Medak

News December 25, 2024

మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

image

మెదక్ జిల్లాలోని కేథడ్రల్ చర్చి ఓ అద్భుతం. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా దీనికి పేరుంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ నిపుణులు నిర్మించారు. క్రిస్మస్ వేడుకలకు రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక్కడ వైభవంగా జరిగే వేడుకల్లో వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొంటారు. నేడు చర్చిని ఉపరాష్ట్రపత్రి, సీఎం సందర్శించుకోనున్నారు.

News December 24, 2024

మెదక్ జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా

image

సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బేగంపేట నుంచి హెలికాప్టర్లో నేరుగా ఏడుపాయల చేరుకుంటారు. మన దుర్గామాతను దర్శించుకున్న అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మెదక్ చర్చికి చేరుకొని శతాబ్ది, క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగి వెళ్తారు.

News December 24, 2024

దేశానికి వాజపేయి సేవలు వెలకట్టలేనివి: ఎంపీ రఘునందన్

image

తాజ్ దక్కన్‌లో ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ సుధాన్షు తివారీతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ప్రధానిగా వాజపేయి దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని అంటు ఆయన సేవలను కొనియాడారు.

News December 24, 2024

మెదక్: చలి మంట అంటుకొని మహిళ మృతి

image

చలి మంటలు కాచుకుంటుండగా చీరకు నిప్పంటుకొని మహిళ మృతి చెందిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హస్తాల్ పూర్ గ్రామానికి చెందిన మామిండ్ల బుచ్చమ్మ(55) ఈనెల 19న రాత్రి చలిమంట కాచుకుంటుండగా చీరకు నిప్పంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నేడు మృతి చెందినట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 24, 2024

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ గడువు 30 వరకు పెంపు

image

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు గడువు ఈనెల 30 వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. అడ్మిషన్ రుసుం మీసేవ, ఆన్ లైన్ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎక్కువ మంది చేరేలా చూడాలని కోరారు.

News December 24, 2024

12 నెలలకు వేతనాలు ఇప్పించాలని కోదండరాంకు విజ్ఞప్తి

image

ప్రభుత్వ పాఠశాలల్లో SSA ఆధ్వర్యంలో పని చేస్తున్న సిద్దిపేట జిల్లా ఒకేషనల్ సంఘం నేతలు MLC కోదండరాంను కలిశారు. తమకు 12 నెలలకు గాను వేతనం ఇప్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోదండరాం.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో VTA రాష్ట్ర నాయకులు ప్రవీణ్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, నవీన్, జ్ఞానేశ్వర్, వృత్తి విద్య అధ్యాపకులు పాల్గొన్నారు. 

News December 24, 2024

మెదక్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా

image

మెదక్ జిల్లాలోఈరోజు ఉదయం 8:30 వరకు టేక్మాల్ 14.8, శంకరంపేట(A) 15.4, అల్లాదుర్గ్ 16, కౌడిపల్లి16.0, కుల్చారం16.0, పాపన్నపేట16.1, వెల్దుర్తి16.2, రేగోడ్16.2, చిలప్ చెడ్ 16.3, నార్సింగి16.4, రామాయంపేట16.6, చేగుంట 16.8, శివ్వంపేట17.2, నర్సాపూర్17.3, హవేళిఘనపూర్17.4, మెదక్17.5, నిజాంపేట్17.6, శంకరంపేట(R) 17.7, మాసాయిపేట17.8, హవేళిఘనపూర్ 18.1, మనోహరాబాద్18.5, తూప్రాన్18.5° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 24, 2024

రేపు మెదక్ జిల్లాలో పర్యటించనున్న ముగ్గురు ప్రముఖులు

image

మెదక్ జిల్లాకు 25న ముగ్గురు ప్రముఖులు రానున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ పర్యటించనున్నారు. మెదక్ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి, గవర్నర్ ముఖాముఖి నిర్వహించనున్నారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం రేవంత్ మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్నారు. అనంతరం ఏడుపాయల వనదర్గమ్మను దర్శింకుంటారు.

News December 24, 2024

సంగారెడ్డి: నేటి నుంచి మిషనరీ పాఠశాలలకు సెలవులు

image

జిల్లాలోని మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా నేటి నుంచి 27 వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అనంతరం తిరిగి 28 నుంచి పునః ప్రారంభం అవుతాయన్నారు. ఈ విషయాన్ని సంబంధిత పాఠశాలల యజమాన్యం గమనించాలని కోరారు.

News December 24, 2024

శతాబ్ది ఉత్సవాల్లో మెదక్ చర్చి నిర్మాత కుటుంబీకులు

image

మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇన్‌ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ మనుమలు, మనమరాండ్లు డేవిడ్ పాస్నెట్, డికాన్ పాస్నెట్, జోనాథన్ పాస్నెట్, రాబర్ట్ పాస్నెట్ తో పాటు బిషప్‌లు కార్నలిస్(కృష్ణ గోదావరి), వరప్రసాద్(రాయలసీమ), హేమచంద్ర కిరణ్, స్థానిక ఇంచార్జి శాంతయ్య, గురువులు పాల్గొన్నారు.