Medak

News July 29, 2024

మమ్మల్ని వీడియోలో చూపించండి: హరీశ్‌రావు

image

ప్రస్తుతం అసెంబ్లీ కొనసాగుతోంది. కాగా సభ ప్రారంభించే ముందు MLA హరీశ్‌రావు మాట్లాడుతూ.. BRS ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు వీడియోలో చూపించడం లేదని ప్రజలే చెబుతున్నారని అనడంతో కుత్బుల్లాపూర్ MLA వివేకానంద అవునని అన్నారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. అలా అనడం పొరపాటని, అందరినీ పర్‌ఫెక్ట్‌గా చూపిస్తున్నామని సమాధానం ఇచ్చారు.

News July 29, 2024

BREAKING: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం హుసెల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్-బీదర్ రహదారిపై ట్రక్కు కారును ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో సహా మహిళ మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులు కర్ణాటకలోని బీదర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News July 29, 2024

MDK: ట్రాన్స్‌ఫార్మర్ ముట్టుకొని సూసైడ్

image

శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన సోము శివ (21) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బోనాల పండుగ సందర్భంగా అందరూ ఉత్సవాల్లో ఉండగా.. శివ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి వైర్లు పట్టుకోగా విద్యుత్ ఘాతం జరిగి మృతి చెందాడు. గత ఏడాది బోనాల పండుగ రోజే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకోగా చేయి కోల్పోయాడు. ఈసారి ప్రాణాన్నే కోల్పోయాడు

News July 29, 2024

మెదక్: గుండెపోటుతో రికార్డ్ అసిస్టెంట్ మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రెవెన్యూ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ చెంది సురేశ్ (28) గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మృతి చెందారు. వీఆర్ఏగా పనిచేస్తున్న సురేశ్ ఏడాది క్రితం రికార్డ్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది మనోహరాబాద్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్నారు. సాయంత్రం గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఏడాది క్రితమే సారికతో వివాహమైంది.

News July 29, 2024

సంగారెడ్డి: నేటి ప్రజావాని కార్యక్రమం రద్దు

image

సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రాల్లో, ఆర్డోవో కార్యాలయాల్లో నేడు జరగవలసిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. బోనాల పండుగ సాధారణ సెలవు ఉండడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. వచ్చే సోమవారం నుంచి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News July 28, 2024

‘జులై 30న రెండవ విడత రైతు రుణమాఫీ విడుదల’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ రెండవ విడత నిధులను ప్రభుత్వం జులై 30న ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో విడుదల చేస్తారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందన్నారు.

News July 28, 2024

మెదక్: జిల్లాలో ఇక స్థానిక ఎన్నికల జోష్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News July 28, 2024

మెదక్: జిల్లాలో ఇక స్థానిక ఎన్నికల జోష్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News July 28, 2024

అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి: మంత్రి పొన్నం

image

లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరి మీద ఉండాలనీ కోరుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి జరుగుతున్న దశాబ్ది బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు.

News July 28, 2024

పటాన్‌చెరు: ప్రేమ పెళ్లి.. 6 నెలలకే వివాహిత సూసైడ్

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న 6నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్పూర్‌లో జరిగింది. APలోని గుంటూరుకు చెందిన హర్షిత, ఎడ్లపాడు చెందిన మహేశ్ పేరెంట్స్ సమక్షంలో ఫిబ్రవరి 23న పెళ్లి చేశారు. అమీన్పూర్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటుండగా మహేశ్‌కు ఉద్యోగం లేకపోవడంతో హర్షిత తండ్రి నెలకు రూ.30వేలు పంపాడు. ఇటీవల IT జాబ్ వచ్చినా మహేశ్ వెళ్లకపోగా ఆస్తిలో వాటా కోసం భార్యను వేధించగా మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది.