Nalgonda

News May 24, 2024

NLG: చింత చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి

image

చింత చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన హుస్సేన్ గ్రామంలోని చెరువు కట్ట సమీపంలో ఉన్న చింత చెట్టు ఎక్కి చిగురు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య షాజిదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 24, 2024

NLG: ఎడ్ సెట్‌కు 331 మంది హాజరు

image

రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిన నల్లగొండలోని ఎస్పీ ఆర్ పాఠశాల సెంటర్లో నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్-2024 ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు కొనసాగాయి. ఈ పరీక్షలకు 360 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 331 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.

News May 24, 2024

కుమారుడు కొట్టాడని ఉరివేసుకున్న తల్లి

image

కుమారుడు కొట్టాడని తల్లి ఉరి వేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. మోత్కూరుకు చెందిన రేఖ(38)కు కూతరు(15), కుమారుడు(17) సంతానం. కుమారుడు HYDలోని కార్పొరేట్ కాలేజ్‌లో చదువుతున్నాడు. ఇంటర్‌లో ఫెయిల్ అవడంతో చెడు వ్యసనాలు మాని బాగా చదువుకోవాలని తల్లి కుమారుడిని మందలించింది. దీంతో కుమారుడు కోపోద్రేకుడై తల్లిపై చేయి చేసుకున్నాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

News May 24, 2024

NLG: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాలో మొత్తం 12,000 మంది పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1న పరీక్షలు ముగియనున్నాయి.

News May 24, 2024

NLG : 48 గంటల ముందు నుంచే వీటిపై నిషేధం: కలెక్టర్

image

NLG -KMM- WGL శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడం నిషేధమని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఈ ఉపఎన్నికకు ఈనెల 27న ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

News May 23, 2024

SRPT:పోస్టల్ బ్యాలెట్ కు రేపే చివరి రోజు: కలెక్టర్

image

MLC ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగులు కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ వెంకట్రావు,ఆదనపు కలెక్టర్ ప్రియాంకతో కలసి గురువారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 182 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని తెలిపారు. రేపే చివరి రోజు అని తెలిపారు.

News May 23, 2024

రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా.. కానీ అంతా ఉత్తదే: ఈటల

image

సర్వేలను తలదన్నేలా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఈటల రాజేందర్ అన్నారు. నేడు దేవరకొండలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా.. కానీ అంతా ఉత్తదే, పదేళ్లలో మోదీ ప్రభుత్వంపై ఒక్క స్కామ్ ఆరోపణరాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలతో ఛీకొట్టించుకుంది’ అని అన్నారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయని ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు.

News May 23, 2024

నల్లగొండ: సీసీటీవీ సర్వీసింగ్, రిపేర్‌లో ఉచిత శిక్షణ

image

నల్లగొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నందు గ్రామీణ ప్రాంత పురుషులకు సీసీటీవీ సర్వీసింగ్, రిపేర్స్‌లో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణలో చేరుటకు చివరి తేదీ మే 24 అని, ఆసక్తి గలవారు సంస్థ కార్యాలయంలో లేదా 9701009265 ఫోన్ నంబర్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లా(నల్గొండ, సూర్యపేట, భువనగిరి)కు చెందిన వారై ఉండాలన్నారు.

News May 23, 2024

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

image

నల్గొండ జిల్లా తిప్పర్తిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిద్రమత్తులో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్న ఇద్దరు పిల్లలు, కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

పోస్టింగుల కోసం గురుకుల అభ్యర్థులు ఎదురుచూపు!

image

గురుకుల నోటిఫికేషన్‌లో ఇచ్చిన 9210 ఖాళీలను నింపే సదుద్దేశంతో 2 నెలల క్రితం ప్రభుత్వం ఎంపికైన అభ్యర్ధులను గురుకుల సొసైటీలకు కేటాయిస్తూ అభ్యర్థులకు అలాట్మెంట్ ఆర్డర్స్ అందజేసి నిరుద్యోగుల జీవితాలలో ఆశలు చిగురించేలా చేసింది. ఇదే ఆర్డర్‌లో ప్లేస్ అఫ్ పోస్టింగ్‌ను విడిగా అందజేస్తామని చెప్పినప్పటికీ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఇప్పటివరకు అభ్యర్థులకు అందజేయలేదు. వందలాది మంది పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.