India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాడుగులపల్లి మండలం నారాయణపురం వద్ద దారుణ హత్య జరిగింది. ఆస్తి తగాదాలతో కొండయ్య (60) అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
∆} పలు శాఖల అధికారులతో సూర్యాపేట, నల్గొండ జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పర్యటన ∆} దేవరకొండలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} మట్టపల్లి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} నల్గొండలో మంత్రి వెంకటరెడ్డి పర్యటన ∆} నాగార్జునసాగర్ కొనసాగుతున్న వరద ఉద్ధృతి
నల్గొండ జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 375 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 152 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, వారం చివరి వరకు అన్ని కేంద్రాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, లారీలు, హమాలీల వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
గచ్చిబౌలి PS పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా కేతిపల్లికి చెందిన ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం RCపురంలో బస్సు దిగిన యువతి(32)నానక్రాంగూడకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆమెపై కన్నేసిన డ్రైవర్ HCUసమీపంలోని మసీద్ బండ వద్ద అత్యాచారం చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీఎస్సీ 2024 సెలక్టెడ్ అభ్యర్థుల స్కూల్ అలాట్మెంట్ కౌన్సెలింగ్ మంగళవారం రాత్రి వరకు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ సబ్జెక్టుల్లో మొత్తం 324 మంది ఉపాధ్యాయులు స్కూల్ జాయినింగ్ అలాట్మెంట్ ఆర్డర్లను పొందారు. డీఈవో అశోక్ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ముగిసినట్లు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ఆలస్యాన్ని పేర్కొంటూ MG యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్కు పిలుపు ఇచ్చిన దృష్ట్యా రిజిస్ట్రార్ ఆచార్య ఆలువాల రవి స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాల యాజమాన్యాలు సంయమనంతో స్పందించాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించడంలో కళాశాల కృషిని గుర్తు చేస్తూ మునుముందు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం 61,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అవుట్ ఫ్లో 40,912 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.00 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 TMCలు కాగా ప్రస్తుతం నీటి నిలువ సామర్థ్యం 307.2834 TMCలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర ,ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ముంబైలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రమేశ్ చేన్నితల, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే ఆధ్వర్యంలో జరుగుతున్న ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వంశీ చందర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖ మూడు డివిజన్ల పరిధిలో బదిలీల ప్రక్రియ ముగిసింది. 34 మంది లైన్ ఇన్స్పెక్టర్లు, 126 మంది లైన్మెన్లు, 30 మంది అసిస్టెంట్ లైన్మెన్లు, ఇద్దరు జూనియర్ లైన్మెన్లు బదిలీ అయ్యారు. నల్గొండ డీఈ (ఆపరేషన్) అన్నమయ్య పదోన్నతి పై హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చారు. నల్గొండలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు భువనగిరికి బదిలీ అయ్యారు.
ఈనెల 17న సీఎం కప్ -2024 పేరుతో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం క్రీడలు నిర్వహిస్తోందని జిల్లా యువజన, క్రీడల అధికారి విష్ణుమూర్తిగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులకు దీనిపై అవగాహన కల్పించేందుకు 17న నల్గొండలో మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Sorry, no posts matched your criteria.