Medak

News August 2, 2024

ఇంటింటా ఇన్నోవేటర్ 2024′ దరఖాస్తు గడువు పొడగింపు

image

ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునే గడువును ఆగస్ట్ 10 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రకటించింది. ఆవిష్కర్తలు, అంకురాలకు, వ్యవస్థాపకులకు సమ్మిళిత ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటి ప్రతిస్పందనగా గుర్తించబడిందని ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ అన్నారు.

News August 2, 2024

BREAKING: MDK: 9వ తరగతి బాలిక ఆత్మహత్య

image

HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న బాలిక(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలాజీనగర్‌లోని ఇంటికి ఆమె ఇటీవల రావడంతో శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో గురువారం రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 2, 2024

MDK: 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదని చనిపోయాడు!

image

తనకు 35 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పేట్ బషీరాబాద్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా నార్సింగి వాసి వేణు ప్రసాద్(35) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తల్లితో కలిసి కొంపల్లి పరిధి గాంధీనగర్‌లో ఉంటున్నాడు. పెళ్లి కావడం లేదని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News August 2, 2024

MDK: రైతురుణ మాఫీ.. పరిస్థితి ఇలా!

image

రైతు రుణమాఫీలో భారీగా కోతలు పడడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో గందరగోళం నెలకొంది. జాబితాలో పేరు లేకపోవడంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. DCCB పరిధిలో 2వ విడత మాఫీకి అర్హులైన రైతులు 8,820 మంది ఉండగా, రూ.108కోట్లు మాఫీ కావాలి. 6258 మందికి రూ.50.38కోట్లు రుణమాఫీ అయ్యింది. మిగిలిన 2,562 మంది అర్హులైన రైతులకు రూ.58కోట్లు మాఫీ కాలేదు. దీంతో మాఫీకాని రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

News August 2, 2024

మెదక్: గుండెపోటుతో రైతు మృతి

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన రామ్ రెడ్డి అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. అయితే సంగారెడ్డి కెనాల్ నిర్మాణంలో రెండు ఎకరాల భూమి కోల్పోతున్నానని గత కొంతకాలంగా ఆందోళనకు గురవుతున్న రాంరెడ్డి రైతులు చేస్తున్న దీక్షలో సైతం పాల్గొన్నారు. గత రాత్రి ఇంట్లో భూమి విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News August 2, 2024

MDK: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట మోసం

image

గుర్తు తెలియని యాప్‌లో ట్రేడింగ్ చేసి ఓవ్యక్తి రూ.లక్షలు పోగొట్టుకున్న ఘటన తూప్రాన్‌లో జరిగింది. SI శివానందం ప్రకారం.. పట్టణంలో వ్యాపారం చేసే ఓవ్యక్తి ఇన్‌స్టాలో వచ్చిన లింక్‌తో ఓ వాట్సాప్ గ్రూపులో యాడై IIFL అనే యాప్ డౌన్లోడ్ చేశాడు. పలు దఫాలుగా అందులో రూ.15లక్షల వరకు ట్రేడింగ్ చేయగా.. రూ.95లక్షలు ప్రాఫిట్ వచ్చింది. అయితే డబ్బు విత్ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

News August 2, 2024

మెదక్ జిల్లాలో పెరుగుతున్న జ్వరాలు

image

వర్షాకాలం నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. వారం రోజుల ముసురు వానతో వాతావరణ మార్పులు జరిగి జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని వివిధ గ్రామాలలో రోగులు ఎక్కువ అవుతున్నారు. హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. నిత్యం 300లకు పైగా ఓపీ నమోదవుతోంది.

News August 2, 2024

MDK: నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 విద్యాసంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సెప్టెంబర్ 16లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.navodaya.gov.in వెబ్ సైట్ చూడాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 2, 2024

సిద్దిపేట: ‘విశ్వకర్మ పథకంపై వెరిఫికేషన్ వేగవంతం చేయాలి’

image

ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకానికి సంభందించిన ఆయా విభాగాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం అప్లికేషన్లు 5479 వచ్చాయని, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గణేష్ రాం కలెక్టర్‌కు తెలిపారు.

News August 1, 2024

సంగారెడ్డి: న్యాయవాదుల క్రీడలు ప్రారంభించిన జిల్లా జడ్జి

image

సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో న్యాయవాదుల క్రీడలను జిల్లా జడ్జి భవాని చంద్ర గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి అశోక్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.