Nalgonda

News May 7, 2024

NLG: భారీ వర్షం.. ఇదీ పరిస్థితి..!

image

జిల్లాలో అకాల వర్షాలు రైతన్నలకు అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా సాగుతున్న మామిడి, అరటి తోటల పై ఈదురుగాలుల ప్రభావం పడింది. జిల్లాలోని సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు ఎస్, పెన్పహాడ్, మద్దిరాల, నాగారం తదితర మండలాల్లో ఎక్కువగా మామిడి తోటలకు నష్టం చేకూరింది. మామిడికాయలు తెంపే సమయంలో ఈదురుగాలులు వీచడంతో కాయలు అధికంగా నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

News May 7, 2024

BNG: ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్

image

భువనగిరి లోక్ సభ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. గత ఎన్నికల్లో పది మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉండగా.. ఈసారి ఏకంగా 34 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తుండడం విశేషం. ఎవరికి నష్టం చేస్తారోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి భువనగిరి లోకసభ పరిధిలో 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

News May 7, 2024

NLG: ‘వందే భారత్’ కింద పడి చనిపోయాడు..! 

image

వందే భారత్ రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. భువనగిరి-పగిడిపల్లి రైల్వే లైన్ మధ్యలో పట్టాలపై వందే భారత్ రైలు కింద పడి రాత్రి ఓ గుర్తుతెలియని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు సుమారు 35 ఏళ్లు ఉంటాడని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 8712568454, 8712658719 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 7, 2024

NLG: 15 ఎకరాల లోపు రైతులకు రైతుబంధు!

image

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని జమ చేయడం ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఈ నెల 9వ తేదీలోగా రైతుబంధును పూర్తిస్థాయిలో చెల్లిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి 9గంటల లోపు 15 ఎకరాల లోపు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు సమాచారం. జిల్లాలో మొత్తం 5,15, 354 మందికి రూ 609.35 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉన్నది.

News May 7, 2024

NLG: ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం

image

జిల్లాలో రానున్న ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ రైతులను సమాయత్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచింది. సీజన్లో వరి 5.15 లక్షల ఎకరాలు, పత్తి 5.70 లక్షల ఎకరాల్లో వ్యవసాయ శాఖ అధికారులు సాగు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో పత్తి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి ఊరిలో సన్న రకాలు 2.35లక్షల ఎకరాలు, దొడ్డు రకాలు 2.80 లక్షల్లో ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేశారు.

News May 7, 2024

NLG: మంత్రాల నెపంతో వృద్ధురాలి హత్య

image

మంత్రాల నెపంతో వృద్దురాలిని హత్య చేసిన ఘటన అనంతగిరి మండలంలో చోటు చేసుకుంది. SI అజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. నడిగూడేం PS పరిధిలోని త్రిపురవరం‌ గ్రామానికి చెందిన కొమ్ము అలివేలు పశువుల కాపరిగా జీవనం సాగిస్తోంది. ఆమెకు మంత్రాలు వస్తాయనే అనుమానంతో గ్రామానికి చెందిన హుస్సేన్ మరో వ్యక్తితో కలిసి మెడకు తాడు బిగించి హత్య చేసినట్లు మనువడు సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు SI తెలిపారు.

News May 7, 2024

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

WGL- KMM- NLG పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అనిశెట్టి దుప్పలపల్లిలోని గోదాంలో ఏర్పాట్లకై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన సోమవారం గోదామును పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు 4 హాల్స్ తయారు చేయాలని, ప్రతిహాలులో 25 టేబుల్స్ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

News May 6, 2024

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏడు కంపెనీల కేంద్రబలగాలు: SP

image

NLG:పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏడు కంపెనీల కేంద్ర బలగాలు, 2600 మంది జిల్లా సిబ్బందితో ఎన్నికల నిర్వహణ పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతి యుతంగా,నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News May 6, 2024

5వ రోజు 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

image

NLG- KMM- WGL పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 5వ రోజు సోమవారం 13 మంది అభ్యర్థులు (16) సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టపద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జికి వీరు నామినేషన్లను సమర్పించారు.

News May 6, 2024

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. సోమవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 123.1741 టీఎంసీలకు చేరింది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ కాగా.. అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉంది.