India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవాలయాల్లో పాలకమండళ్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ రంగం సిద్ధం చేస్తోంది. యాదాద్రి BNG, SRPT, NLG జిల్లాలతో సహా జనగామలోని ఆలయ పాలక కమిటీల నియామకానికి దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ సులోచన ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని 34 దేవాలయాలకు ధర్మకర్తల మండళ్ల ఎంపిక కోసం ఆసక్తి గల వారు 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
చేనేత, టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు నల్గొండ జిల్లా చేనేత సహయ సంచాలకుడు ద్వారక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉండి.. పదో తరగతి ఉత్తీర్ణులైన 25 ఏళ్లలోపు అభ్యర్ధులు ఈనెల 31లోపు జిల్లా చేనేత కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
LRS దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి జాగ్రత్తగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర అన్నారు. LRS దరఖాస్తుల పరిష్కారంపై శిక్షణలో భాగంగా ఈ నెల 14న జిల్లాలోని 15 మండల బృందాలకు శిక్షణ ఇవ్వగా.. శుక్రవారం తక్కిన మండల బృందాలకు శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అమావాస్య కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక అమావాస్య రోజుల్లో నిత్యం ఇక్కడ రాత్రి బస్సు చేయడానికి సుమారు 50 వేల మందికి పైగానే వస్తున్నారు. ఆలయానికి భారీగా ఆదాయం వస్తున్నా.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ యంత్రాంగం విఫలమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో ICDS ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న పలువురు ఆయాలు రెండు నెలలుగా అయోమయంలో పడ్డారు. గత మే మాసంలో ప్రభుత్వం 65 ఏళ్లు పైబడిన ఆయాలతో పాటు టీచర్లతో ఉద్యోగ విరమణ చేయించాలని నిర్ణయించింది. అయితే ఆయాలకు విద్యార్హత సర్టిఫికెట్లు లేకపోవడంతో వారిని ఉద్యోగ విరమణ చేయించడం అధికారులకు తలనొప్పిగా మారింది. అధికారుల అంచనా ప్రకారం కొందరిని 65ఏళ్ల పైబడిన వారిగా గుర్తించారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు దఫాల్లో చేసిన రుణమాఫీ కొందరు రైతులకు అంద లేదు. దీనిపై జిల్లా వ్యాప్తంగా 12,966 మంది రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మూడు విడతల్లో మాఫీ కాని రైతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు మండల వ్యవసాయ అధికారిని నోడల్ అధికారిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వీరికి రెండు మూడు రోజుల్లో రుణమాఫీకి సంబంధించిన లాగిన్ ఇవ్వనున్నారు.
➽పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
➽ప్రస్తుత నీటిమట్టం: 590 అడుగులు
➽ఇన్ ఫ్లో: 79,535 క్యూసెక్కులు
➽ఔట్ ఫ్లో: 79,535 క్యూసెక్కులు
➽విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా: 29,150 క్యూసెక్కులు
➽కుడికాల్వ ద్వారా : 8,067 (క్యూసెక్కులు)
➽ఎడమ కాల్వ ద్వారా: 7,518
➽ఏఎమ్మార్పీకి : 1800
➽వరద కాల్వకు: 600
ఎగువన కురిసిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్కు వరద నీరు చేరడంతో నాలుగు గేట్లను ఎత్తి వేశారు. ఐదు అడుగుల మేరకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ కాలువల నుంచి ఆయకట్టు భూములకు నీటిని వదిలారు. సమాన స్థాయిలో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ఉంది.
గంజాయి ముఠాను సుమారు 34 కిలోమీటర్లు ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. HYD-విజయవాడ హైవేలోని పతంగి టోల్ ప్లాజా వద్ద నలుగురు సభ్యులున్న ఓ గంజాయి ముఠాను నల్గొండ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఈరోజు పసిగట్టారు. అక్కడ వారిని అడ్డుకోగా కారుతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకోవడంతో ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంబడించి HYD శివారు అబ్దుల్లాపూర్మెట్ JNNURM వద్ద అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయిను సీజ్ చేశారు.
నాగార్జునసాగర్ డ్యాం రెండు గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు కొనసాగించారు. శ్రీశైలం నుంచి 63,129 క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయానికి చేరుతోంది. నీటిమట్టం గరిష్ట స్థాయి 590 అడుగులకు చేరడంతో ఎన్ఎస్పీ అధికారులు రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.