Medak

News June 14, 2024

ధరణి సమస్యలు పరిష్కరించాలి: సీసీఎల్ఏ

image

పెండింగ్ ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ ధరణి దరఖాస్తుల వివరాలపై సమీక్షించి వాటిని పరిష్కరించడంపై ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్ మనూచౌదరి పాల్గొన్నారు.

News June 14, 2024

సిద్దిపేట: మహిళపై దాడి చేసి పుస్తెలతాడు చోరీ.. ఇద్దరి అరెస్ట్

image

ములుగు మండలం తునికి బొల్లారం వాసి శ్యామల శంకరమ్మ దాడి చేసి 4.50 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మేడ్చల్ జిల్లా నాగలూరుకి చెందిన లింగని రజినీకాంత్(23), ఈరగల్ల యాదగిరి(36)గా గుర్తించినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. శంకరమ్మ ఈనెల 11న ఉదయం వాకింగ్ చేస్తుండగా దాడి చేసి పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. తూప్రాన్‌లో అమ్ముతుండగా ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు.

News June 14, 2024

గుమ్మడిదల: రోడ్డు ప్రమాదంలో బైక్ మెకానిక్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్‌ను ఢీకొని బైక్ మెకానిక్ మృతి చెందిన ఘటన గుమ్మడిదల మండలంలో నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన గణేష్(31) బైక్ మెకానిక్. నిన్న రాత్రి తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం తిరిగి కారులో ఇంటికి వస్తుండగా అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

News June 14, 2024

సంగారెడ్డి: నేడు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు

image

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

News June 14, 2024

హాట్‌టాపిక్‌గా ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు

image

మెదక్‌లో జరిగిన విజయోత్సవ సభలో బీఆర్ఎస్ నేతలపై ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారినాయి. మాజీ సీఎం KCRపై ఇప్పుడే ఈడీ కేసు నమోదైందని, త్వరలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై ఈడీ ఎఫెక్ట్ ఉంటుందని, రూ.500 కోట్లు ఖర్చుపెట్టినా వెంకట్రామిరెడ్డి గెలవలేదన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై జిల్లాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై మీ కామెంట్..

News June 13, 2024

మెదక్: విద్యుత్ సబ్ స్టేషన్‌లో పిడుగుపాటు

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రామతీర్థం శివారులోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌పై పిడుగు పడింది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగుపాటు జరిగింది. దాంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి విద్యుత్తు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నారు.

News June 13, 2024

రేపు జిల్లా కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు: మంత్రి

image

రేపు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ మేరకు బ్లడ్ బ్యాంకుల నిర్వహణ – బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలను పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

News June 13, 2024

MDK: పిల్లలతో సహా చెరువులో దూకిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్‌లో ఈరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శ్వేతకు తన భర్తకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్వేత ఇద్దరు పిల్లలతో కలిసి అమీన్‌పూర్ పెద్ద చెరువులో దూకింది. బాలుడు శ్రీహాన్స్ మృతదేహం లభించగా బాలిక శ్రీహ, తల్లి శ్వేత మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News June 13, 2024

అందోల్ మండల పంచాయతీ అధికారిణి సస్పెండ్

image

అందోలు మండల పంచాయతీ అధికారిణి(MPO) సౌజన్యను సస్సెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారని MPDO రాజేశ్ కుమార్ తెలిపారు. MPO పని తీరుపై ఇటీవల మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఫిర్యాదు చేయడం, ఇతరత్రా కారణాలపై జిల్లా కలెక్టర్ ఖేడ్ DLPO సంజీవరావుతో విచారణ చేయించారు. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు MPDO తెలిపారు.

News June 13, 2024

సిద్దిపేట: ‘పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం’

image

వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపైన ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. జాతీయ రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల పనితీరును సమీక్షించారు. వర్షాకాలంలో వచ్చే అంటూ వ్యాధులు, దోమల కుట్టడం ద్వారా వచ్చే మలేరియా, చికున్ గన్యా, ఫైలేరియా, డెంగీని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.