Medak

News July 26, 2024

రామాయంపేట: చిరుతపులి దాడిలో ఆవు మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో చిరుతపులి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి గ్రామానికి చెందిన కొత్తగారి రమేశ్ తన వ్యవసాయ పొలం వద్ద పశువును కట్టేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఆ పశువుపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. ఉదయం పొలం వద్దకు వెళ్లిన రమేశ్ గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. జిల్లాలో చిరుత సంచారంతో జనం ఆందోళన చెందుతున్నారు.

News July 26, 2024

వడ్డీ కట్టాకే రైతు రుణమాఫీ: హరీశ్ రావు

image

రైతు రుణమాఫీ అంశంపై MLA హరీశ్‌రావు X వేదికగా స్పందించారు. ‘DEC 9న రుణమాఫీ చేస్తామని 7నెలల తర్వాత ప్రక్రియను ప్రారంభించడంతో రైతులకు కొత్త సమస్యలు వస్తున్నాయి. 7నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారు. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. శివంపేట్ మం. చెందిన ఓ రైతు క్రాప్ లోన్‌ను, రూ.9వేలు మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు’అని అన్నారు.

News July 26, 2024

ప్రియుడు మృతి.. ప్రియురాలు సూసైడ్

image

సిద్దిపేట జిల్లా <<13707142>>లింగారెడ్డిపల్లిలో <<>>ట్రాక్టర్ కిందపడి రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. వారి వివరాలు.. గ్రామానికి చెందిన యువతి(22) HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. రైతు సత్యంతో ఏడాదిన్నర నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సత్యం మృతి చెందిన కాసేపటికే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.

News July 26, 2024

MDK: సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తోంది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 21.272 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 13.899 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా 1444 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని అధికారులు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో జూన్‌ నుంచి అర టీఎంసీ నీరు వచ్చినట్లు ఏఈ తెలిపారు.

News July 25, 2024

త్వరలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం: భట్టి

image

తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదన్నారు. తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

News July 25, 2024

మెదక్, సంగారెడ్డి జిల్లా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ పురుషులకు ఆగస్టు 5 నుంచి నెలరోజుల పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ వంగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గ్రామీణ నిరుద్యోగ యువకులు వినియోగించుకుని, శిక్షణలో వసతి, భోజనం, కోర్సు మెటీరియల్ పూర్తి ఉచితంగా ఉంటుందని, శిక్షణ అనంతరం సర్టిఫికేట్లతో పాటు టూల్ కిట్ ఇస్తామన్నారు.

News July 25, 2024

సిద్దిపేట: ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ సాధించింది గుండు సున్నా’ ఫ్లెక్సీలు

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని విమర్శనాత్మకంగా ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ సాధించింది గుండు సున్నా’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని సిద్దిపేటలో కొన్ని చోట్ల BRS నాయకులు ప్రదర్శనగా పెట్టారు. మోడ్రన్ బస్టాండ్ వద్ద ఈ ఫ్లెక్సీ ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. రెండు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రానికి ఎలాంటి నిధులు సాధించలేదని విమర్శించారు.

News July 25, 2024

MDK: గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు TGSWREI సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హత్నూర గురుకులంలో రేపు బాలికలకు, 27న బాలురకు మిగిలిన ఖాళీల్లో ఇంటర్, ఒకేషనల్ గ్రూపుల్లో భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 10వ తరగతి 2024 మార్చిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.

News July 25, 2024

కాంగ్రెస్ తొలి బడ్జెట్.. మెతుకుసీమ ఆశిస్తుందిదే..

image

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెడుతోంది. ఈ పద్దుపై ఉమ్మడి మెదక్ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి నిధులివ్వాలంటున్నారు. పొన్నం, దామోదర, కేసీఆర్, హరీశ్ ఉండటంతో జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.

News July 25, 2024

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

image

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది మండలం తనికిళ్ల తండా వద్ద నాందేడ్- అకోలా జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.