India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ రాజనీతిజ్ఞత గొప్పదని మాజీ సీఎం KCR అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకొని నిలబడేందుకు నాటి ప్రధానిగా పీవీ నర్సింహారావు సంస్కరణల రూపం వెనుక ఉంది మన్మోహన్సింగ్ అన్నారు. దశాబ్దాలపాటు తెలంగాణపై కొనసాగిన అణచివేతలు, ఆర్థిక దోపిడి, సామాజిక, సాంస్కృతిక వివక్ష తెలిసిన అతికొద్ది మంది నాయకుల్లో మన్మోహన్ ఉంటారన్నారు.
మైనర్పై అత్యాచారం కేసులో నిందితుడు రజినీకాంత్కు 20 ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి జయంతి తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2019లో చౌటకూరు మండలం ఉప్పరగూడెంకు చెందిన రజినీకాంత్ ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రజినీకాంత్కు 20 ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి జయంతి తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2019లో చౌటకూరు మండలం ఉప్పరగూడెంకు చెందిన రజనీకాంత్ ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
స్పూర్తి ప్రధాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మన్మోహన్ సింగ్ వివేకం, సమగ్రతకు ఆదర్శమని, ఆయన దార్శనిక నాయకత్వం.. భారతదేశ పురోగతి పట్ల తిరుగులేని నిబద్ధత, దేశంపై చెరగని ముద్ర వేసిందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు హరీశ్రావు. అనంతరం జగన్నాథం ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి హరీశ్రావు తెలుసుకున్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి చెరువులో<<14983898>>SI సాయికుమార్<<>>తోపాటు కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు దొరికాయి. నిన్న మం. నుంచి SI ఫోన్ ఆఫ్ కాగా అధికారులు ఆరా తీశారు. ఉదయం డ్యూటీ నుంచి వెళ్లిన శ్రుతి ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్ బీబీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా చెరువులో గాలింపు చేపట్టిన పోలీసులు అర్ధరాత్రి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు, ఉదయం SI మృతదేహం గుర్తించారు.
ప్రైవేట్ బౌన్సర్ల వ్యవస్థపై ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఊరంతా కోపగించుకుటారని.. అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో బౌన్సర్లను పెట్టుకుని నెట్టేయించే సంస్కృతిని తెచ్చిందే ఆనాడు TPCC చీఫ్గా పని చేసిన రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. HYD సీపీ సీవీ ఆనంద్ చేతనైతే బౌన్సర్ల మీద చర్యలు తీసుకోవాలన్నారు.
మెదక్ చర్చి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.35 కోట్లు ప్రకటించారు. చర్చి అభివృద్దికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు కేటాయిస్తానని వెల్లడించారు. అంతకు ముందు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే రోహిత్ పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
మెదక్ జిల్లాలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్కు హెలికాప్టర్లో వస్తారు. అనంతరం వనదుర్గమాతను దర్శించుకుని పూజలో పాల్గొంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, 11:45కి మెదక్ చర్చికి వెళ్తారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఎస్పీ కార్యాలయం వద్ద గల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్తారు.
Sorry, no posts matched your criteria.