India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..భువనగిరి ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్ (46.49%) .. ఇబ్రహీంపట్నం – 38.62, మునుగోడు -50.37, భువనగిరి -47.26, NKL -47.41, తుంగతుర్తి -49.19, ALR -50.44, జనగామ -47.03, NLG -46.23, దేవరకొండ-40.89, నాగార్జునసాగర్ -52.80, MLG -44.40, HNR-53.58, KDD-52.33, సూర్యాపేట-48.65.
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నల్గొండలో ప్రశాంతంగా కొనసాగుతుంది. పట్టణంలోని బోయవాడ పోలింగ్ సెంటర్లో ట్రాన్స్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటును వినియోగించుకున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర ఈరోజు ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ సమీపంలోని చెన్నకేశవ స్కూల్లో కలెక్టర్ ఓటు వేశారు. సామాన్య ప్రజలతో పాటు క్యూలైన్లో నిలబడి కలెక్టర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఓవరాల్గా నల్గొండలో 12.80%, భువనగిరిలో 10.54శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీల వారీగా పోలింగ్ శాతమిలా.. ఇబ్రహీంపట్నం-8.79,మునుగోడు -13.32, భువనగిరి -9.13, NKG -10.86, తుంగతుర్తి -10.65, ఆలేరు -10.53, జనగామ -10.84, NLG -15.15, DVK-12.47, సాగర్ -13.30, MLG -12.55, HNR-12.11, KDD-13.49, SRPT-10.55.
యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ కళాశాలలు జూన్ 1వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్నాయి. వెంటనే మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీసీ, స్టడీ సర్టిఫికెట్, తాత్కాలిక టెన్త్ మార్కుల మోమో ఆధారంగా ప్రిన్సిపాల్స్ ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తారు. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్లు నిర్ధారిస్తారు.
రఘువీర్ రెడ్డి (INC) నందికొండలోని విజయపూరి నార్త్, హిల్ కాలనీలో, BRS MP అభ్యర్థి కృష్ణారెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్లలో, బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డికి మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటేయనున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి (INC) శాలిగౌరారం మం. బాలిశెట్టి గూడెం, క్యామ మల్లేశ్ (BRS) ఇబ్రహీం పట్నం పరిధి శేరిగూడెం, బూర నర్సయ్య (BJP) ఇబ్రహీం పట్నం పరిధి పసుమాముల, జహంగీర్ (CPM) మునిపంపులలో ఓటుంది.
లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి.
⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి
నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. 349 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సూర్యాపేట జిల్లాలో 229 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అక్కడ సజావుగా ఎన్నికలు జరిగేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.