India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుండె వ్యాధితో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఖేడ్ మండలం సంజీవనరావుపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేకరీ సాయిలు నందిని దంపతుల ఆరేళ్ల కూతురు సాయి పల్లవి గత నెల రోజుల నుంచి గుండె వ్యాధితో నిమ్స్లో చికిత్స పొందుతోంది. గుండె ఆపరేషన్కు రూ. 6లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దాతలు విరాళాలు అందించినప్పటికీ చివరికి ఆ చిన్నారి గుండె ఈరోజు ఆగిపోయింది.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ పసిబిడ్డను వదిలిపెట్టి వెళ్లిన ఘటన KNR జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలానికి చెందిన యువతి, వరుకోలుకు చెందిన మహేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చిన యువతి KNRలోని మాతాశిశు ఆసుపత్రిలో చేరింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తల్లి పసిబిడ్డను వదిలివెళ్లడం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆ పసిబిడ్డకు ఇతర తల్లుల పాలు పట్టిస్తున్నారు.
గడ్డి మందు తాగి ఈనెల 14న రంజిత్ చికిత్స పొందుతూ మృతిచెందిన కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన బాబా శేఖర్, బిక్కనూర్కి చెందిన రంజిత్ కలిసి కొద్దిరోజుల క్రితం ఓ బైక్ను దొంగిలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. ఆ బైక్ను తానే సొంతం చేసుకోవాలని బాబా శేఖర్ తన బావమరిది రంజిత్కు కళ్ళు సీసాలో గడ్డి మందు కలిపి ఇచ్చి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు సీఐ వెల్లడించారు.
ఈనెల 7 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో 8,019 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. 1వ తరగతిలో 3,501, 2 నుంచి 9వ తరగతిలో 3,896 మంది చేరినట్లు చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో 642 మంది చేరినట్లు వివరించారు. బడిబాట విజయవంతం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.
తూప్రాన్లో సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ ప్రభుత్వ టీచర్ డబ్బులు పోగొట్టుకున్నాడు. టీచర్ మనీష్ రెడ్డి ఆన్లైన్లో క్రెడిట్ కార్డు ద్వారా వివేకానంద వాల్ పోస్టర్ బుక్ చేశారు. అయితే ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఉపాధ్యాయుడి ఖాతాలో ఉన్న రూ.75 వేలను మూడు విడతలుగా కాజేశారు. సైబర్ మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇళ్లలో పని చేసే గృహా కార్మికులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. అంతర్జాతీయ గృహ దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి లోని మెద్వాన్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గృహ కార్మికులు హక్కులపై అవగాహన ఎంచుకోవాలని చెప్పారు. సమావేశంలో కార్మికులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బుధవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు ఎంపీ రఘునందన్ రావును కలిసి కోరారు. ఎంపీగా గెలిచిన రఘునందన్ రావును ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిసారు. శాలువా కప్పి అభినందనలు తెలిపి మాట్లాడుతూ.. ప్రజల గొంతుకగా ఎంపీ పార్లమెంట్లో వాణి వినిపించి ఉమ్మడి జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని కిసాన్ సాగర్ చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి రూరల్ ఎస్సై వినయ్ కుమార్ చేరుకొని క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. మృతుడి వయసు 22 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. కాగా మృతుడు ఎవరు..?, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే చెప్పాలని ఎస్సై కోరారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ కోళ్లఫారంలో అల్ఫాజోలం తయారీ చేస్తున్న కేంద్రంపై జిల్లా SP రూపేష్, టీఎస్ న్యాబ్, గుమ్మడిదల పోలీసులు దాడి చేశారు. గ్రామానికి చెందిన పలువురు ఆరు నెలలుగా మత్తు పదార్థాలైన అల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.40లక్షల విలువైన 2.60 లక్షల విలువైన అల్ఫాజోలం, రూ.60లక్షలు విలువైన ముడి పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు SP తెలిపారు.
హుస్నాబాద్(M) కూచన్పల్లి వాసి నరసయ్య(55)ను <<13461790>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. SI మహేశ్ వివరాలు.. నర్సయ్య సామగ్రి ఏరుకుంటూ విక్రయించేవాడు. మద్యానికి బానిసై రోజు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి అతని భార్య లేచి చూసేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి నర్సయ్య భార్య, తమ్ముడి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.