Nalgonda

News October 7, 2024

NLG: ఉపాధి ప్రణాళికకు అధికారుల కసరత్తు

image

జిల్లాలో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించడమే లక్ష్యంగా అధికారులు ఉపాధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 84 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పనుల గుర్తింపునకు శ్రీకారం చుట్టిన అధికారులు ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. నవంబర్ మాసం చివరినాటికి పనుల లక్ష్యాన్ని నిర్ధారించనున్నారు. జిల్లాలో 3,58,571 జాబు కార్డులు ఉన్నాయి.

News October 7, 2024

NLG: కూతురుతో కలిసి తల్లి మిస్సింగ్

image

కుటుంబ తగాదాలతో భర్తతో గొడవపడి కుమార్తెను తీసుకుని మహిళ ఇంటి నుంచి వెళ్లిపోయింది. నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన కత్తుల సుధ తన భర్త ప్రసాద్‌తో గొడవపడి కుమార్తె కావ్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సుధ మానసికవ్యాధితో బాధపడుతుందని ఆమె అత్త కత్తుల ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News October 6, 2024

బెల్ట్ షాపులు తీసేస్తే రూ.10 లక్షలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులు నిర్మూలించిన గ్రామాలకు వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బెల్ట్ షాపుల నిర్మూలనతో గ్రామంలోని వారు మద్యం సేవించకుండా పని చేసుకుంటున్నారని ఎమ్మెల్యేకు మహిళలు వివరించారు. అంతేకాకుండా బెల్ట్ షాపుల మూసివేతకు పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

News October 6, 2024

నల్గొండ: ఐటీఐలో కొత్త కోర్సులకు అడ్మిషన్లు

image

2024-25 విద్యా సంవత్సరంలో ఐటీఐలో కొత్తగా ప్రారంభించిన కోర్సులకు 6వ దశ వాక్ ఇన్ అడ్మిషన్లు ఈ నెల 9వరకు జరుగుతాయని ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్) ప్రిన్సిపల్ ఎ.నర్సింహాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు అర్హులని పేర్కొ న్నారు. అభ్యర్థులు https://iti.telangana.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 9వ తేదీలో హాజరు కావాలని తెలిపారు.

News October 6, 2024

నల్గొండ బైపాస్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

image

నల్గొండ సమీపంలోని మర్రిగూడ బైపాస్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 15 నుంచి 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బైపాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండగా రోడ్డుపై పెట్టిన బారికేడ్‌ను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

News October 5, 2024

NLG: అరిచాడని భర్త తల పగలగొట్టింది..!

image

భర్త తలను భార్య పగలగొట్టిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. నల్గొండ వాసి శివ కాంట్రాక్టర్‌. కాగా భార్య, పిల్లలతో కలిసి KPHB రోడ్డు NO.3లో ఉంటున్నాడు. శుక్రవారం శివ స్నానం చేసే టైంలో వీపు తోమాలని భార్యపై అరిచాడు. ‘ఇరుగు పొరుగు వారు వింటే ఇజ్జత్ పోతుంది.. ఎందుకలా అరుస్తున్నావ్’అంటూ క్షణికావేశంలో రాయితో భర్త తల పగలగొట్టగా రక్తస్రావమైంది. అనంతరం శివ PSలో ఫిర్యాదు చేశాడు.

News October 5, 2024

రైతుబంధులో అవకతవకలు జరిగాయి: మంత్రి పొంగులేటి

image

రైతుబంధులో అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తిరుమలగిరి మం. నెల్లికల్‌లో భూసమస్యల పరిష్కారం కోసం రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్టిఫికెట్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

News October 5, 2024

NLG: బీఈడీ ఫలితాలు విడుదల

image

MG యూనివర్సిటీ పరిధిలో బీఈడీ సెమిస్టర్ ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ లక్ష్మీప్రభ శుక్రవారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌లో 92.6 శాతం, మూడో సెమిస్టర్లో 79.30 శాతం, రెండో సెమిస్టర్లో 84.96 శాతం, మొదటి సెమిస్టర్లో 77.7 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News October 5, 2024

యాదాద్రి: భార్యను హత్య చేసిన భర్త

image

మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 5, 2024

నేటి నుంచి నల్గొండలో చేనేత హస్తకళా మేళా

image

నల్గొండ బోయవాడలో గల ఎస్బీఆర్ గార్డెన్స్‌లో ఈ నెల 5 నుంచి 27 వరకు కళాభారతి చేనేత హస్తకళ మేళా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఇందులో అఖిలభారత హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలంతా ఈ ప్రదర్శనను తిలకించి చేనేతను ఆదరించాలని కోరారు. చేనేత కళాకారులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్త్రాలను అమ్మడం జరుగుతుందని తెలిపారు.