India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఆపోజిషన్ పార్టీలు ఉంటాయా అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. మళ్ళీ 20 సంత్సరాలు ఎవరు మాట్లాడరు అన్నారు. నల్గొండలో 12కి 12 గెలుస్తామని చెప్పామని.. కానీ కొద్దిలో సూర్యాపేట పొట్టోడు మిస్ అయ్యాడన్నారు. భవనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు.
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 507.30 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 127.1321 టీఎంసీల నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 6,398 క్యూసెక్కులు ఉంది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసేపట్లో భువనగిరికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొంటారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి వినాయక చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహిస్తారు. కాగా.. రేవంత్ సీఎం అయ్యాక భువనగిరికి రావడం మొదటి సారి. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలికడానికి భారీగా ఏర్పాట్లు చేశారు.
28 ఏళ్ల కిందట నల్గొండ లోకసభ ఎన్నికల్లో 480 మంది అభ్యర్థులు పోటీలో నిలిచి రికార్డు సృష్టించారు. ఒకే పార్లమెంట్ స్థానం నుంచి 480 మంది అభ్యర్థులు బరిలోకి దిగడానికి నీటి సమస్యే అసలు కారణం. జిల్లా నుంచే జీవ నదులు ప్రవహిస్తున్నా నీటి కేటాయింపులో మాత్రం వివక్ష ఎదురవుతోందని జల ఉద్యమకారులు భావించారు. కృష్ణానది జలాల్లో 76 శాతం వాటా తమకు రావాల్సిన ఉన్నా రాజకీయాల కారణంగా అది దక్కకుండాపోయిందని పోరాటం చేశారు.
ఆదివారం సెలవు ఇవ్వనందుకు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. దేవరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పనిచేస్తున్న శంకర్ ఆదివారం సెలవు కావాలని ఉన్నతాధికారులను అడగ్గా కుదరదని చెప్పడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
నార్కెట్ పల్లి అద్దంకి రహదారిపై బొత్తలపాలెం వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిరికంటి సైదయ్య మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తల పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సైదులు విధులకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
తిప్పర్తి మండలంలో శనివారం యువతి అదృశ్యమైంది. సర్వారం గ్రామానికి చెందిన సదరు యువతికి వివాహం నిశ్చయమైంది. ఈనెల 24న వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిప్పర్తి ఎస్ఐ రాజు తెలిపారు.
మిర్యాలగూడ టీఎన్జీవోస్ (NSP) యూనిట్ ఉపాధ్యక్షులు షేక్ మౌలానా (48) శనివారం గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆయన MLG నీటిపారుదలశాఖ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. టీఎన్జీవోస్ ఉద్యోగుల సమస్యలపై క్రియాశీలకంగా పని చేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి (దేవరోనితండా)కు చెందిన ఇస్లావత్ సిద్దు (20) శేరిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ శ్రీదత్త ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లమా(EEE) 3వ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం స్నేహితులతో కలిసి ఉండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే సిద్దు కన్నుమూశాడు.
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం HYD నుంచి హెలికాప్టర్లో వస్తే భువనగిరి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగనున్నారు. రోడ్డు మార్గంలో వస్తే పెద్ద చెరువు నుంచి టాప్స్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ HYD చౌరస్తా, జగదేవపూర్ చౌరస్తా మీదుగా వినాయక చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ అనంతరం సాయిబాబా గుడి వరకు ర్యాలీగా ముందుకు సాగుతారు.
Sorry, no posts matched your criteria.