Medak

News July 25, 2024

మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

image

మెదక్ పట్టణం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్లు నీరుడి రాము, యం.రవి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతోపాటు ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు అందడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా తప్పవని హెచ్చరించారు.

News July 25, 2024

అమిత్ షాను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

image

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ పార్లమెంట్ పరిధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.

News July 24, 2024

సంగారెడ్డి: ఒక్క మెసేజ్‌.. రూ.98.40 లక్షలు కొట్టేశారు..!

image

ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో ఆదాయం లభిస్తుందన్న ఆశతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.98.40 లక్షలు పోగొట్టుకున్నాడు. పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాలు.. AR బృందావనం కాలనీలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫోన్‌కు గత నెల 17న ఓ మెసేజ్ వచ్చింది. లింక్ క్లిక్ చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసేందుకు ముందుగా రూ.10వేలతో ప్రారంభించి, విడతల వారీగా రూ.98.40లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. జర జాగ్రత్త!

News July 24, 2024

బడ్జెట్‌లో మెదక్ ప్రజలకు మొండి చేయి !

image

కేంద్ర బడ్జెట్‌లో మెదక్ జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేవు. మొండి చేయి చూపించడంతో మెదక్ ప్రజలు నిరాశకు గురయ్యారు. కేంద్రీయ, నవోదయ పాఠశాలల మంజూరు కాలేదు. అలాగే అత్యవసరంగా నిర్మించాల్సిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలకు కేటాయింపులు లేవు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దేవస్థానం పర్యటక అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోవడంపై జిల్లా వాసుసు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News July 24, 2024

ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను పెంచుతాం: మంత్రి పొన్నం

image

స్కూల్, కాలేజీ బస్సులు ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై శాసన సభలో ఎమ్యెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. ప్రయాణికులకు, విద్యార్థులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను పెంచుతామని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను మే 15న ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తామని, విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

News July 24, 2024

మాసాయిపేట రైలు దుర్ఘటనకు 10ఏళ్లు

image

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 16 మందిని బలిగొన్న ఘోర రైలు ప్రమాద దుర్ఘటనకు పదేళ్లు నిండాయి. 2014లో సరిగ్గా ఇదే రోజు తూప్రాన్‌కు చెందిన కాకతీయ టెక్నో స్కూల్ బస్సు కిష్టాపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ చిన్నారులతో వెళ్తుండగా మాసాయిపేట లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు ఢీకొట్టడంతో 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. నేటికీ ఆ ఘటన తలుచుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

News July 24, 2024

సంగారెడ్డిలో రేపు ఉద్యోగ మేళా..

image

సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఈనెల 25న ఉదయం 10:30 గంటలకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి పేర్కొన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హత ఉన్న వారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 24, 2024

ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలి.. మంత్రి ఆదేశాలు

image

సీజనల్‌ వ్యాధుల నివారణకు సత్వరమే ఇంటింటి జ్వర సర్వేను చేపట్టాలని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. మలేరియా, డెంగ్యూను నిరోధించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు.

News July 24, 2024

మెదక్ జిల్లాలో రూ. 237.5 కోట్లు జమ: కలెక్టర్

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.2లక్షల రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో మొదటి విడతలో 47,978 మంది రైతులకు రూ.238.81 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 47,616 మంది రైతుల ఖాతాల్లో రూ. 237.5 కోట్లు జమ చేశామని, వివిధ కారణాలతో 362 మందికి రూ. 1.3 కోట్లు జమ కావాల్సి ఉందన్నారు. ఈ రైతులకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.

News July 24, 2024

జోగిపేట: ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి

image

చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. జోగిపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో న్యాయ అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచితంగా సహాయం అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.