Medak

News June 12, 2024

సంగారెడ్డి: ‘ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి’

image

ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తహసిల్దార్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధరణి దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News June 11, 2024

తొగుట: పిడుగు పాటుకు రైతు మృతి

image

తోగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కడారి శ్రీశైలం అనే రైతు వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో పిడుగు పడి స్పృహ కోల్పోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉండగా వైద్య చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తీసుకెళ్తున్న క్రమంలో శ్రీశైలం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

News June 11, 2024

ఓయూ: శాశ్వత వీసీల నియామకం మరికొంత ఆలస్యం!

image

రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న 9 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతుల నియామకం మరికొంత ఆలస్యం కానుంది. గత నెల 21వ తేదీతో 10 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. దీంతో ఐఏఎస్ అధికారులను ఇన్‌ఛార్జ్ వీసీలుగా ప్రభుత్వం నియమించింది. 15వ తేదీలోపు కొత్త వీసీలను నియమించకుంటే ఇన్‌ఛార్జుల పదవీకాలం పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.

News June 11, 2024

ములుగు: బంగారం కోసం మహిళపై సుత్తెతో దాడి

image

ములుగు మండలం వంటిమామిడిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివాసం ఉంటున్న మహిళపై బంగారం కోసం గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం దాడి చేశారు. మహిళ బయటకు వచ్చిన క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సుత్తెతో దాడి చేసి మహిళ మెడలో నుంచి బంగారాన్ని అపహరించుకుపోయారు. మహిళకు తీవ్ర రక్తస్రావం అవడంతో ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు.

News June 11, 2024

 MDK: ’30లోగా డీసెట్-24కు దరఖాస్తు చేసుకోండి’

image

ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు 2024-26వ విద్యా సంవత్సరానికిగాను డీసెట్-24 నోటిఫికేషన్ వెలువడినట్లు మెదక్ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణ, పూర్వ ప్రాధమిక ఉపాధ్యాయ శిక్షణ కోసం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హత పరీక్ష ఆన్లైన్లో జులై 10న నిర్వహిస్తారన్నారు.

News June 11, 2024

ఈనెల 28వ తేదీ నుంచి ఓయూ ఎంబీఏ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. SHARE IT

News June 10, 2024

ఓయూ: 19వ తేదీ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు.

News June 10, 2024

నేడు పల్లె నిద్రలో మెదక్ కలెక్టర్, అధికారులు

image

మెదక్ జిల్లాలో బడిబాట విజయవంతానికి కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నర్సాపూర్ మండలం జక్కపల్లిలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఈరోజు పల్లె నిద్ర చేయనున్నారు. చదువుకోవడం వల్ల మానసిక పరిపక్వత సాధించవచ్చని, చదువు చాలా ఉన్నతమైనది చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని అన్నారు. బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి, ప్రతి ఒక్క అధికారి 100 ఇళ్లు సర్వే చేయాలన్నారు.

News June 10, 2024

నేడు పల్లె నిద్రలో మెదక్ కలెక్టర్, అధికారులు

image

మెదక్ జిల్లాలో బడిబాట విజయవంతానికి కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నర్సాపూర్ మండలం జక్కపల్లిలో కలెక్టర్ రాహుల్ రాజ్ పల్లె నిద్ర చేయనున్నారు. చదువుకోవడం వల్ల మానసిక పరిపక్వత సాధించవచ్చని, చదువు చాలా ఉన్నతమైనది చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని అన్నారు. బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి, ప్రతి ఒక్క అధికారి 100 ఇళ్లు సర్వే చేయాలన్నారు.

News June 10, 2024

ఓయూలో బీఎఫ్ఏ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫైన్స్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) (అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ) తదితర కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు రెండు, మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, పదో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 13వ తేదీలోగా చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 20వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.