Medak

News February 26, 2026

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్ పాల్గొన్నారు.

News February 26, 2026

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్ పాల్గొన్నారు.

News February 26, 2026

మెదక్: రూ.2.71 లక్షల టాక్స్ చెల్లించిన ఆర్టీసీ

image

మెదక్ ఆర్టీసీ డిపోకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ రూ. 2,71,801 చెక్కును డిపో మేనేజర్ సురేఖ బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

News February 25, 2026

మెదక్ జిల్లాకు టెన్త్ మూల్యాంకన కేంద్రం కేటాయింపు

image

మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ. విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

News February 25, 2026

మెదక్: తొలిరోజు 99.42 శాతం

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.

News February 25, 2026

మెదక్: పరీక్షా కేంద్రాల సందర్శించిన ఎస్పీ

image

నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు.

News February 25, 2026

మెదక్ పోలీసులకు 6 Medals

image

తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన 4వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ పోలీసులు 6 రజత పతకాలు సాధించారు. టెన్నిస్‌లో రాథోడ్ రమేశ్ సింగిల్స్, డబుల్స్, గ్రూప్ ఈవెంట్స్‌లో హ్యాట్రిక్ రజతాలు గెలిచారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు విజేతలను సత్కరించి అభినందించారు. కబడ్డీలో భవాని, వీణ, సుష్మ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు.

News February 25, 2026

మెదక్: ‘ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి’

image

మెదక్ జిల్లాలో నేటి నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు.
మొత్తం విద్యార్థులు -12,334
ఫస్ట్ ఇయర్ జనరల్ -5710
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ -599
మొత్తం -6309
సెకండ్ ఇయర్ జనరల్ -5472
సెకండ్ ఇయర్ ఒకేషనల్- 533
మొత్తం-6025
పరీక్ష కేంద్రాలు -28
ఫ్లైయింగ్ స్క్వాడ్ -5
సిట్టింగ్ స్క్వాడ్ -4
ఏర్పాటు చేసినట్లు మాధవి వివరించారు.

News February 25, 2026

మెదక్: ‘ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి’

image

మెదక్ జిల్లాలో నేటి నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు.
మొత్తం విద్యార్థులు -12,334
ఫస్ట్ ఇయర్ జనరల్ -5710
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ -599
మొత్తం -6309
సెకండ్ ఇయర్ జనరల్ -5472
సెకండ్ ఇయర్ ఒకేషనల్- 533
మొత్తం-6025
పరీక్ష కేంద్రాలు -28
ఫ్లైయింగ్ స్క్వాడ్ -5
సిట్టింగ్ స్క్వాడ్ -4
ఏర్పాటు చేసినట్లు మాధవి వివరించారు.

News February 25, 2026

మెదక్: ‘ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి’

image

మెదక్ జిల్లాలో నేటి నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు.
మొత్తం విద్యార్థులు -12,334
ఫస్ట్ ఇయర్ జనరల్ -5710
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ -599
మొత్తం -6309
సెకండ్ ఇయర్ జనరల్ -5472
సెకండ్ ఇయర్ ఒకేషనల్- 533
మొత్తం-6025
పరీక్ష కేంద్రాలు -28
ఫ్లైయింగ్ స్క్వాడ్ -5
సిట్టింగ్ స్క్వాడ్ -4
ఏర్పాటు చేసినట్లు మాధవి వివరించారు.