India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది. దీనిలోనే భాగంగా నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆయిల్ పామ్ సాగు గమనియంగా పెరుగుతుంది. దీనిపై రైతులు కూడా మక్కువ చూపుతున్నారు. గతంలో ఆయిల్ ఫామ్ చెట్లు పెంచిన రైతులు అధిక లాభాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇవాళ ఫొటో ఓటరు జాబితాను ఆయా గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలలో ప్రచురించనున్నట్లు నల్గొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ముసాయిదా ఫొటో ఓటరు జాబితాపై ఈనెల 18న జిల్లా స్థాయిలో ఎన్నికల అథారిటీ, 19న మండల స్థాయిలో MPDOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై గురువారం అయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామపంచాయతీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కలెక్టర్ తెలిపారు.
కష్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులను కోరారు. గురువారం ఆయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, ఎఫ్సిఐ అధికారులతో సమీక్షించారు. 2023 -24 ఖరీఫ్, రబీకి సంబంధించిన సీఎంఆర్ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని తెలిపారు.
సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిరుపేదల పక్షపాతిగా ప్రజల కోసం పోరాడిన గొప్ప ప్రజాపోరాట యోధుడిని ఈ దేశం కోల్పోయిందన్నారు. విలువలు,సిద్ధాంతాల కోసం తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారం ఏచూరి ఆదర్శప్రాయులని తెలిపారు.ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పట్టడంతో క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 71,001 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 43,334 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.70 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.1486 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కోసం భూములు కోల్పోనున్న రైతులకు కొంత ఊరట లభించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రింగ్ రోడ్డు కోసం సేకరించే భూముల విలువను పెంచే ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఈ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్ విలువ 60 శాతం నుంచి 120 శాతం వరకూ పెంచేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేసి నేషనల్ హైవే అథారిటీకి పంపారు.
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఉన్న సికింద్రాబాద్ – గుంటూరు రైలుమార్గంలో మొదటి దశ డబ్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బీబీనగర్ నుంచి గుంటూరు జిల్లా నల్లపాడు జంక్షన్ వరకు 243 కిలోమీటర్ల మేర సింగిల్ రైల్వే లైన్ ఉండడంతో రైలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్నాయి. ఈ మార్గంలో రెండో రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే రైలు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
మద్యం అమ్మకూడదని మునుగోడు నియోజకవర్గంలోని సింగారం గ్రామస్థులు తీర్మానించి ర్యాలీ తీశారు. స్వచ్ఛందంగా బెల్టు షాపులను మూసివేసిన వారిని సన్మానించారు. గ్రామంలో మద్యం అమ్మకాలను వందశాతం నిర్మూలించి అందరికీ ఆదర్శంగా ఉంటామని గ్రామస్థులు తెలిపారు. కాగా నియోజకవర్గాన్ని మద్య రహితంగా మార్చాలని MLA రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్ముల్) ఎన్నికలు తారస్థాయికి చేరాయి. అన్ని కోణాలలో ఆర్థిక స్తోమత, బలం, బలగం ఉన్న ఉన్నత స్థాయి అభ్యర్థులు పోటీ పడుతుండడంతో చివరి నిమిషం వరకు ఎన్నికల ఉత్కంఠగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
Sorry, no posts matched your criteria.