India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డిలోని మిలాద్ మైదానంలో సమీర్(27) యువకుడు శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సమీర్ను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. రిక్షా కాలనీకి చెందిన సమీర్ గతంలో పలు నేరాలకు పాల్పడ్డాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని పట్టణ సీఐ రమేష్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఐదుగురు యువకులు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. ముషీరాబాద్కు చెందిన ఏడుగురు యువకులు శనివారం డ్యాం ప్రాంతంలోకి వచ్చి ఈత కోసం డ్యామ్లో దిగారు. ఇందులో ఇద్దరు యువకులు బయటపడగా మరో ఐదుగురు యువకులు నీటిలో గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్, అందోల్ 14.3, చౌటాకూర్, కోహిర్ 14.5, మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట 15.0, టేక్మాల్ 15.1, నిజాంపేట్ 15.6, సిద్దిపేట జిల్లాలోని మార్కూక్ 14.6, దూల్మిట్ట 15.0 C ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రాబోయే రోజులలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, అస్తమా రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అహ్మద్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందని కార్యక్రమానికి జిల్లాలో ఉన్న వివిధ రాజకీయ ప్రతినిధులు, వివిధ సంఘలా సభ్యులు పాల్గొనాలని కోరారు.
పండగపూట సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మునిపల్లి మండలం భూసరెడ్డిపల్లి గ్రామ శివారులోని రిసార్ట్లో జంట సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. ఓ జంట గురువారం సాయంత్రం రిసార్ట్లో రూం అద్దెకు తీసుకున్నారు. ఉదయం రిసార్ట్ యజమాని పరిశీలించగా ఇద్దరు ఉరివేసుకొని కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ మోడల్ స్కూల్లో 2025-26 ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి10వ ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవాలి. APRIL 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఝరాసంగం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తేనావతి తెలిపారు.
రామాయంపేట మం. సుతారిపల్లికి చెందిన లక్ష్మి(48) మృతదేహానికి 5నెలల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. లక్ష్మి చికిత్స పొందుతూ గతేడాది సెప్టెంబర్లో చనిపోగా అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన తల్లి చికిత్స చేస్తుండగానే చనిపోగా వైద్యులు ఆ విషయం చెప్పకుండా డబ్బులు తీసుకున్నాకే మృతిచెందినట్లు చెప్పారని ఆమె కుమార్తె HYDలో ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేడుకలకు సంబంధించిన వేదికను తగిన శ్రద్ధతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సురక్షితమైన వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు చర్యలు చెప్పటాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థులను టీచర్ చితకబాదిన ఘటన సిద్దిపేట(D) దుద్దెడ గురుకులలో జరిగింది. టెన్త్,ఇంటర్ విద్యార్థులకు ఉదయం నిర్వహించిన స్టడీ అవర్స్కు ఆలస్యంగా వచ్చిన 30 మంది విద్యార్థులను PD వాసు ఒళ్లంతా వాతలు వచ్చేలా కొట్టాడు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పిల్లలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. PDని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. తీవ్రంగా గాయపడిన వారికి సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడి, చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.