Nalgonda

News October 22, 2024

NLG: జిల్లాలో మొక్కుబడిగానే ప్రజావాణి

image

జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుదారులకు అధికారుల నుంచే చుక్కెదురవుతున్నది. జిల్లాలో కొన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నామమాత్రానికే పరిమితమైంది. గత కొన్ని నెలలుగా ఫిర్యాదుదారులు ఎవరు దరఖాస్తులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

News October 21, 2024

భువనగిరి: బాలసదన్లోని అనాథ బాలికకు లైంగిక వేధింపులు

image

భువనగిరిలోని బాలసదన్‌లో అనాథ బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఈనెల 14న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు ఫిర్యాదు రావడంతో పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనాథలకు రక్షణ కల్పించాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖలోనే రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 

News October 21, 2024

నల్గొండ: బాలిక సూసైడ్

image

దామరచర్ల మండల పరిధిలోని ఓ తండాకు చెందిన బాలిక (14) సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. RCO అగస్టీన్ వివరాలిలా.. MLGలో TG TWURJC [G] పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి ఈనెల 18న తండ్రితో కలిసి పాఠశాలకు వచ్చింది. తాను ఇంటి వద్ద పురుగుల మందు తాగి వచ్చానని తోటి విద్యార్థులకు చెప్పగా.. NLG ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది

News October 21, 2024

జిల్లాలో వారం రోజులపాటు అధికారుల బృందం పర్యటన

image

NLG జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అధ్యయనం నిమిత్తం సివిల్ సర్వీసెస్ ప్రొబెషనరీ అధికారుల బృందం జిల్లాలో వారం రోజులపాటు పర్యటించనున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం జిల్లా పర్యటనకు అవసరమైన ఏర్పాట్లపై ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 21 నుండి 28 వరకు 8 రోజులపాటు పర్యటించనున్నారు.

News October 20, 2024

నల్గొండ: పెళ్లింట తీవ్ర విషాదం

image

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుర్రంపోడు మండలం మొసంగి గ్రామంలో వెంకటయ్య జ్యోతి దంపతులు పురుగు మందు తాగారు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకటయ్య మృతి చెందాడు. జ్యోతి పరిస్థతి విషమంగా ఉంది. వీరు రెండు రోజుల క్రితమే కుమార్తె వివాహం జరిపారు. ఇంతలోనే దంపతులు పురుగు మందు తాగడంతో పెళ్లింట విషాదం నెలకొంది.

News October 20, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల

image

 నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్ల ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. రెండు రోజుల నుంచి అక్కడక్కడ కురుస్తున్న వర్షాల వల్ల నీరు అధికంగా కావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరును వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోందన్నారు. 

News October 20, 2024

NLG: సర్పంచ్, ఉప సర్పంచ్ అవ్వాల్సిందే!

image

కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2, 3 నెలల్లో పంచాయతీ పోరు జరగనుండగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గతంలో ఓడినవారు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, గతంలో గెలిచిన వారు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మరోసారి సర్పంచ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు పావులు కదుపుతున్నారు.

News October 19, 2024

NLG: పిడుగుపాటుకు మహిళ మృతి

image

పిడిగుపాటుకు మహిళ మృతి చెందిన ఘటన అడవిదేవులపల్లి మండలం మొల్కచర్లలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. బాలాజీ తండాకు చెందిన జటావత్ నాగమణి పొలంలో కలుపు తీస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. అందరూ ఇంటికి వెళుతుండగా బాల్నేపల్లి సబ్ స్టేషన్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ వెల్లడించారు.

News October 19, 2024

GREAT: ’47 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించాడు’

image

సంకల్పానికి వయసు అడ్డేమి కాదని నిరూపించాడు సూర్యాపేట(D) కోదాడ వాసి గూటి వీరబాబు. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు. పదో తరగతి అతికష్టం మీద పాసవ్వగా అనంతరం ఇంటర్, డిగ్రీ, బీఈడీ చదివారు. గత 20 ఏళ్లుగా పలు ఉద్యోగాలకు ప్రయత్నించినా త్రుటిలో చేజారాయి. 47 ఏళ్ల వయసులో డీఎస్సీలో సత్తా చాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

News October 19, 2024

తాటిపాముల గ్రామ ఓటరు జాబితా..  

image

తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో వార్డుల వారీగా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం గ్రామంలో 12 వార్డుల్లో 2,960 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,463 మంది, పురుష ఓటర్లు 1,497 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.