India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NLG: ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసు అధికారులు సిబ్బంది పని చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం గృహ విద్యుత్తు కనెక్షన్లు 13,85,385 ఉన్నాయి. 8,78,360 కనెక్షన్లకు సున్నా బిల్లులు వస్తుండగా, 5,07,025 కనెక్షన్ల లబ్ధిదారులు పథకం ఫలాలు పొందటం లేదు. వాణిజ్య కనెక్షన్లు మినహా కొంతమంది బిల్లులు చెల్లిస్తున్నారు. దరఖాస్తుల సవరణకు ప్రభుత్వం పురపాలికలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏడు నెలలుగా గృహజ్యోతికి సంబంధించిన సైట్ తెరుచుకోలేదు.
సాగర్ జలాశయానికి సోమవారం రాత్రి ఒకేసారి 1,07,241 క్యూసెక్కుల వరదనీరు రావడంతో రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను 5అడుగులు ఎత్తి దిగువకు 16,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాత్రి 11గంటలకు 65,335 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదన ద్వారా 29151, కుడి, ఎడమ కాల్వల ద్వారా 17,584, AMRP ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. మంగళవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన విరాళాల సేకరణ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తిరిగి 29న మరోసారి జిల్లాకు విచ్చేసి కొలనుపాక, స్వర్ణగిరి క్షేత్రాలను సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం రాజ్భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా కొండపైకి ఏడు గంటలకు చేరుకుంటారు.
NLG-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్యలో డైరెక్టర్ల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 30తో పదవీ కాలం ముగియనున్న 3 స్థానాలు, గతంలో వాయిదా పడిన మరో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. SEP 4న నామినేషన్ల స్వీకరణ, 5న నామినేషన్ల పరిశీలన, అర్హత సాధించిన నామినేషన్ల ప్రకటన, 6న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు.
వివిధ పథకాల కింద షెడ్యూల్డ్ తెగల లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో 350 కోట్ల కేటాయించిందని రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో షెడ్యూల్ తెగల అభివృద్ధికై జిల్లాలో అమలు చేస్తున్న పథకాలపై గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు
విజయవాడ సమీపంలోని నందిగామకి చెందిన రాజీ అనే మహిళ సినీ హీరో చిరంజీవి కుటుంబాన్ని కలవడానికి ఇటీవలే హైదరాబాదుకు పాదయాత్ర చేపట్టింది. సోమవారం ఆమె చిట్యాలకు చేరుకున్న సందర్భంగా శాలిగౌరారం మండలం తక్కెళ్లపాడుకు చెందిన కాంగ్రెస్ నాయకులు నరేందర్, పులిగిల్ల బాలయ్య ఆమెను పలకరించి విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు భోజనం పెట్టించారు. పాదయాత్రగా వెళుతున్న మహిళకు బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు.
సాగర్ డ్యాం లీకేజీలు కలవరపెడుతున్నాయి. డ్యాం నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్లో కొన్ని బ్లాకుల నుంచి నీటి ఊట వస్తోంది. ప్రధాన డ్యాంలో 1 నుంచి 23వ బ్లాకు వరకు ఎడమ వైపు నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్ ఉండగా 24 నుంచి 50వ బ్లాకు వరకు 26 రేడియల్ క్రస్ట్ గేట్లు అమరి ఉన్న ఓవర్ ఫ్లో సెక్షన్ ఉంది. స్పిల్ వేకు కుడివైపు 51 నుంచి 76 వరకు బ్లాకులు ఉన్నాయి. జలాశయంలో గరిష్ట నీటిమట్టం వచ్చినప్పుడల్లా డ్యాం నుంచి నీరు తీకవుతోంది.
నల్గొండ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ తెలిపారు. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా సెలవు రోజు కావడంతో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదు దారులు గమనించి సెప్టెంబర్ 1న జరిగే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.
Sorry, no posts matched your criteria.