Medak

News February 20, 2025

మెదక్: మార్చి 8న లోక్ అదాలత్

image

నేషనల్ లోక్ అదాలత్ మర్చి 8న మెదక్ జిల్లా కోర్ట్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి లక్ష్మి శారద తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించుకునే విధంగా న్యాయవాదులు సహకరించాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు, కక్షిదారులు వినియోగించుకుని, ఎక్కువ మొత్తంలో కేసులను రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జితేందర్, రుబీనా ఫాతిమా, సిరి సౌజన్య, సాయి ప్రభాకర్ ఉన్నారు.

News February 20, 2025

వాళ్లకు త్రిబుల్ రైడింగ్ ఫైన్ పడింది 14న: పవర్ కట్‌పై ఇన్స్పెక్టర్ స్పందన

image

‘కరెంటోళ్లకు ఫైన్… ట్రాఫిక్ సిగ్నల్స్‌కి పవర్ కట్’ Way2News కథనంపై మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు స్పందించారు. ఈనెల 14న విద్యుత్ సిబ్బంది త్రిబుల్ రైడింగ్‌తో వెళ్లగా ఓల్డ్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ విధించినట్లు చిత్రం పంపారు. అగ్ని ప్రమాదం జరిగింది 17న అన్నారు. ఆరోజు ఫైన్ వేయలేదు, విద్యుత్ సిబ్బంది సిగ్నల్స్, ట్రాఫిక్ స్టేషన్‌కు పవర్ కట్ చేయడం సరికాదని పేర్కొన్నారు.

News February 20, 2025

మెదక్: ఢిల్లీ UPSCకి వెళ్లిన విద్యార్థి అదృశ్యం

image

మనోహరాబాద్ మండలం పోతారం గ్రామ యువకుడు అదృశ్యమైనట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. మయూడి అనిల్ కుమార్ (28) ఈనెల 7న ఢిల్లీలో యుపీఎస్సీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. 11న కుటుంబీకులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అతడి కోసం ఆరా తీశారు. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సోదరుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News February 20, 2025

మెదక్: ‘ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి’

image

మెదక్ కలెక్టరేట్‌లో ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎన్నికల విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల విధులను నిజాయితీ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు.

News February 20, 2025

మెదక్: స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహశీల్దార్ సింధు రేణుకతో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.

News February 20, 2025

మెదక్: బీఆర్ఎస్ సమావేశానికి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్

image

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. మెదక్ జడ్పీ ఛైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ, వంటేరు ప్రతాపరెడ్డి, చింత ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.

News February 19, 2025

మెదక్: ఎన్నికల విధులపై కలెక్టరేట్లో సమీక్ష

image

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎన్నికల విధులు విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు.

News February 19, 2025

సిద్దిపేట: ప్రియుడితో కలిసి భర్త హత్యకు యత్నం

image

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య యత్నించింది. పోలీసుల వివరాలిలా.. సిద్దిపేటలోని గుండ్లచెరువు కాలనీ వాసికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్యకు అదే కాలనీకి చెందిన శ్రవణ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ చేసింది. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి 2సార్లు దాడి చేయగా భర్త ఇచ్చిన ఫిర్యాదుతో విచారించిన పోలీసులు శ్రవణ్‌ను రిమాండ్‌కు తరలించారు.

News February 19, 2025

నేడు బీఆర్‌ఎస్‌ సమావేశం.. హాజరుకానున్న కేసీఆర్

image

హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం సందడి వాతావరణం నెలకొననుంది. మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం KCR అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు అన్ని జిల్లాల ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నారు. కారులన్నీ తెలంగాణ భవన్‌కు క్యూ కట్టాయి. భవిష్యత్తు కార్యాచరణపై HYD వేదికగా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

News February 19, 2025

పదోన్నతి భాద్యతలను పెంచుతుంది: కలెక్టర్

image

పదోన్నతి భాద్యతలను పెంచుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ లోని రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లను కమారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సీనియర్ అసిస్టెంట్లుగా కేటాయించడం జరిగిందన్నారు. వృత్తినే దైవంగా భావించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని అన్నారు. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.