India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగార్జునసాగర్ జలాశయ సమాచారం..
పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం: 589.90 అడుగులు
నీటి నిల్వ సామర్థ్యం: 312.45 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ: 311.74 టీఎంసీలు
ఇన్ ఫ్లో 46,839 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 46,839 క్యూసెక్కులు
గుండ్లపల్లి (డిండి) మండలం టీ.గౌరారం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది పంబాల వేణుగోపాల్ను హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళిత నిరుపేద కుటుంబానికి చెందిన కాశమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించిన పంబాల వేణుగోపాల్ దేవరకొండలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించారు.
జాజిరెడ్డిగూడెం మండలం వేల్పులచర్ల వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బైక్ కింద పడడంతో వెనకాల కూర్చున్న గోల్కొండ లక్ష్మమ్మ మృతి చెందింది. భర్త బాలనర్సయ్యకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో రోడ్డుపై పడిఉన్న ఆమెను భర్త ఒడిలోకి తీసుకొని భర్త కన్నీరుమున్నీరయ్యాడు. రోదిస్తూ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపిన తీరు గుండెలను పిండేసింది.
గుప్త నిధుల తవ్వకాలకు వెళ్లిన గుండాల మండలానికి చెందిన ఓ వ్యక్తి బండరాయి మీద పడి దుర్మరణం చెందాడు. సీతారాంపూర్ గ్రామానికి చెందిన పోలాస్ సత్తయ్య MBNRజిల్లా సల్కార్ పేట సమీపంలోని ఓ చెరువుకట్ట వద్ద తూములో గుప్త నిధులు ఉన్నాయని సమాచారం అందడంతో ఏడుగురు వ్యక్తులు బృందంగా ఏర్పడి 4 నెలలుగా సుమారు 18 అడుగుల లోతుకు పైగా గుంత తొవ్వారు. మే17న లోపలికి దిగిన సత్తయ్య పై బండరాయి పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
నాగార్జునసాగర్ జలాశయ తీరంలో మంగళవారం మొసళ్లు కనిపించాయి. దీంతో జలాశయ తీరంలో చేపలు పట్టే మత్స్యకారులు, బట్టలు ఉతుక్కునేందుకు నీటిలోకి దిగేవారు, లాంచీ స్టేషన్లో లాంచీలు ఎక్కే పర్యాటకులు, విధులు నిర్వర్తించే ఎస్పీఎఫ్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఎన్ఎస్పీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన వరదతో సాగర్ జలాశయంలోకి మొసళ్లు రావడం సహజమని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి గ్రామంలో, ప్రతి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగాలన్నారు.
బోధనా సిబ్బంది నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా గల బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించేందుకు జరుగుతున్న ఇంటర్వ్యూలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టులు, నియమాకం కాంట్రాక్టు పద్దతిలో నియమించుటకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు 39% మాత్రమే పూర్తయ్యాయని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్ల సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయించామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ హాయాంలో 90% ప్రాజెక్టు పూర్తి చేశామని చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.
విద్య, వైద్య ఆరోగ్య సంక్షేమంలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన మోడల్ ఆస్పత్రులలో ఈనెల 15 నుంచి ప్రసవాలతోపాటు, చిన్నపిల్లల వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అయన కలెక్టర్ కార్యాలయం నుంచి మోడల్ ఆస్పత్రులలో వైద్య సౌకర్యాలు, జ్వర సర్వేపై జిల్లాలోని వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేవరకొండ పట్టణం గాంధీ నగర్కి చెందిన RTC ఉద్యోగి నేనావత్ చందు సువర్ణ ఇంట్లో దొంగతనం జరిగింది. మూడు గంటల సమయంలో తాను షాపింగ్కి వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 6 తులాల బంగారు గొలుసు, 60 తులాల వెండి, 19 వేల నగదు అపహరించారని సువర్ణ పోలీసులకి ఫిర్యాదు చేశారు. గంటన్నరలోనే చోరీ చేశారని ఆమె విలపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI తెలిపారు
Sorry, no posts matched your criteria.