Nalgonda

News October 10, 2024

చౌటుప్పల్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉద్యోగాలు

image

చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన అఫ్జల్ ఖాన్, ఖాజాబీ కుటుంబ సభ్యులు డీఎస్సీ ఫలితాలలో ఉద్యోగాలు సాధించారు. వారి కుమారులు జావిద్ ఖాన్ SGT, ఖాదీర్ ఖాన్ PGT ఇంగ్లిష్, కోడలు అసినా బేగం TGT Maths , గురుకులంలో ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. దీంతో గ్రామస్థులు అభినందనలు తెలిపారు. తండ్రి పాన్ షాప్ నడుపుతూ తమను బాగా చదివించినట్లు వారు తెలిపారు.

News October 10, 2024

NLG: సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..

image

సద్దుల బతుకమ్మ పండుగను నేడు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సెంటర్లు, కాలనీలు, ఆలయాల్లో మహిళలు ఘనంగా జరుపుకోనున్నారు. ఇందు కోసం మున్సిపల్ శాఖ ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ ఆడే కూడళ్ల వద్ద విద్యుత్ లైట్లను అమర్చారు. నల్గొండలో వల్లభరావు చెరువు, సూర్యాపేటలో సద్దుల చెర్వు వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

News October 10, 2024

NLG: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: మంత్రి

image

క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే ముందు ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఖేలో ఇండియా ఉమెన్ కోకో రాష్ట్ర ట్రాయాల్స్ సెలక్షన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలన్నారు.

News October 9, 2024

MLG: ఒకే ఏడాదిలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

image

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైన ఈరోజుల్లో మిర్యాలగూడ మండలం జాలుబావి తండాకు చెందిన భూక్యా సేవా రాథోడ్ ఒకే ఏడాదిలో ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. ఇటీవల వెల్లడించిన DSC ఫలితాలలో SA, తెలుగు 8 ర్యాంక్‌తో పాటు SGT ఉద్యోగం సాధించారు. గతంలో గురుకుల జేఎల్ (13 ర్యాంక్), పిజిటి (8 ర్యాంక్), TGT, TSPSC జూనియర్ లెక్చరర్ 13 ర్యాంక్ ఉద్యోగాలు సాధించారు. నేడు సీఎంతో నియామక పత్రం అందుకున్నారు.

News October 9, 2024

మిర్యాలగూడ: టీచర్ అయిన రిక్షావాలా కొడుకు

image

మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన ముడావత్ గణేశ్ డీఎస్సీ – 2024 ఫలితాల్లో ఎస్టీ విభాగంలో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. తండ్రి మూడావత్ పంతులు రిక్షా తొక్కుతూ, తల్లి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు సంతానం. చిన్న కుమారుడు గణేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News October 9, 2024

చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న తిప్పర్తి మండల పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పుట్టా యాదగిరి గుండెపోటుతో మృతిచెందారు. పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 9, 2024

నల్గొండ: యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి నర్సిరెడ్డి

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం టీఎస్‌యూటీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అలుగుబెల్లి నర్సిరెడ్డి బరిలో నిలవనున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను 2025 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో నిలపాలని TSUTF రాష్ట్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. వర్చువల్‌గా నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదించారు.

News October 9, 2024

రేపు దద్దరిల్లనున్న నల్గొండ

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ముస్తాబైంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మైదానాలు బతుకమ్మ వేడుకలకు రెడీ అయ్యాయి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి జిల్లా కేంద్రాలతో ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెంటర్లకు తీసుకొస్తారు. మైదానాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 9, 2024

నల్గొండ: పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ టీచర్‌గా సెలక్ట్

image

ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కొట్టడమే కష్టం. ఇక జాబ్ వచ్చాక రిలాక్స్ అయి పోతుంటారు కొందరు. అలాంటిది నేరేడుగొమ్ము మండలంలోని తిమ్మాపురం గ్రామానికి నిరంజన్ రెండు ఉద్యోగాలు సాధించాడు. పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో పట్టు వదలకుండా ప్రిపేర్ అయ్యాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో టీచర్‌గా ఎంపికయ్యాడు.

News October 9, 2024

దేవాలయ ధర్మకర్తల మండలికి దరఖాస్తులు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17 దేవాలయాలకు నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ సహాయ కమిషనర్ అనపర్తి సులోచన ఒక ప్రకటనలో తెలిపారు. కట్టంగూర్, చిట్యాల, నకిరేకల్, కేతేపల్లి, నార్కట్ పల్లి మండలాలలోని ఆలయాల్లో ధర్మకర్తల మండలికి 20 రోజుల్లోగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆమె సూచించారు.