India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లోని లక్ష్మి గార్డెన్స్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలు -2024 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడంతోపాటు సమానంగా చూస్తుందన్నారు.
ఏం ముఖం పెట్టుకొని మెదక్కు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏడుపాయల, చర్చి మీద ఒట్టేసి రెండు లక్షలపైన రుణం మాఫీ చేయలేదు. ఏడుపాయల, చర్చిలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ధాన్యం కొనడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని హరీశ్ రావు ద్వజమెత్తారు.
అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ లో సర్వ శిక్షా ఉద్యోగుల నిరసనకు హరీష్ రావు మద్దతు పలికి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీసినా స్పందించలేదని పండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ప్రజల సమస్యలు ముఖ్యం కావా అని ప్రశ్నించారు. ఇకనైనా సమగ్ర ఉద్యోగుల సమస్య పరిష్కరించాలన్నారు.
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా సంగారెడ్డికి చెందిన కొల్లూరు నియమిస్తూ అధ్యక్షుడు రామకృష్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాష్ మాట్లాడుతూ.. తనను ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఈ పదవితో తనపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.
రాష్ట్రంలో 5.23 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు జరుగుతుందని ములుగు కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాథుర్ పేర్కొన్నారు. ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో 10వ వ్యవస్థాపక దినోత్సవం, జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. వ్యవసాయ స్థూల విలువ ఉత్పత్తికి 30 శాతం తోడ్పడుతుందన్నారు
బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో రూ. 4లక్షల 17వేల కోట్ల అప్పుచేస్తే.. రేవంత్ రెడ్డి కేవలం ఏడాది కాలంలో రూ. 1లక్షా 27వేల కోట్ల అప్పులు చేశారని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సోమవారం మెదక్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బడా కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజీలు తీసుకుని డబ్బులిచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదని మండిపడ్డారు.
శ్రీతేజకు ప్రభుత్వం రూ.25 లక్షలు ప్రకటించడానికి స్వాగతిస్తున్నామని, అలాగే గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎంపీ సిద్దిపేటలో మాట్లాడుతూ..ఇప్పటివరకు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 42 మంది విద్యార్థులు చనిపోయారని వారి విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వారిని ప్రభుత్వ ఆదుకోవాలని MP కోరారు.
రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఒర్లుడు తప్పా ఓదార్పు లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అడిగిన వాళ్ళను అదరగొట్టుడు, ప్రశ్నించిన వారిమీద పగబట్టుడు తప్ప జరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో 41శాతం క్రైమ్ రేటు పెరిగిందన్నారు. బీఆర్ఎస్ నేతలు, నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేట అబ్బాయి.. అమెరికా అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. సిద్దిపేటకు చెందిన వడ్డేపల్లి సురేంద్రనాథ్-అండాలు దంపతుల 2వ కొడుకు శ్రీనాథ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో USకు చెందిన చిన్న పిల్లల వైద్యురాలు క్రిస్టల్ను ప్రేమించారు. ఇరు కుటుంబాల సమ్మతితో ఇద్దరు సిద్దిపేటలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. సప్తసముద్రాలు దాటిమూడు ముళ్ల బంధంతో వారు ఒక్కటయ్యారు.
రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందిన యువకుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్పై శ్రీశైలం వెళ్తున్నారు. శనివారం రాత్రి NGKL జిల్లా మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. దీంతో అరవింద్ స్పాట్లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.