Medak

News June 16, 2024

మెదక్‌‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

image

మెదక్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాతోంది. స్వచ్ఛందంగా వర్తక, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. నిన్న రాత్రి రెండువర్గాల మధ్య ఘర్షణలు జరుగగా.. దానికి నిరసనగా బీజేపీ నాయకులు మెదక్ పట్టణ బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్‌లో భారీగా పోలీసులు మోహరించారు.

News June 16, 2024

మెదక్: గుప్తనిధి బంగారం అంటూ మోసం 

image

జేసీబీ తవ్వకాల్లో బంగారం దొరికిందని మోసంతో రూ. 13 లక్షల తీసుకొని నకిలీ బంగారం అప్పగించిన ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం శివారు పాలెం గ్రామానికి చెందిన ఎం.ఆదెప్ప (32)ను అరెస్టు చేసినట్లు గౌరారం ఎస్సై శివకుమార్ తెలిపారు. జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బలిజ గూడెం స్వామి మోసం చేశారు. వారి వద్ద నుంచి ఏడు లక్షల నగదు స్వాధీనం చేసుకోగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు

News June 15, 2024

MDK: రిజినల్ రింగ్ రోడ్డు పొడవు పెరిగింది..!

image

HYD ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) పొడవు పెరిగింది. ఉత్తర భాగంలో 2.95 కి.మీ. మేర పెంచాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. కాగా తాజా ఎలైన్‌మెంట్‌తో RRR ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 10.28 కి.మీ. పెరిగింది. దీంతో రెండు భాగాల విస్తీర్ణం 350.79 కి.మీ.కు చేరింది. అయితే గతంలో 340.51 కి.మీ. నిర్ణయించగా ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానం కోసం ఈ మార్పు అవసరమైందని అధికారులు తెలిపారు. ఈ మేరకు భూ సేకరణ చేయనున్నారు.

News June 15, 2024

అంతర్జాతీయ సదస్సుకు తారా డిగ్రీ అధ్యాపకురాలు

image

సంగారెడ్డి ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు పట్లోళ్ల అశ్విని రేపటి నుంచి 19 వరకు చైనాలో జరిగే 10వ ఏషియన్ పసిఫిక్ ఎక్సర్ సైజ్ స్పోర్ట్స్ సైన్స్ – 2024 సదస్సుకు ఎంపికయ్యారు. చైనాలో జరిగే సదస్సుకు 46 దేశాల ప్రతినిధులు పాల్గొంటుండగా.. ఈ సదస్సుకు భారత్ నుంచి ఫిజికల్ విభాగంలో అశ్విని ఒక్కరే ఎంపికయ్యారు.

News June 15, 2024

వనదుర్గ ప్రాజెక్టు‌లో మునిగి వ్యక్తి మృతి

image

ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు శుక్రవారం నీట మునిగి మృతి చెందాడు. నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడని పాపన్నపేట SI నరేశ్ తెలిపారు. HYDకి చెందిన ఎస్లీ వినోద్(48) స్థానికంగా వంట మనిషిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఏడుపాయలకు వచ్చాడు. సాయంత్రం స్నానం చేసేందుకు వనదుర్గా ప్రాజెక్టులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేశామన్నారు.

News June 15, 2024

సంగారెడ్డి: మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ

image

సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ సమయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు అర్హులని చెప్పారు. 18 నుంచి 45 సంవత్సరాల వరకు చిన్న మహిళలు సంగారెడ్డిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 15, 2024

సంగారెడ్డి: సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం

image

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి ఫిరంగి శుక్రవారం తెలిపారు. ఈనెల 30లోగా https://studycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్ సైట్‌ను ఫాలో కావాలని సూచించారు.

News June 14, 2024

మెదక్: వీడిన జంట హత్యల మిస్టరీ

image

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మే23న వెలుగు చూసిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. 25రోజుల క్రితం బంగారం కోసం తల్లిదండ్రులను వారి కొడుకే హత్య చేసినట్లు గుర్తించారు. జల్సాలకు అలవాటు పడ్డ లక్ష్మణ్ డబ్బు కోసం తల్లిదండ్రులను చంపి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News June 14, 2024

సంగారెడ్డి: రేపు ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు

image

బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రిఫరెన్షియల్ కేటగిరి ఉపాధ్యాయులకు ఈనెల 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకుని మెడికల్ బోర్డు ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని డిఇఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News June 14, 2024

సార్వత్రిక ఫలితాల్లో సంగారెడ్డి ఫస్ట్.. సిద్దిపేట లాస్ట్

image

ఓపెన్(సార్వత్రిక) పది, ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోనే సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. పదో తరగతితో 79.6% ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా ఫస్ట్ స్థానంలో నిల్వగా.. 77.95 %తో మెదక్ ద్వితీయ, 42.65% సిద్దిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇంటర్‌లో సంగారెడ్డిలో 67.03 %, మెదక్ 60.16%, సిద్దిపేటలో 37.18% ఉత్తీర్ణత నమోదైనట్లు సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.