Nalgonda

News April 28, 2024

హుజూర్‌నగర్: వడదెబ్బతో వృద్ధుడు మృతి

image

హుజూర్‌నగర్: ఎండల తీవ్రత పెరిగిపోయిన క్రమంలో స్థానిక 13వ వార్డులో వృద్ధుడు వడదెబ్బ తగిలి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 13వ వార్డులో నివాసం ఉంటున్న ధార అంజయ్య (70 ) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వడదెబ్బ తగలడంతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

News April 28, 2024

కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం:రాజగోపాల్ రెడ్డి

image

కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి సెగ్మెంట్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వల్లే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందన్నారు.

News April 28, 2024

సూర్యాపేట: ‘100 మంది మృతి.. 200 మంది దివ్యాంగులుగా మారారు’

image

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో సుమారు 200లకు పైగా ప్రమాదాలు జరగగా, వాటిలో 100 మందికి పైగా మరణించడం గమనార్హం. మరో 200 మంది ప్రమాదంలో గాయపడి దివ్యాంగులుగా మారారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ.. వాహనం నడిపే వ్యక్తులకు సరైన నిద్ర ఉండట్లేదని తమ విచారణలో తెలుస్తోందన్నారు. డ్రైవర్లు నిద్రలేమితో వాహనాలు నడపొద్దని సూచించారు.

News April 28, 2024

భువనగిరిలో CPM పోటీ నుంచి తప్పుకొంటుందా!

image

BNG లోక్‌సభ స్థానంలో CPM పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. శనివారం HYDలో సీఎం రేవంత్ రెడ్డితో CPM రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపారు. సీఎంతో సమావేశం అనంతరం CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మతోన్మాద బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌కు CPM మద్దతు ఇస్తుందని ప్రకటించారు. BNGలో పోటీ నుంచి తప్పుకొని తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని CM కోరారు.

News April 28, 2024

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

మోతె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎం.డి అంజాద్ అలీ ఖాన్ గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందారు. ఆయన సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. ఎంఇఓ గోపాల్ రావు మాట్లాడుతూ.. అంజాద్ మృతి విద్యారంగానికి తీరని లోటు అన్నారు. అంజాద్ మృతి పట్ల పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.

News April 28, 2024

నల్గొండ: ఎండలు మండుతున్నాయి..

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లా మంగపేట మండలాల్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో కొత్తగోల్‌తండాకు చెందిన కూలీ బాణోతు మంగ్యా(40) వడదెబ్బకు గురై..ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారు. ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

News April 28, 2024

పౌరుడి చేతిలో బ్రహ్మాస్త్రం సీ విజిల్: ఎస్పీ చందనా దీప్తి 

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంబంధించిన సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ప్రజలు సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. బాధ్యతాయుత పౌరుని చేతిలో బ్రహ్మాస్త్రం సి-విజిల్ యాప్ అన్నారు. 

News April 27, 2024

వేములూరి ప్రాజెక్టులో పడి వ్యక్తి మృతి

image

మండల పరిధిలోని యాతవాకిళ్ళ వేములూరి ప్రాజెక్టులో భీల్యానాయక్ తండాకు చెందిన బానోతు సైదా నాయక్ (41) ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సైదానాయక్ కొన్ని రోజులుగా మతిస్తిమితం సరిగా లేక ఊళ్లు తిరుగుతున్నాడన్నారు. శనివారం ప్రాజెక్టు వద్దకు వెళ్లిన మత్స్యకారులు సైదాను గుర్తించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News April 27, 2024

నల్గొండ: మరో ఎన్నికకు రంగం సిద్ధం

image

ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. కాగా తీన్మార్ మల్లన్న 2021లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. సూర్యాపేటకు చెందిన నరసింహా రెడ్డి, వరంగల్‌కు చెందిన రాకేశ్ రెడ్డి BRS తరఫున పోటీకి ఆసక్తి చూపతుండగా.. బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

News April 27, 2024

‘100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ’

image

తెలంగాణలో 100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ ముందుకు సాగుతున్నదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే అన్నారు. శనివారం NLGలో నూతనంగా నిర్మించిన అధునాతన 5 కోర్టుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా కోర్టులో నూతనంగా నిర్మించిన 5 కోర్టుల అధునాతన భవనంలో డిజిటలైజేషన్ తో పాటు, అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు.