India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైతు రుణమాఫీ చరిత్రాత్మక ఘట్టమని హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. రైతు బిడ్డగా, రాష్ట్ర మంత్రిగా రైతన్నకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వ్యవసాయం పండుగలా, రైతే రాజు అనే నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందన్నారు.
కొమురవెల్లి మల్లన్న హాల్ట్స్టేషన్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే డిసెంబరులో జరిగే మల్లన్న కళ్యాణంలోగా అందుబాటులోకి తెస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికి పనులు ప్రారంభం కాలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నో ఒడిదుడుకుల మధ్య స్టేషన్ మంజూరైందని సంతోషించిన ప్రజలకు పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. శుక్రవారం వాటి విధివిధానాలను ప్రకటించింది. ఉమ్మడిజిల్లాలో రైతుల వివరాలిలా ఉన్నాయి. మెదక్లో 1,48,218 మంది రైతులు రూ.828 కోట్ల రుణం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1,79,322 మంది రైతులకు రూ. 2505.52 కోట్ల అప్పు మాఫీ కానుంది. సిద్దిపేట జిల్లాలో 1.75లక్షల మంది రైతులకు సుమారు రూ.2,600 కోట్ల బకాయిలు తీరనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో అన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2024 పరీక్షలను జులై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి HYDలో తెలిపారు. ఈ పరీక్షలను రోజూ మూడు సెక్షన్లలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై మూడో తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. SHARE IT
విద్యార్థుల బస్సు పాసుల కోసం యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందాలని ఆర్టీసీ RM ప్రభులత తెలిపారు. ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థలు తెరుచుకున్న సందర్భంగా బస్సు పాసుల కోసం సంగారెడ్డి రీజనల్లోని 8 డిపోల్లో అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బస్సు పాసుల కోసం విద్యార్థులు వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని కళాశాలల యాజమాన్యం అప్రూవల్ చేయాలన్నారు. తర్వాత బస్సు పాస్ పొందవచ్చని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు.
మద్యానికి బానిసైన ఓ యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలు.. అర్బింద్ కుమార్(27) భార్య, పిల్లలతో కలిసి 3ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశం నుంచి సంగారెడ్డి సదాశివపేటకు వలస వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని తన భార్య స్వగ్రామానికి తీసుకెళ్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రాగా 4వ గేట్ సమీపంలో అర్బింద్ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు.
ఇటీవల మెదక్ పట్టణంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణకు సంబంధించిన కేసులో ఓ వర్గానికి చెందిన 16 మందికి శుక్రవారం బెయిల్ మంజూరైంది. ఘర్షణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ టౌన్ ప్రెసిడెంట్ నాయిని ప్రసాద్ తదితర 16 మందిపై కేసు నమోదు కాగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి తరఫున అడ్వకేట్గా ఎంపీ రఘునందన్ రావు, అడ్వకేట్ సంతోష్ రెడ్డి గురువారం బెయిల్ పిటిషన్ వేశారు.
బీజేపీ, మంత్రులకు రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పితే ఉద్యోగుల చర్చ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. చేరికల అంశం తన పరిధిలో లేదని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆర్ఐ దుర్గయ్య రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నా అధికారుల్లో అవినీతి తగ్గడం లేదని జిల్లాలో చర్చించుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.