Medak

News January 4, 2026

మెదక్: టెట్ పరీక్ష ప్రశాంతం: డీఈవో విజయ

image

మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతకు టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో విజయ తెలిపారు. ఆదివారం రెండో రోజులో భాగంగా మొదటి పేపర్‌కు 100, రెండో పేపర్‌కు 100 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా మొదటి పేపర్‌కు 48 మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 71 మంది హాజరైనట్లు చెప్పారు. 81 మంది గైర్హాజరయ్యారన్నారు.

News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.

News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.

News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.

News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.

News January 4, 2026

మండల కేంద్రాల్లోనూ ‘ప్రజావాణి’: మెదక్ కలెక్టర్‌

image

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ఇకపై కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయిలోని తహశీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ నిర్వహించనున్నట్లు మెదక్ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, వారికి ప్రయాణ భార భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అధికారులు ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి సమస్యలు వినాలని ఆయన ఆదేశించారు.

News January 4, 2026

నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలపై రేపు హరీశ్ రావు PPT

image

“నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(PPT) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, జరుగుతున్న నష్టాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News January 4, 2026

మెదక్: ‘ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి రాహుల్ రాజ్, ఆర్డీవో మైపాల్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

News January 3, 2026

నర్సాపూర్‌లో టెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

నర్సాపూర్ బీవీఆర్‌ఐటీ కళాశాలలోని టెట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సందర్శించారు. జిల్లాలో 200 మంది అభ్యర్థులకు గాను 95 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. మొదటి పేపర్‌కు 65 మంది, రెండో పేపర్‌కు 40 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News January 3, 2026

మనోహరాబాద్: ‘Way2News’ ఎఫెక్ట్.. గేట్ తొలగింపు

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారు పల్లె చెరువు బఫర్ జోన్ స్థలానికి ప్రైవేట్ సీడ్ కంపెనీ ఏర్పాటు చేసిన గేటు తొలగించారు. గత నెల 31న ‘<<18725684>>Way2News<<>>’లో పల్లె చెరువు బఫర్ జోన్‌కు గేటు, ఆందోళన అంటూ కథనం ప్రచురితమైంది. 2న అధికారులు సందర్శించి గేటు తొలగించాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీకాంత్ ఆదేశాల మేరకు కంపెనీ యాజమాన్యం ఈరోజు బఫర్ జోన్ స్థలానికి ఏర్పాటుచేసిన గేటు తొలగించింది.