందిన వెంకటరమణ, భాగ్యలక్ష్మి దంపతులు 3 నెలల క్రితం తోటలో పని చేసేందుకు వచ్చారు. రాత్రి మద్యం సేవించి రాగా భార్య గొడవ చేయడంతో బయటకు వెళ్లి విషం తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నిన్న బీజేపీలో చేరి, బుధవారం తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి సమక్షంలో కిషన్ రెడ్డి, మల్ రెడ్డి, బాల్రెడ్డి, కిరణ్ రెడ్డి, తదితరులకు పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. వారు మాట్లాడుతూ.. బలవంతంగా నిన్న బీజేపీ కండువా కప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతామన్నారు.
Sorry, no posts matched your criteria.