Nalgonda

News May 14, 2024

యాదాద్రి: రైలు పట్టాల ప్రక్కన మహిళ మృతదేహం

image

రైలు పట్టాల పక్కన మహిళ మృతదేహం లభ్యమైన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. రైల్వే పోలీసుల వివరాలిలా.. నాగిరెడ్డిపల్లి – బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య అనాజిపురం సమీపాన మహిళ మృతదేహం లభ్యం కాగా.. రైలు నుంచి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 87125 68454ను సంప్రదించాలన్నారు.

News May 14, 2024

నల్గొండ: పిడుగుపడి యువకుడి మృతి

image

నల్గొండ జిల్లాలో పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. త్రిపురారం మండలం నీలాయగూడెంలో యువకులు క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. వారంతా చెట్టుకిందికి వెళ్లగా పిడుగుపడింది. దీంతో ఓ యువకుడు చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

News May 14, 2024

ఈసారి తగ్గిన పోలింగ్ శాతం

image

ఉమ్మడి నల్గొండ గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 2019 ఎన్నికల్లో నల్గొండ పోలింగ్ శాతం 78.7%గా నమోదు కాగా ఈ సారి 73.85% నమోదైంది. భువనగిరి పార్లమెంట్లో గత ఎన్నికల్లో 79.3% నమోదు కాగా, ఈ సారి 76.47% నమోదైంది.

News May 14, 2024

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి  మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

భార్య ఓటు లేదని… ఓ వ్యక్తి వీరంగం!

image

ఓటరు జాబితాలో తన భార్య పేరు లేదని ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన NKL జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. NKL శివాలయం వీధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఓటు వేసేందుకు కుటుంబంతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. జాబితాలో అతని భార్య పేరు తొలగింపునకు గురైంది. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో తను ఓటు వేసిందని. ఇపుడు ఎందుకు లేదని బీఎల్వోలతో వాగ్వాదానికి దిగాడు.

News May 14, 2024

NLG: 11 మంది నామినేషన్ ఉపసంహరణ

image

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బండారు నాగరాజు (యువతరం పార్టీ) స్వతంత్ర అభ్యర్థులు పోతుల ప్రార్థన, పోతుల యాదగిరి, సోమగాని నరేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారు నాగరాజు, దైద సోమ సుందరం, రత్నం ప్రవీణ్, కేడారి మేకల, రత్నం ప్రవీణ్, రేకల సైదులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

News May 13, 2024

నల్గొండ: తండ్రి చనిపోయిన బాధలోనూ ఓటేసిన మాజీ MLA

image

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే భాదలోనూ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీవ్ర దుఖంలో ఓటువేసి పలువురి మన్ననలు పొందారు.

News May 13, 2024

నల్గొండ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (70.36%)

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ (72.34%) .. ఇబ్రహీంపట్నం – 63.13, మునుగోడు -79.67, భువనగిరి -74.24, NKL -72.34, తుంగతుర్తి -71.30, ALR -79.12, జనగామ -70.25, NLG -68.21, దేవరకొండ-68.31, నాగార్జునసాగర్ -71.60, MLG -70.25, HNR-72.96, KDD-72.40, సూర్యాపేట-68.95

News May 13, 2024

దేవరకొండలో మందకొడిగా పోలింగ్

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంట వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ (62.05%) .. ఇబ్రహీంపట్నం – 52.03, మునుగోడు -67.60, భువనగిరి -66.22, NKL -61.54, తుంగతుర్తి -62.36, ALR -68.41, జనగామ -60.40, NLG -64.67, దేవరకొండ-49.30, నాగార్జునసాగర్ -63.29, MLG -54.72, HNR-64.87, KDD-63.79, సూర్యాపేట-59.20.

News May 13, 2024

నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్స్ ఓటింగ్ (48.48%)

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ (46.49%) .. ఇబ్రహీంపట్నం – 38.62, మునుగోడు -50.37, భువనగిరి -47.26, NKL -47.41, తుంగతుర్తి -49.19, ALR -50.44, జనగామ -47.03, NLG -46.23, దేవరకొండ-40.89, నాగార్జునసాగర్ -52.80, MLG -44.40, HNR-53.58, KDD-52.33, సూర్యాపేట-48.65.