India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యానికి బానిసైన కుమారుడు నిత్యం డబ్బుల కోసం వేధిస్తుండడంతో విసుగు చెందిన తండ్రి గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం కొత్తతండా ఆవాసం బాపూజీ తండాలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలిలా.. తండాకు చెందిన కిరణ్ (36) మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం వేధిస్తుండడంతో అతని తండ్రి పంతులు గొడ్డలితో దాడి చేశాడు. కిరణ్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేసేందుకుగాను ప్రజాప్రతినిధులను ప్రకటించింది. NLG పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి జెండా ఎగురవేస్తారు. SRPTలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, BNGలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
ఆర్థిక ఇబ్బందులు, ఆపై కష్టాలు అయినా ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు. వాటికి ఎదురు నిలిచి ఎస్సైగా నిలిచారు. ఆమెనే నల్గొండకు చెందిన మమత. ‘2016లో మెయిన్స్లో ఫెయిలైనా పట్టు వదలకుండా 2018లో ప్రయత్నించా. అప్పుడూ నిరాశే ఎదురైంది. లక్ష్యంపై ఇష్టంతో మరింత పట్టుదలగా మూడో సారి ఉద్యోగాన్ని సాధించాను’ అంటున్నారామె. తల్లిదండ్రులు, భర్త సహకారంతోనే ఎస్సై అయినట్లు మమత చెబుతున్నారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోసం ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. 9 అడుగుల వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం వల్లభారాపు చెరువు, 9 అడుగుల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాల కోసం 14వ మైలురాయి వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేసామని తెలిపారు.
NLGలో 8 మంది జర్నలిస్టులు జీవో నెంబర్ 59లోని లొసుగులను ఆసరా చేసుకొని ఇరిగేషన్ శాఖకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని గతేడాది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ జర్నలిస్టులు అప్పటి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్తో కలిసి ‘మెస్సె ముంచన్ ఇండియా’ సంస్థ డిసెంబర్ 11 నుంచి 14 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ప్రతీయేటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ఈ ఎక్స్ పోలో ప్రదర్శిస్తారు.
చింతలపాలెం మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంకు యాజమాన్యంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ పైపుల నుంచి నీళ్లు వస్తున్న విషయాన్ని గుర్తించి సిబ్బందిని నిలదీయగా యాజమాన్యం బంకును మూసివేసింది. సంబంధిత అధికారులు స్పందించి పెట్రోల్ బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
MGU నిర్వహించిన PHD పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఆకుల రవి మంగళవారం తెలిపారు. ఈనెల 12న బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, 18న కామర్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని, ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు, నెట్, సెట్ ఇతర అర్హత పత్రాలను తీసుకురావాలన్నారు. మిగిలిన సబ్జెక్టుల వారికి త్వరలో ప్రకటిస్తామన్నారు.
విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటుండగా ఆకస్మాత్తుగా రక్తపు వాంతులు చేసుకొని ఆర్టీసీ కండక్టర్ మరణించిన ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల శివారులో జరిగింది. గ్రామానికి చెందిన వైద్యుల ప్రకాశ్(50) సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా రక్తపువాంతులు చేసుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి ఎస్సారెస్పీ కాలువ వద్ద ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపి పడేసిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.