Nalgonda

News October 9, 2024

నల్గొండ: పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ టీచర్‌గా సెలక్ట్

image

ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కొట్టడమే కష్టం. ఇక జాబ్ వచ్చాక రిలాక్స్ అయి పోతుంటారు కొందరు. అలాంటిది నేరేడుగొమ్ము మండలంలోని తిమ్మాపురం గ్రామానికి నిరంజన్ రెండు ఉద్యోగాలు సాధించాడు. పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో పట్టు వదలకుండా ప్రిపేర్ అయ్యాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో టీచర్‌గా ఎంపికయ్యాడు.

News October 9, 2024

దేవాలయ ధర్మకర్తల మండలికి దరఖాస్తులు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17 దేవాలయాలకు నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ సహాయ కమిషనర్ అనపర్తి సులోచన ఒక ప్రకటనలో తెలిపారు. కట్టంగూర్, చిట్యాల, నకిరేకల్, కేతేపల్లి, నార్కట్ పల్లి మండలాలలోని ఆలయాల్లో ధర్మకర్తల మండలికి 20 రోజుల్లోగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆమె సూచించారు.

News October 8, 2024

యాదాద్రి: రూ.10,65,000తో అమ్మవారి అలంకరణ

image

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. చౌటుప్పల్ మండలం జైకేసారంలో అమ్మవారిని రూ.10,65,000తో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి గ్రామ భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

News October 8, 2024

NLG: లైంగిక దాడి ఘటనలో నిందితుడి అరెస్టు

image

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని చండూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వాటుపల్లి బాబీ (24) కొన్ని రోజుల క్రితం తాపీ పనులు చేసేందుకు మండలంలోని ఓ గ్రామానికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఓ బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.

News October 8, 2024

నల్లగొండలో రేపు జాబ్ మేళా

image

నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయని పేర్కొన్నారు.

News October 8, 2024

లింగాలగూడెంలో క్షుద్ర పూజలు.. భయాందోళనలో గ్రామస్థులు

image

మండలంలోని లింగాలగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన బొబ్బలి నరసింహ, గన్నేబోయిన వెంకన్న ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన మూటలను ఇళ్లలో పడేసి వెళ్లారు. వాటిని గమనించిన సదరు వ్యక్తులు మూటలు విప్పి చూడగా అందులో పసుపు,కుంకుమ, నిమ్మకాయలు, నవధాన్యాలు, గవ్వలు, జీడిగింజలు, తాటి ఆకు బొమ్మలు బయటపడ్డాయి.

News October 8, 2024

NLG: ఆర్టిఐ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

image

RTI ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరపత్రం ఆవిష్కరించించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో దుశ్యర్ల సత్యనారాయణ, సైదులు, మేఖల శ్రీహరి, కాడబోయిన సాయి, మల్లయ్య, శంకర్, రాంబాబు పాల్గొన్నారు.

News October 7, 2024

NLG: విషాదం.. కొడుకుకి ఉరేసి తల్లి సూసైడ్.!

image

యాదాద్రి జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఓ తల్లి కన్న కొడుకుకి ఉరేసి తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దరావులపల్లికి చెందిన జడల సోనీ కొడుకు రియాన్ష్‌కు ఇంట్లో ఉరేసి తాను సూసైడ్ చేసుకుంది. మానసిక గుబులుతో ఆమె ఈఘటనకు పాల్పడినట్లు కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News October 7, 2024

NLG: పాతబస్తీలో మిషన్ పరివర్తన్ కార్యక్రమం

image

నల్గొండ పట్టణంలోని పాతబస్తీ చౌరస్తాలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై పోలీస్ కళాజాత బృందం వారు అవగాహన కల్పించారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిఐ రాజశేఖర్ రెడ్డి కోరారు. గంజాయి తాగినా, గంజాయి అమ్మినా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జూకురి సైదులు, ఉప్పు సురేష్ తదితరులు ఉన్నారు.

News October 7, 2024

NLG: రైతులకు మేలు చేసే విధంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి

image

వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం అయన DVK నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేదే వ్యవసాయ మార్కెట్ కమిటీ అని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు మేలు చేయడమే ధ్యేయంగా పని చేయాలన్నారు.