India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలోని బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసి గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి యం. షకీనా తెలిపారు. NLG జిల్లాలో 18, SRPT జిల్లాలో 10, యదాద్రి జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.
NLG, MLG మున్సిపల్ పార్కులకు మహర్దశ పట్టనుంది. అమృత్ స్కీం కింద రెండు పట్టణాల్లోని పార్కులను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. లక్ష జనాభా దాటిన ఈ రెండు మున్సిపాలిటీలు గతంలో అమృత్ స్కీం కింద ఎంపికైన విషయం తెలిసిందే. ఒక్కో పార్కుకు రూ.10 లక్షలు చొప్పున రెండు మున్సిపాలిటీల్లోని మొత్తం 12 పార్కులకు రూ.1.20 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల నియమావళిని జిల్లా యంత్రాంగం పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సోషల్ మీడియా సైట్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పౌరులు బాధ్యతగా నడుచుకోవాలని ఎస్పీ తెలిపారు. అనుచితమైన కామెంట్స్, పోస్టింగులు పెడితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అనంతగిరి మండలం పాలవరానికి చెందిన నాగమణి పుట్టుకతో అంధురాలు. కాగా తల్లి ప్రోత్సాహంతో నల్గొండ అంధుల పాఠశాలలో చేరి బ్రెయిలీ లిపితో డిగ్రీ పూర్తి చేసింది. ఆమెను వివాహం చేసుకునేందుకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్తికి చెందిన సోమగాని సందీప్ ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఈ జంట ఆదివారం పెద్దల సమక్షంలో ఒకటి కానుంది.
ఉమ్మడి జిల్లాలో NLG, BNG పార్లమెంట్ స్థానాలకు స్క్రూటినీ పూర్తైంది. నామినేషన్ల పరిశీలన అనంతరం NLGలో 31 మంది అభ్యర్థులు నిలిచారు. BNGలో 51మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 29 కాగా, ఈ నెల 27వ తేదీ నాలుగో శనివారం కావడం, 28వ తేదీ ఆదివారం కావడంతో నామినేషన్లు ఆయా తేదీల్లో ఉపసంహరణకు దరఖాస్తులు స్వీకరించబోమని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
బైక్ నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ఎర్రగట్టు వద్ద జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్ దాస్ మున్షీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు 12 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరారు.
జాతీయ రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే సూర్యాపేట జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఈనెల 21న మునగాల మండలం ముకుందాపురం ప్రమాదంలో దంపతులు, గురువారం కోదాడ పరిధిలోని శ్రీరంగపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి మెత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన అనంతరం 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 51 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 31 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరి చందన తెలిపారు. తిరస్కరించిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.