Nalgonda

News May 10, 2024

రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారి!

image

NLG లోక్ సభ నియోజకవర్గం, KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇలా రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం చాలా అరుదు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటి ఫికేషన్ విడుదల కాగా.. ఎన్నికల సంఘం NLG లోక్ సభ నియోజకవర్గానికి జిల్లా కలెక్టర్ హరిచందన ను రిటర్నింగ్ అధికారిగా నియమించారు.

News May 10, 2024

NLG: SMSలపై నిషేధం

image

ఈ నెల 13న MP ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా రేపు సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు అభ్యంతరకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ SMSలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని గుర్తు చేశారు.SHARE IT

News May 10, 2024

12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు నల్లగొండలో శిక్షణ

image

WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో పిఓ, ఏపీఓలు, పోలింగ్ సిబ్బందిది ముఖ్యపాత్ర అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

News May 9, 2024

12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు నల్లగొండలో శిక్షణ

image

WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో పిఓ, ఏపీఓలు, పోలింగ్ సిబ్బందిది ముఖ్యపాత్ర అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

News May 9, 2024

ధాన్యం అమ్మిన రైతులకు రూ.584 కోట్లు చెల్లింపు

image

NLG జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు రూ.584 కోట్లు చెల్లించినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. కష్టం మిల్లింగ్ రైస్, యాసంగి ధాన్యం కొనుగోలుపై గురువారం తన ఛాంబర్ లో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు గాను 370 దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, వీటి ద్వారా ఇప్పటి వరకు 661 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.

News May 9, 2024

కార్యాలయాలకు సెలవు: జిల్లా కలెక్టర్ హరి చందన

image

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజు 13న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న విద్యా సంస్థలు, కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల నిమిత్తం ఈ నెల 12వ తేదీ సైతం సెలవుదినంగా ప్రకటించారు.

News May 9, 2024

పగడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు : ఎస్పీ

image

జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తున్నoదున రానున్న 72 గంటలు ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం తెలిపారు. ఈనెల11వ తేదీ నుండి ఎన్నికల రోజైన 13వ తేది వరకు ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా 48 గంటల నిబంధనలు పటిష్టంగా ఉంటాయన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని… సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు.

News May 9, 2024

నల్గొండ జిల్లాలో జీరో షాడో

image

నల్గొండ జిల్లా ఆమగల్లులో జీరో షాడో కనిపించింది. అంటే మిట్టమధ్యాహ్నం రోజూ కనిపించే మన నీడ ఇవాళ కనిపించదు. నిటారుగా ఉండే మనిషి, వస్తువు లేదా జంతువుల నీడలు కనిపించవు. ఇది ఇవాళ మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై 2, 3 నిమిషాల పాటు కొనసాగుతుంది.

News May 9, 2024

నల్గొండ: రిక్షా తొక్కుతూ వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ 

image

శివసేన బలపరిచిన నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి పూస శ్రీనివాస్ రిక్షా తొక్కుతూ వచ్చి నామినేషన్ వేశారు. ఆయన అర్ధనగ్నంగా నామినేషన్ కేంద్రానికి వచ్చి నామినేషన్ పత్రాలను కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. నిరుద్యోగుల గొంతుకనై పోరాడతానని శ్రీనివాస్ చెప్పారు. 

News May 9, 2024

NLG: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు

image

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. బుధవారం మరో 12 మంది అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందనకు నామినేషన్లు అందజేశారు. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరింది.