India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట్ జిల్లాలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆత్మకూర్(ఎస్) మండలంలోని నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయంవద్ద ఆడుకుంటున్న అన్నదమ్ములపై గోడ కూలింది. ఈ ఘటనలో బాలుడు హిమాన్ష్(3) మృతి చెందాడు. అన్న దేవాన్ష్(5) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం ఆదర్శంగా నిలిచింది. డ్రగ్స్ నివారణే ధ్యేయంగా రామాలయంలో యువకులు సమావేశం నిర్వహించారు. గ్రామంలోని పాన్ షాపులన్నీ మూసి వేయాలని తీర్మానించారు. పాన్షాప్ యజమానులకు 2రోజుల గడువు ఇచ్చి తీసివేయాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. గడిచిన 2 రోజుల్లో 1,29,046 ఇళ్లల్లో 4,77,113 మందిని పరీక్షించారు. వీరిలో 1,228 మందికి జ్వరం లక్షణాలు కనిపిచడంతో 520 కిట్ల ద్వారా డెంగి పరీక్షలు చేశారు. వారిలో ఇద్దరికి మాత్రమే డెంగి ఉన్నట్లు గుర్తించగా.. మరి కొంతమందికి మలేరియా, చికెన్ గున్యా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
SC వర్గీకరణ పేరుతో BJP మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతుందని మాల మహానాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదులు విమర్శించారు. BJP తన ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. ఇలా జరుగుతుందనే 2004లో ఎస్సీ వర్గీకరణ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు.
ఉమ్మడి జిల్లాలో LRS దరఖాస్తుల పరిశీలన అధికారులకు సవాలుగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రణాళిక విభాగాల్లో 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చాలావరకు అధికారుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం అంత సులువుగా కనిపించడం లేదు. 3 నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
నాగార్జునసాగర్ నుంచి 2 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 3 గంటలకు శ్రీశైలం నుంచి 69,884 క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరగా.. సాగర్ నుంచి 2 గేట్లను 7అడుగుల మేర ఎత్తి 22,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కుడికాల్వ ద్వారా 8,375, ఎడమకాల్వ ద్వారా 7,518, ప్రధాన విద్యుత్తు కేంద్రం ద్వారా 29,191 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సోమవారం జరిగే రాఖీ పండుగ విషయంలో అపోహలు, వదంతులు నమ్మవద్దని గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన వేద పండితులు శివాజీ శర్మ తెలిపారు. రాఖీ ఫలానా సమయంలో మాత్రమే కట్టుకోవాలి.. మిగతా సమయాలలో రాఖీ కడితే కీడు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాఖీ పండుగ రోజు ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు రాఖీ కట్టుకోవచ్చని పేర్కొన్నారు.
‘ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం.. సవాల్ విసిరిన హరీశ్రావు రాజీనామా చేయమంటే నాటకాలాడుతున్నారు’ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన HYD గాంధీభవన్లో మాట్లాడారు. గత BRS సర్కార్ రూ.లక్ష రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తే బ్యాంకు వడ్డీలకూ సరిపోలేదని విమర్శించారు. ఇకనైనా హరీశ్ రావు నాటకాలు ఆపాలన్నారు.
డీసీసీబీ పరిధిలోని సహకార సంఘాల ద్వారా కొత్త రైతులకు వానాకాలం సీజన్లో రూ.90 కోట్లు పంట రుణాలు ఇస్తామని బ్యాంక్ ఛైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. డీసీసీబీ కింద 89,888 మంది రైతులకు రూ.499.48 కోట్లు రుణమాఫీకి ప్రభుత్వానికి నివేదిక పంపగా.. 52,708 మంది రైతులకు రూ. 279.76 కోట్లు వచ్చాయన్నారు. వచ్చేవారం రుణమాఫీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రాని వారికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ, ఏఎంఆర్పి ,ఎల్ ఎల్సి కాల్వల ద్వారా అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తామని.. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ, ఏఎం ఆర్ పిఎల్ ఎల్సి ద్వారా సాగునీరు విషయమై శనివారం అయన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.