Nalgonda

News May 13, 2024

కౌంటింగ్ గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

నల్గొండ పట్టణ సమీపంలోని
అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చందన ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కు ఏర్పాటు చేసే టేబుళ్లు,బ్యారీకేడింగ్, ఏజెంట్లు బ్యారేడింగ్, భద్రత, తదితరాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందు అధికారులకు ఇక్కడ బస ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News May 12, 2024

ఎన్నికల విధులు.. గుండెపోటుతో సిబ్బంది మృతి

image

ఎన్నికల విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో వలిగొండ వాసి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మండల పరిధిలోని పహిల్వాన్ పురంకి చెందిన బొడ్డుపల్లి నరసింహ హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం ఎన్నికల విధుల్లో ఉండగా గుండె నొప్పితో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News May 12, 2024

ఎన్నికల విధులకు గైర్హాజరైన 48 మందిపై కేసులు నమోదు:SP

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గంలో ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల విధులకు గైర్హాజరైన 48 మందిపైన ఆర్పీ ఆక్ట్ యు/ఎస్ 134 క్రింద కేసులు నమోదు అయినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రోసెడింగ్ అధికారులు 48 మంది రిపోర్టు చేయాల్సి ఉండగా ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించారు.

News May 12, 2024

ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన వారిపై కేసులు

image

నల్గొండ : ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు నమోదు చేయాలని నల్గొండ కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసు బుక్ చేయాలని సూచించారు. పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు.

News May 12, 2024

మిర్యాలగూడలో యాక్సిడెంట్ 

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మిర్యాలగూడలో జరిగింది. ఎస్సై నరేష్ తెలిపిన ప్రకారం.. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మాలోతు వాగ్య తన ద్విచక్ర వాహనంపై కిరాణం సామాన్ల కోసం మిర్యాలగూడ వస్తున్నాడు. గూడూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతిడి భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

News May 12, 2024

మూడేళ్ల బాలుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు

image

భువనగిరికి చెందిన మూడేళ్ల కుమారుడు శ్రీయాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. రెండు నిమిషాల్లో 55 దేశాలకు సంబంధించిన జెండాలను చూసి ఆ దేశం పేరు చెబుతున్నాడు. 12 రేఖా గణిత పటాలు, 12 రంగులు, 22 జంతువుల పేర్లు చకచకా చెప్పేస్తాడు. న్యూఢిల్లీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ధ్రువపత్రంతో పాటు రికార్డు బుక్‌ను అందించారు.

News May 12, 2024

నల్గొండ: పెద్ద మనుషులుగా వచ్చి కొట్టి చంపారు

image

నల్గొండలో భార్యాభర్తల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. నల్గొండ వన్ టౌన్ సీఐ తెలిపిన సమాచారం మేరకు.. గుంటూరుకి చెందిన సయ్యద్ వలి (40) ఆరేళ్లుగా నల్గొండలో అడ్డా కూలిగా పనిచేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన హాజీ బేగంతో వివాహం జరిగింది. సయ్యద్ వలి మద్యం తాగుతుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్ది చెప్పడానికి వచ్చిన పెద్ద మనుషులు కర్రతో దాడి చేయడంతో వలి మరణించాడు.

News May 12, 2024

NLG: ఓటేయ్యనివ్వట్లేదా.. ఇలా చేయండి

image

ఓటేసే సమయంలో కొన్నిసార్లు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా ఓటర్లపై ఏజెంట్లు సందేహం వ్యక్తం చేసి నకిలీ వ్యక్తని ఓటేయనివ్వరు. అప్పుడు పోలింగ్ అధికారికి రూ.2 చెల్లించి FORM-14లో పేరు, అడ్రెస్ రాసిచ్చి వారి ఐడెంటిటీని నిరూపించుకుని ఓటేయొచ్చు. దీంతోపాటు మీ ఓటు ఆల్రెడీ ఇంకెవరో వేశారంటే వెంటనే పోలింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయాలి. టెండర్ ఓటును డిమాండ్ చేయొచ్చు. టెండర్ ఓటు పడితే రీపోలింగ్ కు అవకాశం ఉంది.

News May 12, 2024

కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు అయినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ తండ్రి కన్నిలాల్ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆదివారం రావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేసీఆర్ పర్యటనకు అధికారులు అనుమతివ్వలేదు. దీంతో పర్యటన రద్దైంది. 

News May 12, 2024

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేటలో జరిగింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. కోదాడ – జడ్చర్ల రహదారిపై అంగడిపేట వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో డీజిల్ పోయించుకుని వస్తున్న ఆటోను హెడ్ కానిస్టేబుల్ మర్యాదాస్ ఆపాడు. ఈ క్రమంలో వెనకనుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.