Medak

News June 19, 2024

నార్సింగి: వాన లేక.. అన్నదాత ఆందోళన

image

వర్షాకాలం మొదలై 17 రోజులైనా ఆశించిన స్థాయిలో చినుకు లేక రైతులకు నిరాశే ఎదురైంది. తొలకరి వర్షాలకు దుక్కులు దున్ని, విత్తనాలు ఎరువులను సమకూర్చుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 37,321 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అధికారులు అంచనా. ఇప్పటికి 9500 ఎకరాల్లో మాత్రమే సాగయింది. అందులో సగం కూడా మొలకెత్తలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 19, 2024

మెదక్: మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

image

నర్సాపూర్ నియోజకవర్గంలో రేపు జరిగే మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా బుధవారం ఉదయం 11 గంటల నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.

News June 18, 2024

MDK: ‘RRR’@ రూ.31 వేల కోట్లు..!

image

HYD రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించే దీనికి అయ్యే మొత్తం వ్యయంపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2 భాగాలు కలిపి మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్నట్లు లెక్కగట్టారు. తొలుత నిర్మాణం చేపట్టే ఉత్తర భాగం రహదారికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లాలని నిర్ణయించారు. దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై NHAI అధికారులు చర్చలు జరుపుతున్నారు.

News June 18, 2024

హుస్నాబాద్‌లో కలకలం సృష్టించిన దారుణ హత్య.!

image

హుస్నాబాద్ మండలంలోని కూచన‌పల్లి గ్రామంలో జరిగిన హత్యోదంతం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన గీకురు నరసయ్య(55)ను ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు <<13460973>>గోడ్డలి<<>>తో నరికారు. భూ తగాదాల వల్ల జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలతో హత్య చేశారనే కోణంతో పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

News June 18, 2024

BREAKING: సిద్దిపేట జిల్లాలో హత్య..

image

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కంచన్‌పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న నరసయ్య (55)ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 18, 2024

సిద్దిపేట: జూన్ 24న జాబ్ మేళా

image

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 60కి పైగా కంపెనీల్లో 5వేల ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. తిరుమల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ జాబ్ మేళాలో 18-35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించింది. వివరాలకు 9642333667, 6300670339 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News June 17, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లలు  అనన్య(3), సహస్ర(1)ను నీటిలో ముంచి హత్య చేసేందుకు యత్నించింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా.. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 17, 2024

పార్టీ మార్పు వార్తలపై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు..!

image

తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ మారనున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సోషల్‌ మీడియాతో పాటు బ్రేకింగ్స్, వ్యూవ్స్ కోసం పలు మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇకపై తన విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానాలని ఆయన హితవు పలికారు.

News June 17, 2024

SRD: ఫేస్‌బుక్‌లో ప్రకటన.. లాభాలు చూపిస్తామని మోసం!

image

ఫేస్‌బుక్‌లో ప్రకటన ద్వారా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు చూపిస్తామంటూ ఆశ చూపి రూ.12.52 లక్షలు కాజేసిన ఘటన పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పోచారంలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వాతి ఫేస్‌బుక్ ప్రకటన చూసి ఓ వాట్సప్ గ్రూప్‌లో చేరింది. APR 12 నుంచి JUN 14 వరకు రూ.13.8 లక్షలు పెట్టుబడి పెట్టగా వాటిలో రూ.1.30 వెనక్కి తీసుకుంది. మిగతావి రాకపోవడంతో PSలో ఫిర్యాదు చేసింది.

News June 17, 2024

మెదక్: గుండెపోటుతో అల్లుడు, అత్త మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో గుండెపోటుతో ఇద్దరు మృతిచెందారు. గంటల వ్యవధిలోనే అత్త, అల్లుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన నరసింహులు(58) ఆదివారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. అల్లుడి మరణం తట్టుకోలేక రోదిస్తున్న అత్త నర్సమ్మ సైతం ఈ ఉదయం గుండెపోటుకు గురై మృతిచెందారు.