India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ పర్వదిన వేళ ప్రజలందరికి ప్రశాంతతను, ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకున్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలాన్నారు.
నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు నివాళులు అర్పించారు. HYDచంపాపేట్లోని ఆయన నివాసానికి వెళ్లి జగన్నాథం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని, ఎంపీగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఓ సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి అని మాజీ సీఎం KCR అన్నారు. ‘X’ వేదికగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన వల్లనే తెలంగాణలో వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సాగుకు, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి రైతన్నల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం గం.8:30 AMవరకు నమోదైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని అందోల్, కోహిర్ 13.6 డిగ్రీలు, చోటకుర్, పుల్కల్ 14.0, నాల్కల్ 14.4, మెదక్ జిల్లాలో వెల్దుర్తి 14.6, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గ్ 15.2, టేక్మాల్ 15.4, రేగోడ్ 15.5, సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట్ భూంపల్లి 15.2, దుబ్బాక 15.3, మిర్దొడ్డి 15.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పల్లెల్లో పొంగల్ సందడి నెలకొంది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్గులతో ఇంటి వాకిళ్లను అలంకరించారు. పోటీపడి మరీ రథం వల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. పిల్లలకు రేగిపండ్లతో స్నానాలు చేయిస్తున్నారు. హరిదాసులతోపాటు అలంకరించిన డూడూ బసవన్నలు ఇంటింటికీ వెళ్తున్నాయి.
సిద్దిపేట జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. ఈ నెల 13 నుంచి 28 వరకు కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎంపీ స్వామి వివేకానందకు నివాళులర్పించారు. లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరేవరకు ఆగకండి.. అంటూ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద మహోన్నతమైన సందేశం ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందరన్నారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులను ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రద్దీని అదనుగా తీసుకుని దొంగలు చేతివాటం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో చోరీలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం గం.8.30 AM వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్, కల్హేర్ 15.6, జహీరాబాద్, ఆందోల్, కోహిర్ 15.9, మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట్ 16.2, మనోహరాబాద్ 16.7, రేగోడ్ 16.8, తూప్రాన్ 16.9, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 16.0, మార్కూక్ 16.2, ములుగు 16.3, మద్దూరు 16.5 °C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.