Nalgonda

News September 28, 2024

NLG: దసరా బంపర్ ఆఫర్లు.. మన జిల్లాలోనే!

image

తెలంగాణలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. NLG జిల్లాలోని లెంకలపల్లి, వెల్మకన్నె గ్రామాలలోని యువకులు వినూత్నంగా ఆలోచించి ఓ ఆఫర్ పెట్టారు. 2024 దసరాకు బంపర్ ఆఫర్ అంటూ.. ‘రూ. 100 కొట్టు మేకను పట్టు’ అనే ఆఫర్ పెట్టారు. ఆఫర్‌లో మేక, నాటు కోళ్లు, మందు బాటిళ్లు గెలిచిన వారికి బహుమతిగా ప్రకటించారు.

News September 28, 2024

NLG: ‘చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’

image

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి దీప్తి అన్నారు. నల్గొండ పట్టణంలోని చర్లపల్లి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో చట్టాల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన లేక ఎంతో మంది స్త్రీలు రకరకాల హింసను మౌనంగా భరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ అపర్ణ, పారా లీగల్ వాలంటరీ భీమనపల్లి శ్రీకాంత్ తదితరులున్నారు.

News September 27, 2024

NLG: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!

image

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్‌.. బిడ్డాలెందరూ కోల్‌’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.

News September 27, 2024

మునుగోడు: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి

image

మునుగోడు మండలం చోల్లేడు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం చేసుకుంది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందారు. మునుగోడుకు చెందిన రేవల్లి నాగరాజు, మర్రిగూడ మండలం నర్సిరెడ్డి గూడెంకి చెందిన కీలకత్తి ఆంజనేయులు మృతి చెందారు. మరో వ్యక్తి బొమ్మనగోని నరేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి 108 ద్వారా తరలించారు.

News September 27, 2024

ఇసుక విధానం అమలుకు చర్యలు: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఇసుక వాహనం’ విధానం ద్వారా గృహ వినియోగ అవసరాల కోసం సరైన ధరలకు ఇసుక అందించేందుకు జిల్లాలో ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ ట్లు తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. గృహ అవసరాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లయితే ట్రాక్టర్ల ద్వారా ఇసుక పొందొచ్చని వివరించారు. ఆన్లైన్లో ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై తహశీల్దార్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

News September 27, 2024

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఇద్దరు ఎంపీలకు చోటు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలకు పార్లమెంట్ స్థాయి సంఘం ఛైర్మన్ పదవులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లుగా, పలువురిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించింది. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి ఇంధనం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవులు దక్కాయి.

News September 27, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

image

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

News September 26, 2024

NLG: ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

image

NLG జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. రైతుల ద్వారా బయోమెట్రిక్ లేదా ఐరిస్ సేకరించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలనే విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో గతంలో ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

News September 26, 2024

నల్గొండలో కొనసాగుతున్న మొబైల్ షాపుల బంద్

image

నల్గొండ జిల్లా కేంద్రంలో మొబైల్ షాప్ వ్యాపారుల మీద రాజస్థాన్ మార్వాడి వ్యాపారుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నల్గొండ మొబైల్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా గురువారం జిల్లా కేంద్రంలోని అన్ని మొబైల్ షాపులు బందు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మొబైల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.

News September 26, 2024

సాగర్ ఎడమ కాల్వలో పడి ఇద్దరు గల్లంతు

image

నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం.. త్రిపురానానికి చెందిన సాయి (25), శైలజ(30) బట్టలు ఉతకడానికి సమీపంలోని ఎడమ కాల్వకు వెళ్లారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు శైలజ, సాయి పడిపోయారు. గమనించిన వారు కాపాడే ప్రయత్నం చేసిన నీటీ ప్రవాహనికి కొట్టుకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు