India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషెస్ చెప్పారు. ఆయనను కలిసి అభినందించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. వారి వెంట దిల్ రాజు ఉన్నారు.
గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి చెందిన ఘటన మోత్కూర్ మండలం పాటిమట్టలలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. నాగపూర్ నరసయ్య (70) అనే రైతు గేదెను మేతకు తీసుకెళ్లాడు. గేదె మెడకు ఉన్న పగ్గాన్ని (తాడు) చేతికి కట్టుకున్నాడు. ఒక్కసారిగా చెరువులోకి లాక్కెళ్లడంతో చనిపోయాడు. నరసయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.7462 టీఎంసీలుగా ఉంది. ఔట్ ఫ్లో: 44,870 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో: 37,953 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
విద్యుత్ షాక్కు గురై రైతు మృతిచెందిన ఘటన ఆత్మకూర్ (ఎస్) కందగట్లలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు మంచాల సైదులు తన పొలంలో విద్యుత్మోటార్ అమర్చడానికి నియంత్రిక వద్దకు వెళ్లగా విద్యుత్ తీగ తెగి మీద పడింది. దీంతో కరెంట్ షాక్కు గురైయ్యాడు. స్థానికుల ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు తెలిపారు.
ఈనెల 17న కేతేపల్లి మండలం <<14128705>>చెర్కుపల్లిలో దారుణ హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. సీఐ కొండల్ రెడ్డి వివరాల ప్రకారం.. పిట్టల సైదులు పేరు మీద ఉన్న 2ఎకరాల భూమి పట్టాచేయాలని కొడుకు నవీన్, భార్య ప్రమీల ఒత్తిడి తెచ్చారు. సైదులు అందుకు నిరాకరించడంతో ప్రమీల, నవీన్ కలిసి రోకలి బండతో హత్య చేసినట్లు తెలిపారు. నిందితులు మండలంలోని కొండకిందిగూడెం శివారులో సంచరిస్తుండగా అరెస్టు చేశామన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.7462 టీఎంసీల నీరుంది. ఔట్ ఫ్లో: 31,196 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో: 31,196 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
తిరుమలగిరి మండలం సిద్ది సముద్రం తండాకు చెందిన ధరావత్ సాయిప్రకాష్ శుక్రవారం ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పంజాబ్ రాష్ట్రానికి ఎంపికయ్యాడు. సాయి ప్రకాష్ చిన్నతనం నుంచే చదువులో ముందు ఉండేవాడు. ఇంటర్ పూర్తికాగానే హైదరాబాద్లోని సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్గా ఎంపికయ్యాడు. దీంతో తండావాసులు సాయి ప్రకాష్ కు అభినందనలు తెలిపారు.
నూతన రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,07,259 రేషన్ కార్డులున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వారి కల నెరవేరబోతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం నుండి 40 కి.మీ భూగర్భ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ దిగువన నిర్మించబడిన సొరంగాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి 30 టీఎంసీల నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొస్తుందని తెలిపారు.
సూర్యాపేట జిల్లా యాతవాకిళ్లలో ముస్లిం దంపతులు షేక్ దస్తగిరి – సైదాబీ మత సామరస్యం చాటుకున్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలోని శ్రీ గణేశ్ మహారాజ్ లడ్డూని రూ.29,000 వేలకు కైవసం చేసుకున్నారు. భారీ ఊరిగేంపుతో లడ్డూను దస్తగిరి ఇంటికి తరలించారు. దస్తగిరి – సైదాబీ దంపతులను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.