India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రాన్స్జెండర్ని యువకులు అపహరించే ప్రయత్నం చేసిన ఘటన MBNR జిల్లా జడ్చర్ల బస్టాండులో జరిగింది. సోమవారం రాత్రి కొందరు యువకులు ట్రాన్స్జెండర్ను యువతి అనుకొని బైక్పై ఎక్కించుకుని కొత్తపల్లి ఇసుక క్వారీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గమనించిన కొందరు వారిని అడ్డుకుని 100 సమాచారం అందించారు. పోలీసులకు అక్కడికి చేరుకుని వివరాలు అడగగా నల్గొండ జిల్లా డిండి మండలం అని ఆమె చెప్పింది. యువకులు పరారయ్యారు.
నాగుల చవితి జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు దేవాలయాలలో పుట్టల వద్ద, నాగదేవత విగ్రహాలకు పాలు, పండ్లు, గుడ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నల్లగొండ పట్టణంలోని పానగల్ చారిత్రాత్మక పచ్చల, ఛాయా సోమేశ్వర దేవాలయాలు, ధరేశ్వరం రేణుక ఎల్లమ్మ దేవాలయం, మర్రిగూడెంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంతో పాటు పలు దేవాలయాలలో పూజలు నిర్వహించారు.
కుటుంబ సర్వేకు 3,964 ఎన్యుమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. 3,483 మంది ఎన్యుమరేటర్లను నియమించామని, 349 మందిని రిజర్వులో ఉంచామని, మొత్తం 3832 మంది ఎన్యుమరేటర్లు ఈ సర్వేలో పాల్గొననున్నారని వెల్లడించారు. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 349 మంది సూపర్వైజర్ లను, రిజర్వులో మరో 37 మందిని మొత్తం 386 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు.
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వివరాల సేకరణకు గాను ఎన్యుమరేటర్లను, సూపర్వైజర్లను నియమించడమే కాకుండా, వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.
కోదాడ మండలం కూచిపూడి తండాలో సాయి భగవాన్ అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విషయంలో మాట్లాడదామని పిలిచి యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి సాయి భగవాన్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మోతె మండలం రామాపురం ప్రాథమిక పాఠశాల <<14534111>>ఉపాధ్యాయుడు ఉపేందర్ మద్యం సేవించి<<>> పాఠశాలకు వస్తున్నాడని స్థానికులు, అధికారులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించారు. ఉపేందర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను మండల విద్యాధికారి ద్వారా సంబంధిత ఉపాధ్యాయుడికి అందజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఎన్యూమరేటర్లను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వే శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలో సర్వే నిర్వహణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగిందని తెలిపారు.
విద్యా ప్రమాణాల నైపుణ్యాల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాప్ హుస్సేన్ అన్నారు. ఎంజి యూనివర్సిటీలో సోమవారం అని శాఖల అధిపతులు, బి ఓ ఎస్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధిగా హాజరు ప్రమాణాలు పాటిస్తూ.. అల్మానాక్ ప్రకారం ముందుకు సాగాలని సూచించారు.
పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో రెండు నెలల పాటు పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతులకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆ సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతులు ఈ నెల 11వ తేదీలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. యువతులకు హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు.
మిర్యాలగూడ సీతారాంపురం కాలనీ రామాలయం వీధిలో ఓ వ్యక్తి గొయ్యి తవ్వుతుండగా ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. విగ్రహానికి కాలనీవాసులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. అక్కడ గుడి నిర్మించాలని కాలనీవాసులు భావిస్తున్నారు. విగ్రహాన్ని చూడడానికి స్థానికులు బారులు తీరారు.
Sorry, no posts matched your criteria.