India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BRS, కాంగ్రెస్, BJP మెదక్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి జిల్లాలలో ఒక్కసారి రాజకీయం వేడెక్కింది. ఇక్కడ గతంలో 3సార్లు జరిగిన ఎన్నికల్లో ఫలితాలన్ని ఏకపక్షమని చెప్పొచ్చు. ఇక్కడ జాతీయ పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నినా.. ప్రాంతీయ పార్టీ హవానే సాగింది. అయితే ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వేళ ఏకపక్ష పోరు అసాధ్యమే అని త్రిముఖ పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి మాజీ మంత్రి హరీశ్ రావు అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం మెదక్లో మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బందుకు గురి చేశారని మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో మామను మించిన వ్యక్తి హరీశ్ రావు అని.. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
మెదక్ ప్రజల ఆశ, శ్వాసగా పనిచేస్తామని రఘునందన్ రావు తెలిపారు. ఇందిరా గాంధీ హామీ ఇచ్చి నాలుగు దశాబ్దాలుగా కానీ పనులు ఐదేండ్లలో మోదీ నేతృత్వంలో చేసి చూపించామన్నారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపిలు లేకున్నా మెదక్ రైలు, మెదక్ మీదుగా జాతీయ రహదారులు, అనేక పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెదక్ ఆత్మగౌరవాన్ని కాపాడేలా పనిచేస్తా అన్నారు. మెదక్ ఎన్నిక ఏకపక్షమని రఘునందన్ రావు పేర్కొన్నారు.
మెదక్ ఎంపీ సీటు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీని నీలం మధు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు. ఇందిరాగాంధీ లాంటి మహోన్నత నేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానానికి రుణపడి ఉంటానని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మెదక్ జిల్లా ర్యాలమడుగు వాసి కృష్ణ గెలుపొందారు. గ్రామానికి చెందిన కృష్ణ 18 ఏళ్లుగా అక్కడ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 2270 ఓట్లలో 1134 ఓట్లు సాధించి గెలుపొందారు. మెదక్ మండలం ర్యాలమడుగు వాసి గెలుపొందడం పట్ల గ్రామస్తులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతోపాటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి ఉన్నారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు.
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెర్వాపూర్ పిట్టల వాడకు చెందిన జయరాం(35) ఇంట్లో రాత్రి ఎవరూ లేని సమయంలో వాసానికి గొలుసుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డిలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత మూడు నాలుగు రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఇరువురికి పిలుపు వచ్చింది. వీరితో పాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దిగుతున్న మూడు పార్టీల అభ్యర్థులు పటాన్చెరు నేపథ్యం కలిగి ఉన్నారు. మెదక్ పార్లమెంట్లో పటాన్చెరు నియోజకవర్గం ఒకటి కాగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు జర్నలిస్టుగా, న్యాయవాదిగా పనిచేయగా, కాంగ్రెస్ అభ్యర్థి చిట్కూల్ ఇటీవల సర్పంచ్గా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రామారెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఓట్లే ఆయా పార్టీలకు కీలకంగా మారనున్నాయి. మెదక్ లోకసభ స్థానంలో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉండగా, అందులో 39 ఏళ్ల లోపు వారే 9, 52,583 మంది ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో 18-19 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్లు 53,458 మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. ఏప్రిల్ 15 వరకు నూతన ఓటర్లు నమోదు చేసుకునే వెసులుబాటును ఎలక్షన్ కమీషన్ ఇవ్వడంతో యువ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.