Medak

News June 17, 2024

సిద్దిపేట: ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత !

image

సిద్దిపేట జిల్లాలో 8 విడతల్లో జరిగిన హరితహారంలో సుమారు 15 కోట్ల వరకు మొక్కలు నాటారు. రహదారుల వెంట, ఖాళీ స్థలాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పల్లెలు, పట్టణాల్లో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించాయి. విద్యుత్‌ వైర్లకు తగులుతున్నాయనే సాకుతో సిద్దిపేటతో పాటు మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఇటీవల అనేక చోట్ల విద్యుత్‌ సిబ్బంది నరికి వేశారు.

News June 17, 2024

సంగారెడ్డి: పెళ్లి చేయడంలేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి చేయడంలేదన్న మనస్తాపంతో<<13453836>> యువకుడు సూసైడ్<<>> చేసుకున్నాడు. SI అంబార్య వివరాలు.. మహారాష్ట్రకు చెందిన బాలాజీ(31) కుటుంబం కొన్నేళ్లుగా తిమ్మాపూర్‌లో ఉంటుంది. HYDలో పనిచేస్తున్న బాలాజీ.. తనకు పెళ్లి చేయాలని కోరుతున్నా కుటుంబీకులు పట్టించుకోలేదు. ఇటీవల గ్రామానికి వచ్చిన బాలాజీ ఆదివారం తాగిన మైకంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. బాలాజీ తల్లి మీరాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

News June 17, 2024

MDK: బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు

image

త్యాగానికి ప్రతీకైన ఈద్-ఉల్-అజ్ హ (బక్రీద్) పర్వదినాన్ని ఇస్లామిక్ కాలమానిని హిజ్రీ క్యాలండరు ఆఖరి నెల జిల్ హిజ్జాలోని పదో తేదీన ముస్లింలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండగను పురస్కరించుకుని సోమవారం ముస్లింలు ప్రత్యేక నమాజు చేసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదులు, మదర్సాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు.

News June 17, 2024

మెదక్: కుటుంబ కలహాలతో యువకుడి సూసైడ్

image

కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌కు చెందిన విష్ణువర్ధన్(20) మేడ్చల్‌లోని RTC కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఏదైనా పనిచేసుకోవాలని విష్ణును శనివారం రాత్రి తండ్రి మందలించారు. దీంతో ఆవేశంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదైంది.

News June 17, 2024

ముస్లిం సోదరులకు మంత్రి పొన్నం బక్రీద్ విషెష్

image

బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతికి బక్రీద్ తార్కాణమన్నారు. దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో నడవాలని గొప్ప సందేశాన్ని మానవాళికి ఇస్తుందన్నారు. పండగ రోజున ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

News June 17, 2024

కోర్టు అనుమతితో జైలు వద్దకు రఘునందన్

image

మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో జైలులో ఉన్న వ్యక్తులను కలిసేందుకు మెదక్ MP మాధవనేని రఘునందన్ రావుకు హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. మెదక్ అల్లర్ల నేపథ్యంలో సుమారు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జైల్లో ఉన్న హిందువులను కలిసేందుకు ఎంపీ ప్రత్యేక అనుమతి పొందారు. ఈరోజు రాత్రి కలిసేందుకు అనుమతి లభించినట్లు సమాచారం.

News June 16, 2024

మెదక్ జిల్లా బంద్‌కు హిందూ సంస్థల పిలుపు

image

మెదక్ జిల్లాలో రేపు బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. గోవుల రక్షణకు చేసిన ప్రయత్నంలో హిందువులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారని వివరించారు. ఈ ఘటనను నిరసిస్తూ సోమవారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, బీజేవైఎం పేర్కొన్నాయి. జిల్లా బంద్‌కు ప్రజలు సహకరించాలని సందర్భంగా కోరాయి.

News June 16, 2024

రామాయంపేట: ఆన్‌లైన్ బెట్టింగ్‌.. యువకుడి ఆత్మహత్య

image

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన భానుప్రసాద్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఈనెల 10న పురుగు మందు తాగగా ప్రసాద్‌ను బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈమేరకు బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 16, 2024

రామాయంపేట: ఆన్‌లైన్ బెట్టింగ్‌.. యువకుడి ఆత్మహత్య

image

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన భానుప్రసాద్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఈనెల 10న పురుగు మందు తాగగా ప్రసాద్‌ను బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈమేరకు బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 16, 2024

మెదక్ పట్టణంలో 45 మంది గుర్తింపు: ఐజీ రంగనాథ్

image

మెదక్ పట్టణంలో నిన్న సాయంత్రం జరిగిన గొడవలకు, అనంతరం జరిగిన ధ్వంసం కేసులో ఇరువర్గాలలో 45 మందిని గుర్తించినట్లు మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సూచించారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీసులు ఊరుకోరని హెచ్చరించారు. సామాన్య ప్రజలు ఎవరిపైన కేసులు పెట్టే ఉద్దేశం లేదన్నారు. రెచ్చగొట్టే వారిని ఉపేక్షించమన్నారు.