Nalgonda

News May 12, 2024

కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు అయినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ తండ్రి కన్నిలాల్ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆదివారం రావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేసీఆర్ పర్యటనకు అధికారులు అనుమతివ్వలేదు. దీంతో పర్యటన రద్దైంది. 

News May 12, 2024

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేటలో జరిగింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. కోదాడ – జడ్చర్ల రహదారిపై అంగడిపేట వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో డీజిల్ పోయించుకుని వస్తున్న ఆటోను హెడ్ కానిస్టేబుల్ మర్యాదాస్ ఆపాడు. ఈ క్రమంలో వెనకనుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News May 12, 2024

NLG: ఓటరు కార్డు లేనివారికి ప్రత్యామ్నాయ కార్డులు

image

ఓటరు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 1.పాస్పోర్టు 2.డ్రైవింగ్ లైసెన్స్, 3.ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు గుర్తింపు, కార్డులు 4.బ్యాంకు, పోస్టాఫీసు పాస్ బుక్ 5.పాన్ కార్డు, 6.ఆర్టీఐ ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు, 7.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి జాబ్ కార్డు, 8.కార్మిక శాఖ ఇచ్చిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, 9. ఫొటోతో కూడిన పింఛను పత్రం, 10.ఆధార్ కార్డు చూపించి ఓటు వేయవచ్చు.

News May 12, 2024

నల్గొండ: పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్

image

MP ఎన్నికల నేపథ్యంలో SRPT జిల్లాలోని 1,201, BNR జిల్లాలో 2,141, NLG జిల్లాలో 1,814 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం 6 నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 48 గంటల పాటు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల లోపల, బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.

News May 12, 2024

పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ చందనా దీప్తి

image

NLG:ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.జిల్లాలో శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు,9 మంది డిస్పీలు,37 మంది సీఐలు,84 మంది యస్.ఐలతో కలిపి మొత్తం 3000 మంది సిబ్బంది, 7 కంపెనీల కేంద్ర బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది.వీటితో పాటు 5 ప్లాటున్ల TSSP సిబ్బంది,పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 11, 2024

NLG: ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులకు కీలక సూచన

image

MP ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నింటినీ తనిఖీ చేయించుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ తెలిపారు. శనివారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల మూడో విడత తనిఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఎవరైనా అభ్యర్థులకు ఖర్చులకు సంబంధించి రిజిస్టర్లు, ఖర్చులు సంబంధించిన వివరాలు మిగిలిపోయినట్లయితే తనిఖీ చేయించుకోవాలన్నారు.

News May 11, 2024

రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

నార్కట్పల్లి – చిట్యాల రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. నల్గొండ రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి.రజిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడి వయసు 35-40సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 11, 2024

‘సాగర్’లో భారీగా తగ్గిపోతున్న జలాలు

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. శనివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 504.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను, 123.0122 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో లేదని, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులు కొనసాగుతోందని తెలిపారు.

News May 11, 2024

సద్దుల చెరువులో మహిళ మృతదేహం లభ్యం

image

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సూర్యాపేట సద్దుల చెరువులో శనివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో సద్దుల చెరువులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న వారు మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు.

News May 11, 2024

నల్గొండ: గుండెపోటుతో యువకుడు మృతి

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా బ్రాహణవెల్లంలకు చెందిన నవీన్ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. అతనికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.