India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. గజ్వేల్ ACP పురుషోత్తం రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. అనంతగిరిపల్లికి చెందిన యాదమ్మ(40) భర్త చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన చిన్నలక్ష్మయ్యతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టింది. దీంతో ఈనెల 15న కోమటిబండ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కల్లులో పురుగు మందు కలిపి తాగించాడు. అనంతరం చీరతో ఉరేశాడు. నిందితుడిని రిమాండ్కు తరలించారు.
మెదక్ జిల్లాలోని అన్ని బోర్డు స్కూల్స్ (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ)లో 2025-26 గాను 1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం ఆదేశించిందని డీఈవో రాధాకృష్ణ తెలిపారు. ద్వితీయ భాష- సింగిడి, తృతీయ భాష- వెన్నెల పుస్తకాలు బోధించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమన్యాలు దీనిని అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
నర్సాపూర్ మండలంలోని తుజాల్ పూర్-అర్జు తాండాకు చెందిన హలవత్ గణేష్(42) ఉరేసుకొని మృతిచెందారు. కూతురు పెళ్లికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో బాధపడేవాడని, ఇంటికి కొద్ది దూరంలో వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకున్నాడు. ఈమేరకు అతడి భార్య హలావత్ సాలమ్మ ఫిర్యాదు చేసిందని నర్సాపూర్ ఎస్సై బి.లింగం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఏడుపాయల మహా జాతర అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడుతుంది. నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలతో అమ్మవారి ప్రాంగణం వన దుర్గ మాత నామస్మరణతో పోరెత్తుతోంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారి మొక్కలు చెల్లించుకోవడానికి ముందుకు సాగుతున్నారు. బోనాలతో ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.
మెదక్ జిల్లాలో జరగబోయే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులపాటు జరిగే మహా జాతర ప్రారంభం కాగా రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఏడుపాయల చేరుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఉపవాస దీక్షలు విటమించారు. జై దుర్గా, వన దుర్గా అంటూ భక్తుల నినాదాలు మారు మ్రోగాయి. క్యూ లైన్లలో భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉన్నారు.
మెదక్ సీఎస్ఐ చర్చ్ రిటైర్డ్ గురువు రాబిన్ సన్ మెదక్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన రాబిన్సన్ మెదక్ సీఎస్ఐ చర్చిలో 2010 నుంచి 2019 వరకు ప్రిసిబిటరి ఇన్ఛార్జ్గా పనిచేశారు. మెదక్ అధ్యక్ష మండలంలో వైస్ ఛైర్మన్గా, మినిస్ట్రియల్ కన్వీనర్గా తదితర పదవుల్లో పనిచేశారు.
పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గమాత వద్ద భారీ ఎత్తున జాతర ఉత్సవాల నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి, మెదక్ డిఎస్పీ, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు.
రేపు జరుగనున్న MLC ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో మొత్తం పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 8 రూట్లలో ఆయుధ పహారాలో పోలింగ్ సామాగ్రిని తరలించడం జరుగుతుందన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, QRTలు, డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.