Nalgonda

News October 5, 2024

యాదాద్రి: భార్యను హత్య చేసిన భర్త

image

మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 5, 2024

నేటి నుంచి నల్గొండలో చేనేత హస్తకళా మేళా

image

నల్గొండ బోయవాడలో గల ఎస్బీఆర్ గార్డెన్స్‌లో ఈ నెల 5 నుంచి 27 వరకు కళాభారతి చేనేత హస్తకళ మేళా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఇందులో అఖిలభారత హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలంతా ఈ ప్రదర్శనను తిలకించి చేనేతను ఆదరించాలని కోరారు. చేనేత కళాకారులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్త్రాలను అమ్మడం జరుగుతుందని తెలిపారు.

News October 5, 2024

ప్రతి ఇంటిని.. ప్రతి కుటుంబాన్ని కవర్ చేయాలి: కలెక్టర్

image

పైలెట్ పద్ధతిన నిర్వహిస్తున్న కుటుంబ డిజిటల్ కార్డు సర్వే సందర్భంగా ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని కవర్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సర్వే బృందాలను ఆదేశించారు. గురువారం ప్రారంభమైన కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అయన నల్గొండ మున్సిపల్ పరిధిలోకి వచ్చే 4వ వార్డు పరిధిలో గల కేసరాజుపల్లి హ్యాపీ హోమ్స్ తనిఖీ చేశారు.

News October 4, 2024

అధికారం పోగానే గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ నేతలు : కోమటిరెడ్డి

image

మూసీని ప్రక్షాళన చేస్తామని జైకా నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు.. అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన “అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024” కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ విధానాలపై మండిపడ్డారు.

News October 4, 2024

NLG: పంచాయతీ ఓటర్లు@22,45,868

image

ఉమ్మడి NLG జిల్లాలో 1,768 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఇటీవల గ్రామపంచాయతీ తుది ఓటర్లు లిస్ట్ విడుదల చేసింది. 1,768 గ్రామ పంచాయతీలో 15,478 వార్డులుండగా 22,45,868 గ్రామీణ ఓటర్లు ఉన్నారు. వీరిలో థర్డ్ జెండర్ 75 మంది, 11,11,488 మంది పురుషులు, 11,34,305 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

News October 4, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 904 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 904 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. రైతులు పండించిన ధాన్యాన్ని పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనుంది. అందుకోసం నల్గొండ జిల్లాలో 375, యాదాద్రి జిల్లాలో 323, సూర్యాపేట జిల్లాలో 206 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

News October 4, 2024

NLG: ఇతర ప్రాంతాల ధాన్యం కొనుగోళ్లకు చెక్

image

ఈ వానాకాలం ధాన్యం కొనుగోలులో భాగంగా ఎట్టి పరిస్థితులలో బయటి ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి నల్గొండ జిల్లాకు ధాన్యం రావడానికి వీల్లేదని అన్నారు. 2024- 25 వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అయిన ఉదయాదిత్య భవన్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

News October 4, 2024

ఉమ్మడి జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వాడపల్లి ఎస్సైగా పనిచేస్తున్న ఈడుగు రవి, హాలియా ఎస్సై సతీష్ రెడ్డిలను నల్లగొండ ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని పెన్ పహాడ్ ఎస్సై రవీందర్, ఆత్మకూరు(ఎస్) ఎస్సై వై.సైదులు, తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలును ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు.

News October 3, 2024

నల్గొండ: ఈనెల 14 వరకు డీజేల వినియోగంపై నిషేధం: ఎస్పీ

image

నల్గొండ జిల్లా పరిధిలో ఈనెల 14 వరకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే DJలతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధిస్తూన్నట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించినట్లు ఎస్పీ వెల్లడించారు.

News October 3, 2024

దేవరకొండ దాబాలో వ్యక్తి మృతి

image

దేవరకొండలో – డిండి రోడ్డులో గల దాబాలో పని చేసే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాబా నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.