India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిట్యాల మండలం వెలిమినేడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం నుంచి సెమిస్టర్ 2,4,6 రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీ పరిధిలో 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం జరిగే సెమిస్టర్ పరీక్షలకు 36,392 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2వ సెమిస్టర్లో 12,525, 4వ సెమిస్టర్లో 12,313, 6వ సెమిస్టర్ లో 11,554 మంది పరీక్ష
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు వారి ప్రచారంలో కులం, మతం, ఎదుటి వ్యక్తులను దూషించడం, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం వంటివి చేయకూడదని తెలిపారు.
వలిగొండ మండలం గోలిగూడేనికి చెందిన దిలీప్రెడ్డి-యామిని దంపతుల కుమారుడు భవిక్రెడ్డి(6నెలలు). ఆ చిన్నారి జన్మించిన మూడో నెల నుంచి శరీర కదలికలు సరిగా లేవు. చాలా ఆస్పత్రుల్లో చూపించారు. నయం కావడానికి ఇంజెక్షన్ ఒక్కటే మార్గమని, అది USలో లభిస్తుందని, దాని ఖరీదు రూ.16 కోట్లని వైద్యులు తెలిపారు. విరాళాలుగా రూ.10 కోట్లే సమకూరాయి. ఇంజెక్షన్ వేయించలేకపోవడంతో బాబు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నందు గ్రామీణ ప్రాంత పురుషులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు ఈ. రఘుపతి తెలిపారు. శిక్షణలో చేరేందుకు చివరి అవకాశం మే 19 అని, ఆసక్తి గలవారు సంస్థ కార్యాలయంలో లేదా, 7032415062 నంబర్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారై ఉండాలని తెలిపారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మల్లారెడ్డిపల్లిలో TSSPDCL ఆర్టిజన్ గ్రేడ్ 2 ఉద్యోగి నడింపల్లి వేణు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డాడు. హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన సూర్యనారణ వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ కోసం సంప్రదించగా వేణు రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు రైతు తెలిపాడు. దీంతో రైతు ACB అధికారులకు విషయం తెలుపగా వారు వేణును రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
ఉద్యోగులు, యువతను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని,ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిశ్చయంతో యువత, నిరుద్యోగులు ఉన్నారని MLA జగదీష్ రెడ్డి అన్నారు. NLG-వరంగల్-ఖమ్మం MLC ఎన్నికలకు సంబంధించి సూర్యాపేటలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘పట్టుదలతో పని చేస్తే విజయం మనదే’ అని అన్నారు.
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో విద్య అందించేందుకు నల్గొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మార్చి 2024 లో 10లో జిపిఏ 7.0 పైన జిపిఏ సాధించిన విద్యార్థులు జిల్లాలోని ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు సంబంధిత పత్రాలతో telanganaepass. cgg.gov.in అనే సైట్లో దరఖాస్తు ఈ నెల 30లోపు చేసుకోవాలన్నారు.
నల్గొండ క్లాక్ టవర్ అంటే తెలియని వారుండరు. ఇటీవల పట్టణంలో వర్షం కురవగా ఓ వ్యక్తి ఆ ఏరియాని క్యాప్చర్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇంకేం.. క్షణాల్లోనే అది వైరల్గా మారింది. చిరు జల్లుల్లో క్లాక్ టవర్ అందాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. ఆ వ్యూ సూపర్ అంటూ నల్గొండ వాసులు కామెంట్లు చేస్తున్నారు. ఎలా ఉందో మీరూ చెప్పండి.
Sorry, no posts matched your criteria.