India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భువనగిరి లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తన నామినేషన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. చేతిలో నగదు బ్యాంకు డిపాజిట్ కలిపి రూ.7,74,90,802.26 ఉంది. భార్య పేరుపై రూ.1,45,60,147.82 ఉన్నాయి. స్థిరాస్తుల విలువ రూ.7,43,20,516, తన పేరుపై అప్పు రూ.1,28,17,844, తన భార్య పేరుపై రూ.1,93,83,212 ఉందని పేర్కొన్నారు.
నల్గొండ-నకిరేకల్ రహదారిలో తిప్పర్తి మండలం పెద్ద సూరారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. సుందర్ రావు సమీప బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. అనంతరం నల్గొండకు వస్తుండగా పెద్ద సూరారం వద్ద అడవి పందులు రోడ్డుకు అడ్డుగా రావడంతో వాటిని తప్పించబోయి చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో సుందర్ రావు అక్కడికక్కడే మరణించారు.
పాలీసెట్-2024 ప్రవేశ పరీక్ష తేదీ షెడ్యూల్లో మార్పు జరిగినట్లు NLG పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.జానకీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మే 17న జరగాల్సిన పరీక్ష 24వ తేదీకి మార్చినట్లు చెప్పారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కళాశాలలో సివిల్ మెకానిక్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ మూడేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
రైలు పట్టాల సమీపంలో మంటలు వ్యాపించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి MLG సమీపంలోని కుక్కడం వద్ద చోటు చేసుకుంది. కుక్కడం వద్ద రైలు పట్టాల సమీపంలో రైతులు ఎండిపోయిన వరి కొయ్యలకు నిప్పుపెట్టడంతో మంటలు క్రమంగా వ్యాపిస్తూ రైలు పట్టాల వద్దకు వచ్చాయి. దీంతో విషయాన్ని తెలుసుకున్న రైల్వే సిబ్బంది గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నిలిపివేశారు.
తాగునీటి విషయంలో జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నల్లగొండ మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ టేయిల్ పాండ్ రిజర్వాయర్లో 2.92 టీఎంసీల నీరు, అలాగే ఉదయ సముద్రం రిజర్వాయర్లో 1.10 టిఎంసిల నీరు నిలువ ఉందని అన్నారు. ఈ నీరు రాబోయే
4 నెలల పాటు జిల్లాలోని ప్రజలకు తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేస్తామని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు లీటర్లకు లీటర్లు బీర్లను లాగించేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉండడంతో అదే స్థాయిలో బీర్ల విక్రయాలు పెరిగాయని అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని కొన్ని మద్యం దుకాణాల్లో బీర్లు దొరకడం లేదు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతులకు బ్యూటీపార్లర్ కోర్స్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు SBI RSET డైరెక్టర్ ఈ.రఘుపతి శుక్రవారం తెలిపారు. 30 రోజుల పాటు ఉచిత శిక్షణను భోజన, వసతి సౌకర్యములతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీలోపు నల్గొండ పట్టణంలోని రామ్ నగర్ లో గల SBI RSET కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
టాలీవుడ్ నటుడు రఘుబాబు కారు ఢీకొని నల్గొండ BRS నేత సందినేని జనార్దన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.
కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకి చెందిన దాసరి వెంకటేశ్వర్లు శుక్రవారం పశువులు మేపడానికి పొలానికి వెళ్ళాడు. కాగా దాహం వేయడంతో మంచినీళ్లు తాగడం కోసం బావిలోకి దిగి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు , అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం- 12 అందినట్లు సంబంధిత శాఖల అధికారులు ధ్రువీకరణ ఇవ్వాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో NLG పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో పోస్టల్ బ్యాలెట్ విషయమై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.