Nalgonda

News April 30, 2024

NLG: వీరు ఎవరి ఓట్లను చీల్చుతారో..!

image

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. రెండు స్థానాల్లోనూ భారీగా స్వతంత్రులు, చిన్న పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉండటంతో వీరు ఎవరి ఓట్లను చీల్చుతారనే కంగారు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మొదలైంది. నల్లగొండలో రెండు ఈవీఎంలు, భువనగిరిలో మూడు ఈవీఎంలు ఏర్పాటు కానుండడంతో వృద్ధులు, నిరక్షరాస్యుల ఓట్లు ఎవరికి పడతాయోనని ఆందోళన నెలకొంది.

News April 30, 2024

గుత్తా నిర్ణయంపైనే అందరి ఆసక్తి

image

గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి, సోదరుడు జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తెలిసిందే. తాను సైతం ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రాజ్యాంగబద్ధమైన పదవికావడంతో, పదవీకాలం పూర్తయ్యేంతవరకు పార్టీరహితంగా అలాగే కొనసాగుతారా? లేక ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రె‌స్‌లో చేరుతారా? అనే అంశం తేలాల్సి ఉంది.

News April 30, 2024

బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

రంగారెడ్డి జిల్లా లోయపల్లికి చెందిన బూడిద బాలనర్సయ్య 2016లో నల్గొండ జిల్లాకు చెందిన మతిస్థిమితంలేని ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక మెడలో బలవంతంగా తాళికట్టి పెళ్లి అయినట్లు నమ్మించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా 9వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000జరిమానా విధించింది.

News April 30, 2024

ప్రజలను ఇబ్బందులు పెడితే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

image

పౌరులు చట్టానికి లోబడి నడుచుకోవాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామాల్లో గొడవలు పెట్టుకోవద్దని, సోషల్ మీడియా నందు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దన్నారు.

News April 30, 2024

‘ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులందరూ సహకరించాలి’

image

నల్గొండ పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు లోకసభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి కోరారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో సమావేశమయ్యారు. 

News April 29, 2024

నార్కట్ పల్లి: కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

image

బైకుని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తి మరణించిన ఘటన నార్కట్ పల్లి మండలం ఓసీటీఎల్ వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎండి.జానీ మియా ఏపీ లింగోటం నుంచి ఓసీటీఎల్ వైపు తన బైక్‌పై వస్తుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. అతడు రోడ్డు పక్కకు పడడంతో తలకు, ఇతర చోట్ల బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు.

News April 29, 2024

అక్రమంగా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ చందన దీప్తి

image

జిల్లా అధికారుల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నత అధికారులు పేర్లు చెబుతూ అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో ప్రజల నుండి డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్  ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. 

News April 29, 2024

నల్గొండ ఎంపీ ఎన్నికల బరిలో 22 మంది అభ్యర్థులు

image

నల్గొండ పార్లమెంట్ స్థానానికి 31 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 9 మంది అభ్యర్థులు నామినేషన్లు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

News April 29, 2024

NLG: ముగిసిన నామినేషన్ల విత్ డ్రా గడువు

image

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో జరగబోయే ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. ఉమ్మడి జిల్లాలో నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల తుది జాబితాను విడుదలపై రిటర్నింగ్ అధికారులు దృష్టి సారించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ప్రధాన పార్టీలు చివరి వరకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.

News April 29, 2024

భువనగిరి ఎంపీ ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు

image

భువనగిరి పార్లమెంట్ స్థానానికి 51 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 12 మంది నామినేషన్లు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.