Nalgonda

News May 22, 2024

NLG: మరోసారి ‘సన్న’గా తెరపైకి!

image

వరి విత్తనాల్లో సన్న రకాల సాగు మరోసారి తెర పైకి వచ్చింది. గతంలో సన్నాల సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఒక్క సీజన్‌కు మాట మార్చింది. ఇప్పుడు మళ్లీ సన్నాల సాగుకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాటి కష్టాలు, జరిగిన నష్టాల అనుభవంతో ఉన్న రైతులు సన్నాల సాగంటే భయపడుతున్నారు. రూ.500 బోనస్ రావాలంటే సాగు చేయక తప్పదని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల సన్నాల సాగు చేస్తున్నారు.

News May 22, 2024

నల్గొండ: నేడు ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారుల సదస్సు

image

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై చర్చించడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ ఏవో, ఏడిఏతో పాటు ఉద్యాపన శాఖ అధికారులతో నల్గొండలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

News May 22, 2024

NLG: MLC ఎన్నికలు.. పోల్ చిట్టీల్లో తప్పులు

image

పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా HNRలో పంపిణీ చేసిన పోల్‌ చిట్టీల్లో పోలింగ్‌ కేంద్రం చిరునామాలో తెలుగు, ఆంగ్లంలో రెండు వేర్వేరు చిరునామాలు అచ్చు వేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. దీంతో అసలు తాము ఏ కేంద్రంలో ఓటు వేయాలా అనే గందరగోళంలో ఉన్నారు. అధికారులు మాత్రం బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా చూసి సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి పోవాలని సూచిస్తున్నట్లు తెలిసింది.

News May 22, 2024

NLG: ఎమ్మెల్సీ ఓటర్లకు కలెక్టర్ సూచన

image

NLG- KMM- WGL శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు ఓటు వేసే సందర్భంగా చేయదగినవి, చేయకూడని అంశాలపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వివరంగా తెలియజేశారు. ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్ తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వైలెట్ స్కెచ్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.

News May 21, 2024

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వీసీగా నవీన్ విఠల్‌

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ఐఏఎస్ అధికారి నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది. MGUలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుత వీసీ గోపాల్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ వీసీగా నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది.

News May 21, 2024

యాదాద్రి: చనిపోతూ ఆరుగురిని బతికించింది

image

తాను చనిపోతూ ఓ మహిళ ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూరుపేటలో అనారోగ్యం కారణంగా సుజాత మరణించింది. ఆమె అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆమె మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చినట్లైంది. తన గొప్ప మనస్సు చూసి ఆలేరువాసులు చలించిపోయారు.

News May 21, 2024

NLG: 21.50 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా

image

వానాకాలం వ్యవసాయ సీజన్ కు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు పంటల ప్రణాళికను ఇప్పటికే రూపొందించారు. మూడు జిల్లాల్లో మొత్తం 21.50లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. సీజన్ కు ముందే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణశాఖ పేర్కొనడంతో… అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ సన్నద్ధమైంది.

News May 21, 2024

NLG: టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపులో గందరగోళం

image

ఉపాధ్యాయ నియామక, పదోన్నతుల కోసం విద్యాశాఖ అధికారులు నిర్వహించనున్న టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపు ఇబ్బందికరంగా మారుతోంది. పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు కోరుకున్న విధంగా సొంత జిల్లాలకు కేటాయించాల్సి ఉన్నప్పటికీ.. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, మల్కాజ్ గిరి, వరంగల్ జిల్లాలకు కేటాయించడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

News May 21, 2024

NLG: ఎమ్మెల్సీ పోలింగ్‌కు చకచకా ఏర్పాట్లు

image

NLG – KMM- WGL పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అందుకు ఇంకా వారం సమయం మాత్రమే ఉండటంతో అధికారులంతా పోలింగ్ ఏర్పాట్లలో తల మునకలయ్యారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్ బూత్ల ఏర్పాటు, జంబో పోలింగ్ బాక్సులు సమకూర్చడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర పనులు చేపడుతున్నారు.

News May 21, 2024

MGU: పరీక్షలు వాయిదా

image

ఈ నెల 27న జరగవలసిన డిగ్రీ 2, 3, సెమిస్టర్ల పరీక్షలను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డా.జి.ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల దృశ్యా తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. 27న జరగవలసిన పరీక్షలు జూన్ 13న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.