Nalgonda

News October 28, 2024

పేద విద్యార్థినికి రూ.లక్ష సాయం చేసిన తీన్మార్ మల్లన్న 

image

ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా.. నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన ఇటిక్యాల మంజులకి ముగ్గురు సంతానం. అందులో రెండో అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. చదివించేంత స్తోమత లేకపోవడంతో మల్లన్న సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేద విద్యార్థినికి సాయం చేసిన మలన్నను పలువురు అభినందించారు. 

News October 28, 2024

NLG: ఆందోళన చేసిన పోలీసుల డిస్మిస్

image

పలు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని సస్పెండ్ చేసిన అధికారులు.. వారిలో 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. డిస్మిస్ చేసిన వారిలో మన ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌‌కు చెందిన TGSP కానిస్టేబుల్ రవి కుమార్ కూడా ఉన్నారు.

News October 28, 2024

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రా లకు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో (ప్రతి ఆదివారం) డిపోల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు.

News October 27, 2024

ఈనెల 29న యాదాద్రి హుండీ లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 29న లెక్కించనున్నట్లు ఆదివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం 7 గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లు, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీలు లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News October 27, 2024

సూర్యాపేట: తండ్రి మృతి.. కంటతడి పెట్టించిన చిన్నారి మాటలు

image

చివ్వెంల మండలం మున్యనాయక్ తండాలో యువరైతు బానోతు సైదా (29) <<14463031>>విద్యుత్ షాక్‌తో శనివారం మృతి<<>>చెందిన విషయం తెలిసిందే. సైదా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మృతదేహం పక్కన కూర్చున్న అతని కూతురు లే నాన్న లే అంటూ రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిసివేసింది.

News October 27, 2024

R&B, ఫారెస్ట్ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష సమావేశం

image

R&B, ఫారెస్ట్ అధికారులతో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఛాంబర్ లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అటవీ అనుమతులు లేక ఆగిపోయిన రోడ్ల నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. అటవీ అనుమతులకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు మరింత వేగంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కోరారు.

News October 26, 2024

అఖిలపక్ష నేతలతో కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే వేముల

image

రామన్నపేట మండల అఖిలపక్ష నాయకులతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె. జెండగేను శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కలిశారు. రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. పరిశ్రమ ఏర్పాటులో ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం ఉండాలని విన్నవించారు.

News October 26, 2024

సూర్యాపేట మీదుగా సెమీ స్పీడ్ కారిడార్ 

image

శంషాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు సూర్యాపేట మెయిన్ జంక్షన్ ద్వారా సెమీ హై స్పీడ్ కారిడార్ ఖరారైంది. అలాగే ఇంకో మార్గం కర్నూలు నుంచి విశాఖపట్టణం వరకు సూర్యాపేట మెయిన్ జంక్షన్ గా ఖరారైంది. నవంబర్లో దీనికి సంబంధించిన ఎలైన్మెంట్ పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. గంటకు 220 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లే సెమీ హై స్పీడ్ కారిడార్‌గా గుర్తింపు పొందనుంది. దీంతో సూర్యాపేట పట్టణం రూపు రేఖలు మారనున్నాయి.

News October 26, 2024

యాదగిరిగుట్టలో అసాంఘిక కార్యకలాపాలు.. లాడ్జి సీజ్

image

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన లాడ్జిని రెవెన్యూ అధికారులు, పోలీసులు సీజ్ చేశారు. పాతగుట్ట కాలనీలో యాదాద్రి ఫ్యామిలీ రూమ్స్ పేరుతో లాడ్జి నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. సెప్టెంబరు 26న లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాల ఘటనపై కేసు నమోదైందని.. విచారణ అనంతరం RDO ఆదేశాలతో సీజ్ చేసినట్లు CI రమేశ్ వెల్లడించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News October 26, 2024

NLG: దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ

image

ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సీహెచ్.సైదులు తెలిపారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుల్లో MLGలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నేడే ఆఖరీ తేదీ అని రెడ్డి కాలనీ, MLGలో దరఖాస్తులు అందజేయాలన్నారు.