Nalgonda

News September 19, 2024

దేవరకొండ: ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం

image

నల్గొండ జిల్లా దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైనట్లు సీఐ నరసింహులు తెలిపారు. పాఠశాల గోడ దూకి పారిపోయిన విద్యార్థులు బుధవారం అర్ధరాత్రి చింతపల్లి మండలం మాల్ పట్టణంలో పోలీసులకు దొరికినట్టు తెలిపారు. విద్యార్థులను దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

News September 19, 2024

నల్గొండ: వృద్ధురాలిపై అత్యాచారం.. కేసు నమోదు

image

నల్గొండకి చెందిన 60 సంవత్సరాల వృద్ధురాలిని హిందూపూర్ స్మశాన వాటిక వద్ద కందుల కృష్ణ అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున అత్యాచారం చేశాడని వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ తెలిపారు. విషయం ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించి వెళ్లిపోయాడని తెలిపారు. బాధితురాలు కూతురితో విషయం చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News September 19, 2024

3 రోజుల్లో సాగర్ ఆయకట్టుకు సాగునీటి విడుదల

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్‌కు సంబంధించిన నాలుగో పంపు మరమ్మతులు పూర్తయ్యాయని, 3 రోజుల్లో ఈ పంపు ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వి.అజయ్ కుమార్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు కాలువల్లో నీరు సమృద్ధిగా పారుతుందని రైతులెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.

News September 19, 2024

షీ టీమ్స్ అధ్వర్యంలో 70 కేసులు: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

image

మహిళాలు, విద్యార్థినులకు అండగా జిల్లాలో షీ టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా జిల్లాలో షీ టీమ్స్ అధ్వర్యంలో 42 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి, 28 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 13 ఫిర్యాదులు స్వకరించినట్లు చెప్పారు. ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని 45 కేసులు నమోదు చేశామన్నారు. వేధింపులపై 87126 86056 ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు.

News September 19, 2024

యాదాద్రి ఎన్నికల ప్రధాన అధికారి సమీక్ష

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేడు యాదాద్రి జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు హనుమంత్‌తో ఇంటింటి సర్వే ద్వారా చేపడుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మండలాల వారిగా సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని సర్వే చేయాలని, పక్కాగా పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, గంగాధర్ పాల్గొన్నారు.

News September 18, 2024

NLG: రోడ్డు ప్రమాదం.. మహిళా కానిస్టేబుల్ మృతి

image

సాగర్ సమీపంలో <<14133782>>రోడ్డుప్రమాదంలో<<>> చనిపోయిన మహిళను కానిస్టేబుల్ శ్రావణిగా గుర్తించారు. ఆమెది గద్వాల జిల్లా జోగులాంబ గ్రామం. కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే శ్రావణికి ఎంగేజ్మెంట్ అయింది. కాబోయే భర్త వద్దకు వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News September 18, 2024

దేవరకొండ: మైనారిటీ స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్

image

దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామపరిధిలో ప్రభుత్వ మైనార్టీ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అయినట్లు సమాచారం. నిన్న సాయంత్రం 6:00 గం.ల వరకు మిస్సింగ్ అయిన విద్యార్థుల ఆచూకీ కోసం స్కూల్ సిబ్బంది వెతికి ఫలితం లేకపోవడంతో.. స్కూల్ ప్రిన్సిపల్ దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News September 18, 2024

యాదగిరిగుట్ట: వినాయక నిమజ్జనాన్ని పరిశీలించిన ఏసీపీ

image

యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వినాయకుల నిమజ్జన కార్యక్రమాలను ఏసీపీ రమేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎరుకలి సుధా హేమేందర్ గౌడ్, సీఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

News September 18, 2024

యాదాద్రి: నిమజ్జనానికి వెళ్లి యువకుడి మృతి

image

వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌యాదవ్ (27) వినాయక నిమజ్జనం కోసం చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతిచెందాడు. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు మృతిచెందడంతో అతడి మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News September 18, 2024

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి’

image

రానున్న వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.