Nalgonda

News April 21, 2024

నల్గొండ జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారు

image

వచ్చే వానాకాలం-2024 సీజన్ పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ వానాకాలం సీజన్లో మొత్తం 11,47,954 ఎకరాల్లో వివిధ పంటల సాగుకు ప్రణాళికను ఖరారు చేసింది. అందు లో వరి 5,19,160 ఎకరాలు, పత్తి 5.40లక్షల ఎకరాలు, కంది 4,710, పెసర 1,468, మినుములు 946, జొన్న 185, నువ్వులు 35, వేరుశనగ 1,145, జనుము 56,030, జీలుగ 15,440, పిల్లిపెసర 8,835 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది.

News April 21, 2024

24న మిర్యాలగూడకు కేసీఆర్: భాస్కర్ రావు

image

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ MP అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మిర్యాలగూడ మాజీ MLA నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సిఎం కేసీఆర్ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు. కేసీఆర్ శ్రీకారం చుట్టనున్న రోడ్ షో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుందని తెలిపారు.

News April 21, 2024

మే 26 నుంచి అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రధమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 26 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ కో-ఆర్డినేటర్ డా.సుంకరి రాజారామ్ తెలిపారు. ప్రధమ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజు మే 6 వరకు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు 7382929758, 9553568049 నంబర్లను సంప్రదించాలన్నారు.

News April 20, 2024

NLG: కొయ్యలకు నిప్పు.. భూసారానికి ముప్పు!

image

ఉమ్మడి జిల్లాలో యాసంగిలో వరి కోతల అనంతరం కొయ్యలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
వరి కోతల తరువాత మిగిలిన కొయ్యలను కాల్చి బూడిద చేయడంతో ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్నారు. పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో భూమి విపరీతంగా వేడెక్కి భూసారం కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు కూడా మరణిస్తాయని తెలిపారు.

News April 20, 2024

NLG: కూతురి ప్రాణాలు కాపాడండి.. రూ.7లక్షలు అవసరం

image

మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన కంపసాటి వెంకన్న- అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్దకుమార్తె సింధు కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యానికి రూ.10లక్షలు అవసరం కాగా, అప్పు చేసి రూ.3 లక్షలు వెచ్చించి వైద్యం చేయిస్తున్నామని వారు చెబుతున్నారు. ఇంకా రూ.7 లక్షలు అవసరమవుతుందని, దాతలు ఆదుకోవాలని కోరారు.

News April 20, 2024

ఈ ఎన్నికల తరువాత BRS అడ్రస్ లేకుండా పోతుంది: ఉత్తమ్ 

image

చింతలపాలెం మండలంలో శనివారం నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 14 MP సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని, ఈ ఎన్నికల తరువాత BRS అడ్రస్ లేకుండా పోతుందని అన్నారు. బీజేపీని నమ్మే వాళ్ళు లేరని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని తెలిపారు.

News April 20, 2024

నాగార్జునసాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్

image

నాగార్జునసాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ మొదలైంది. జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి శనివారం ఎమర్జెన్సీ పంపింగ్‌ను ప్రారంభించారు. మొత్తం పది పంపులతో నీటిని తోడేస్తున్నారు. సాగర్‌లో HYD నగర తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమర్జెన్సీ పంపింగ్ మొదలైనా, ఇంకా ఎమర్జెన్సీ పరిస్థితులొస్తే రెండో దశ ఎమర్జెన్సీ పంపింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లన్నీ చేసి సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News April 20, 2024

ఫుడ్ పాయిజన్‌పై కేంద్రం సీరియస్

image

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి‌లో ఫుడ్ పాయిజన్‌పై కేంద్రం సీరియస్ అయింది. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ బృందాన్ని ఆదేశించింది. ఈనెల 22న భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకులానికి NCSC బృందం సభ్యులు రానున్నారు. ఫుడ్ పాయిజన్ పై కేంద్రానికి NCSC బృందం నివేదిక ఇవ్వనున్నది.

News April 20, 2024

ఈనెల 23న యాదాద్రి హుండీలు లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని‌ ఈనెల 23న లెక్కించనున్నట్లు శనివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News April 20, 2024

భానుడు ఉగ్రరూపం.. పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య

image

ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో వడగాల్పుల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వడగాల్పుల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 15 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. తాజాగా నల్గొండ మండలం చందనపల్లిలో కొండయ్య (50) వడదెబ్బతో మృతి చెందారు.