Nalgonda

News April 24, 2024

మునగాలలో మళ్లీ రోడ్డు ప్రమాదం

image

సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పశువులు అడ్డురావడంతో అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ప్రమాద సమయంలో 30 ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న కూడా మునగాల వద్ద కారు కంటైనర్ కిందకి దూసుకెళ్లిన విషయం తెలీసిందే.

News April 24, 2024

నల్లగొండలో శోభాయాత్ర రూట్‌ MAP ఇదే!

image

నేడు NLGలో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. యాత్ర కొనసాగే‌ రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు. మునుగోడు రోడ్డులోని హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై వీటీ కాలనీ టెంపుల్‌ వరకు కొనసాగుతుంది. పూల్ సెంటర్, ఓల్డ్ చౌరస్తా, క్లాక్ టవర్, శివాజీ స్టాచ్యూ, ఎల్‌వి ప్రసాద్ హస్పటల్ ల్యాండ్ మీదుగా వీటీ కాలనీ హనుమాన్ టెంపుల్‌కు చేరుకుంటుంది. ఈ రోజు సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ రూట్‌లో ఆంక్షలు ఉంటాయి.

News April 24, 2024

NLG: సూక్ష్మ పరిశీలకులది కీలక బాధ్యత

image

లోక సభ ఎన్నికలలో సూక్ష్మ పరిశీలకులది కీలక బాధ్యత అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ ఆడిటోరియం హాలులో సూక్ష్మ పరిశీలకులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా 374 మంది సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

News April 24, 2024

మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైన ఓ మహిళను పోలీసులు కాపాడారు. భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్త గొడవపడ్డాడని పట్టణ పరిధిలోని రైల్వే ట్రాక్ పైకి వెళ్తుండగా గమనించిన పోలీసులు ఆ సదరు మహిళను అడ్డుకొని నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులను జిల్లా వాసులు తోటి పోలీస్ సిబ్బంది అభినందిస్తున్నారు.

News April 24, 2024

సూర్యాపేట: కాలేజ్‌కి వెళ్లే టెన్షన్‌లో ఘోరం

image

మునగాల మండలం ముకుందాపురం వద్ద <<13101789>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతి చెందిన దంపతులు వివరాలు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన సామినేని నవీన్ రాజ, భార్గవి దంపతులు సోమవారం ఉదయం 6 గంటలకు విజయవాడకు బయలుదేరారు. నవీన్ రాజా విజయవాడలో శ్రీచైతన్య కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. కళాశాలకు చేరుకోవాలని కంగారులో అతివేగంగా డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

News April 24, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారు: జగదీశ్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీ కోసం ప్రధాని మోదీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నామినేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని 16 స్థానాల్లో తామే ముందంజలో ఉన్నామన్నారు. భువనగిరి, నల్గొండ స్థానాలలో బీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు.

News April 24, 2024

దగ్గర పడుతున్న గడువు.. నామినేషన్ల జోరు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల గడువు దగ్గర పడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 2 స్థానాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు వరుసగా ఈ 3 రోజుల పాటు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. NLG, BNG స్థానాలకు ఇప్పటి వరకు ప్రధాన పార్టీల వారు నామినేషన్లు పెద్దగా దాఖలు చేయలేదు. ప్రధాన పార్టీల నుంచి ఒకరిద్దరే నామినేషన్లు వేయగా, స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువమంది నామినేషన్లు వేశారు.

News April 24, 2024

నల్గొండ: 20ఏళ్ల తర్వాత ఎండిన మైల సముద్రం 

image

నల్గొండ జిల్లా కనగల్ మండలంలో వర్షాభావ పరిస్థితుల తోడు ఏఎమ్మార్పీ నీటిని చెరువుల్లోకి విడుదల చేయకపోవడంతో రెండు దశాబ్దాల తరువాత మొదటి సారిగా కనగల్‌ మైల సముద్రం చెరువు ఎండింది. ఈ చెరువు కింద దాదాపు 1,600 ఎకరాలకు పైగా సాగవుతోంది. 0.750 టీఎంసీల సామర్థ్యం కలిగిన మైల సముద్రం చెరువును నిజాం నవాబులు నిర్మించారు. చెరువు ఎండిపోవడంతో దీనిపై ఆధారపడ్డ 15 గ్రామాలకు పైగా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడింది.

News April 24, 2024

భువనగిరి ఎంపీ అభ్యర్థి నామినేషన్ 

image

భువనగిరి కలెక్టరేట్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పొన్నాల లక్ష్మయ్య, ముత్తిరెడ్డి యాదగిరి, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి పాల్గొన్నారు. 

News April 22, 2024

చామల గెలుపు కోసం లండన్‌లో ప్రచారం 

image

లండన్ బ్రిడ్జి వద్ద భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ వివిధ గ్రామాల లండన్ ఎన్నారైలు కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. అమరపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థి దశ నుంచే విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా అనేక ప్రజ సమస్యల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన NRI యువకులు పాల్గొన్నారు.