Nalgonda

News October 12, 2024

NLG: అధ్వానంగా రహదారులు.. ప్రజల ఇబ్బందులు

image

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని పలు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఏళ్ల తరబడి రోడ్లు ఇలానే ఉన్నా పట్టించుకునే నాథుడే లేరని, గుంతలుగా మారిన రహదారులపై ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోతె మండలంలో మరీ అధ్వానంగా ఉన్నాయన్నారు. మీ గ్రామంలో రోడ్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.

News October 11, 2024

నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

image

ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గంధంవారిగూడెం వద్ద రూ.300 కోట్లతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజను నిర్వహించారు. ఇంగ్లిష్, తెలుగు మీడియలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News October 11, 2024

NLG: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి 

image

ఉమ్మడి నల్గొండలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురంలో కొడారి లతమల్లేశ్ ముందస్తు సర్పంచ్ ఎలక్షన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రామస్థులకు ఉచిత మంచినీటిని, ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 

News October 11, 2024

నల్గొండ: తెల్లబోతున్న పత్తి రైతులు..!

image

పత్తికి సరైన ధర దక్కక రైతులు దిగులు చెందుతున్నారు. ఏటా పెట్టుబడి బారం, సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సరిగా వర్షాలు పడక.. కాలం కలిసి రాక దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వచ్చిన ఆ కొద్ది పాటి పంటను తీసుకుందామంటే వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి తడిచి చేనులోనే మొలకలు వస్తు న్నాయి. క్వింట పత్తి మొదట రూ.7000 -8000 ఉండగా.. ప్రస్తుతం రూ.5000-6000 కే పరిమితం అయింది.

News October 11, 2024

నల్గొండ: 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులకు టీచర్ ఉద్యోగాలు

image

డీఎస్సీ -2024 పరీక్ష ఫలితాలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. నల్గొండ జిల్లాలోని 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు చేస్తూ డీఎస్సీ-2024కు ఎంపికయ్యారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో పారిశుద్ధ్య, నీటి సరఫరా, మొక్కల పెంపకం, ధ్రువీకరణ పత్రాలు, వీధి దీపాల నిర్వహణ చేసేవారు. ఎంపికైన 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇకపై విద్యార్థులకు బడిలో పాఠాలు చెప్పనున్నారు.

News October 11, 2024

డీఎస్సీ-2024 కౌన్సిలింగ్‌కు ఆదేశాలు రాలేదు: డీఈఓ బిక్షపతి

image

డీఎస్సీ-2024 కౌన్సిలింగ్ విషయంపై ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అని డీఈఓ బిక్షపతి తెలిపారు. ప్రస్తుతం నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు తమ వద్ద రిపోర్టు చేస్తున్నారు. గురు, శుక్రవారాలు ఉపాధ్యాయుల రిపోర్టింగ్కు కు అవకాశం ఇచ్చాం అని అన్నారు. దసరాకు ముందు పోస్టింగ్ లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి దసరా తర్వాతే కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇస్తాం అని పేర్కొన్నారు.

News October 11, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ నియోజకవర్గం జీవీ గూడెం, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండ, మునుగోడు నియోజకవర్గం కల్వకుంట్ల గ్రామంలో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నారు.

News October 11, 2024

నల్లగొండ: ‘డీఎస్సీ- 2024 ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాలి’

image

డీఎస్సీ-2024 లో ఎంపికైన అభ్యర్థులు 10,11 తేదీలలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అధికారి బి.బిక్షపతి తెలిపారు. డీఎస్సీ -2024 ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేసే సమయంలో ఎల్బీ స్టేడియంలో అందించిన అపాయింట్ ఆర్డర్ జిరాక్స్ జత చేసి సంబంధిత కౌంటర్లు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అధికారి బి.బిక్షపతి తెలిపారు.

News October 11, 2024

NLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా సద్దుల బతుకమ్మ సందడి

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజులు పాటు మహిళలు తీరక్క పూలతో బతుకమ్మలు తయారుచేసి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఆటపాటలతో బతుకమ్మలు ఆడారు. చివరి రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా ఊరూరా బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను చెరువులు,కుంటలలో నిమజ్జనం చేశారు.

News October 10, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న మంత్రి

image

నల్గొండ, మునుగోడు నియోజకవర్గాలలో రేపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. పర్యటన వివరాలు నల్గొండ సమీపంలోని గంధం వారి గూడెంలో యంగ్ ఇండియా – ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాల శంకుస్థాపన చేసిన తర్వాత మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో పర్యటించిన తర్వాత నకిరేకల్ పట్టణంలో గౌడ సోదరులకు కాటమయ్య కిట్టును పంపిణీ చేయనున్నారు.