Nalgonda

News October 26, 2024

NLG: దరఖాస్తుకు.. నేడే ఆఖరి తేదీ

image

ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సీహెచ్.సైదులు తెలిపారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీ షియన్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుల్లో MLGలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నేడే ఆఖరీ తేదీ అని రెడ్డి కాలనీ, MLGలో దరఖాస్తులు అందజేయాలన్నారు.

News October 25, 2024

NLG: నవంబర్ 4న బీసీ కమిషన్ బృందం రాక: జిల్లా కలెక్టర్

image

నవంబర్ 4వ తేదీన బీసీ కమిషన్ బృందం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ కమిషన్ బృందం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని కులాల (SC, ST, BC, మైనార్టీ) సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణ చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు.

News October 25, 2024

ధాన్యం సేకరణలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

image

వానకాలం ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా పౌరసరఫరాల అధికారులు, మార్కెటింగ్ ,డిఆర్డిఏ, సహకార, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం సేకరణ సమస్యలపై సమీక్షించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులను తగినంతగా ఉంచాలని, అలాగే ఇతర సౌకర్యాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.

News October 24, 2024

NLG: ఘనంగా గణిత దినోత్సవ ఉత్సవాలు

image

నల్గొండ ఎంజి యూనివర్సిటీలో గురువారం జాతీయ గణిత దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత విభాగాధిపతి & సమన్వయకర్త డా. మద్దిలేటి పసుపుల అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సమావేశంలో ఎంజి యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్  అల్తాఫ్ హుస్సేన్ పాల్గొని శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

News October 24, 2024

విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాస రచన పోటీ

image

పోలీసు ఫ్లాగ్ డే పురస్కరించుకుని విద్యార్థుల కోసం ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు NLG జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడంలో నా పాత్ర అనే అంశంపై వ్యాసాలను అందించవచ్చని తెలిపారు. ఈనెల 27వ తేదీలోగా తమ వ్యాసాలను ఈ కింద చూపబడిన లింక్‌కు అప్‌లోడ్ చేయాలన్నారు.

News October 24, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే వరద తగ్గడంతో క్రస్టు గేట్లను మూసివేశారు. జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 48,569 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 48,569 క్యూసెక్కులుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు గాను ప్రస్తుతం 589.50 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు గాను ప్రస్తుతం 310 టీఎంసీలుగా ఉందన్నారు.

News October 24, 2024

యాదాద్రి: రోడ్డు మార్గంలో దొంగల భయం

image

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి కొత్తగూడెం మార్గంలో దొంగల భయం ఎక్కువైంది. బుధవారం రాత్రి సుమారు 8 గంటల తర్వాత గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రోడ్డు మార్గంలో కొత్తగూడెం నుంచి పోచంపల్లికి వస్తున్న ప్రయాణికుడిని వెంబడించారు. అతను వారి నుంచి తప్పించుకుని గ్రామ ప్రజలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

News October 23, 2024

గవర్నర్‌ను కలిసిన ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి

image

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి  ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంజి యూనివర్సిటీ ప్రగతిని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు.

News October 23, 2024

NLG: అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం పోస్ట్‌పోన్ తేదీలు ఇవే..!

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

12వ బెటాలియన్‌లో ఆరుగురిపై సస్పెన్షన్ వేటు

image

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ దళం అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో ఆరుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. రికార్డు పర్మిషన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అన్నెపర్తి బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు, బంధువులు అద్దంకి-NKP రహదారిపై రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులను గుర్తించిన పోలీసులు ఆరుగురు సిబ్బందిపై వేటు వేశారు.