India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్లో స్కిన్లెస్ KG రూ.200కే విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ KG రూ.243, విత్ స్కిన్ KG రూ.213గా ధర నిర్ణయించారు. రిటైల్లో రూ.147, ఫాంరేటు ధర రూ.125 ఉంది. కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాలకు సంబంధించిన డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేసి, దగ్ధం చేసినట్లు ఉమ్మడి నల్గొండ డిప్యూటీ కమిషనర్ ఏ.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. నల్గొండ జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష, భువనగిరి ఎక్సైజ్ అధికారి సైదులు, సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గంజాయి కాల్చివేసి దగ్ధం చేసినట్లు తెలిపారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన పరశురామ్ (29) హైదరాబాద్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. నెలరోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్లో చేరిన పరశురామ్ రక్త పరీక్షల అనంతరం బ్లడ్ కాన్సర్గా నిర్ధారించారు. చికిత్స పొందుతూ మంగళవారం జూబ్లీహిల్స్ కేర్ హాస్పిటల్లో కన్ను మూశాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధర్మ దర్శనం కాంప్లెక్స్ నుంచి నేరుగా భక్తుల వెంట నడుచుకుంటూ శునకం నేరుగా ప్రధాన ఆలయంలోకి ప్రవేశించడంతో వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఆలయం నుంచి శునకాన్ని బయటకు పంపారు. ఆలయ అధికారులు సుమారు అరగంట పాటు భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రోక్షణ పూజలు చేశారు.
మూసీ ప్రక్షాళన చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవన కోసం ప్రజాప్రతినిధులతో కలిసి సన్నాహక సమావేశ నిర్వహించి మాట్లాడారు. ప్రతి మండలంలో మూసీ ప్రక్షాళనపై ప్రజలకు కాంగ్రెస్ నేతలు తెలియపరచాలని, మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు.
బొమ్మలరామారం మండలం పిల్లిగుండ్ల తండా గ్రామ ప్రజలు గ్రామంలో మద్యం నిషేధిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం నిర్వహించిన గ్రామసభలో ప్రజలు, బెల్ట్ షాపుల యజమానులు మాట్లాడుకొని గ్రామంలో సంపూర్ణ మద్యపానం నిషేధానికి తీర్మానం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా మద్యం అమ్మితే రూ.25 వేల జరిమానాతో పాటు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని తీర్మానించుకున్నట్లు తెలిపారు.
క్వారీ గుంతలోకి వెళ్లిన బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం. ఆలేరు మండలం కొలనుపాక రాజనగరం గ్రామానికి చెందిన వెంకటేశ్(20) AP విజయవాడలో బీటెక్ చదువుతున్నాడు. ఈక్రమంలో స్నేహితులతో కలిసి ఆదివారం క్వారీ గుంతలో ఈతకు వెళ్లాడు. సెల్ఫీలు తీసుకుంటూ ఏడుగురు గల్లంతయ్యారు. వారిలో వెంకటేశ్ మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న విజయవాడ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేశారు.
ఎంజీయూకి న్యాక్ ఏ గ్రేడ్ వచ్చేలా అధ్యాపకులంతా సమష్టిగా కృషి చేయాలని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం యూనివర్సిటీలో అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకులు ప్రతి విద్యార్థిని విజ్ఞానవంతులుగా తయారుచేసి జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు సమయపాలన పాటించాలని అందుకోసం బయోమెట్రిక్ అమలు చేయాలన్నారు.
భువనగిరిలోని బాలసదన్లో <<14412798>>అనాథ <<>>బాలికపై వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తెలిసిందే. పట్టణ ఇన్స్పెక్టర్ సురేశ్ వివరాల ప్రకారం.. ఈనెల 14న బాలసదన్లో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈక్రమంలో బాత్రూంకి వెళ్లి వస్తున్న బాలికను న్యాయసేవాధికార సంస్థ అటెండర్ లైంగికంగా వేధించాడు. కాగా, ఈఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి 14రోజుల రిమాండ్ విధించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆలయ ఈఓ భాస్కర్ రావు స్పందించారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసం దెబ్బతినే విధంగా వ్యక్తిగత ఫొటో, వీడియో చిత్రీకరణ చేయవద్దు అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఆలయ దర్శనం, తగిన గౌరవం ఇస్తామని తెలిపారు. అందరి మాదిరిగా ఆలయం బయట మాత్రమే ఫొటోలు దిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.